యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్కు ఉచిత యాప్
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ తన వీడియో క్రియేటర్లకు శుభవార్త చెప్పింది. వీడియోలను సులువుగా రూపొందించుకునేలా ‘యూట్యూబ్ క్రియేట్’ పేరిట కొత్త యాప్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వినియోగదార్లకే
వచ్చే ఏడాది యాపిల్లోనూ
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ తన వీడియో క్రియేటర్లకు శుభవార్త చెప్పింది. వీడియోలను సులువుగా రూపొందించుకునేలా ‘యూట్యూబ్ క్రియేట్’ పేరిట కొత్త యాప్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా రూపొందించిన డ్రీమ్ సీన్ ఫీచర్ను కూడా టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని సాయంతో షార్ట్ వీడియోలకు ఏఐ ఆధారంగా రూపొందించిన వీడియోలు, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్లు జోడించటానికి వీలుంటుంది.
కొత్త జనరేటివ్ ఏఐ ఆధారిత యాప్లో ఎడిటింగ్ ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. టిక్టాక్ మాదిరిగానే బీట్-మ్యాచింగ్ టెక్నాలజీతో ఉండే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ను వినియోగదారులు వాడుకోవచ్చు. ‘ఎవరైనా వీడియోలను క్రియేట్ చేయాలన్నా, షేర్ చేయాలన్నా సులువుగా ఉండేందుకు ఈ అప్లికేషన్ను అభివృద్ధి చేశాం. షార్ట్, లాంగ్ వీడియోలను రూపొందించడానికి దీన్ని తీసుకొచ్చాం’ అని యూట్యూబ్ కమ్యూనిటీ ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ తెలిపారు. ఇదో ఉచిత యాప్. ప్రస్తుతం భారతదేశం, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండోనేషియా, కొరియా, సింగపూర్తో సహా ఎంపిక చేసిన మార్కెట్లలో ఆండ్రాయిడ్లో బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వచ్చే ఏడాది ఐఫోన్లో ఈ యాప్ను ప్రవేశపెడతామని యూట్యూబ్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన అమెరికా అనుబంధ సంస్థ, గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్., సిల్డెనాఫిల్ ఓరల్ సస్పెన్షన్ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఈ మందు వయాట్రిస్ స్పెషాలిటీ ఎల్ఎల్సీ అనే సంస్థకు చెందిన రెవాటియో బ్రాండుకు జనరిక్ ఔషధం. -
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్లోనూ డేటా బూస్టర్ ప్లాన్.. ధర ఎంతంటే?
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవల్లోనూ కంపెనీ డేటా బూస్టర్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీంతో అదనంగా 1 టీబీ డేటా లభిస్తుంది. -
కార్డుల మోత మోగింది
అంచనాలను మించి కేంద్రంలోని భాజపా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలు.. దేశీయ స్టాక్మార్కెట్లు దూసుకెళ్లేందుకు కారణమయ్యాయి. 5 రాష్ట్రాలకు గాను 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (భాజపా) విజయం సాధించడంతో సోమవారం దేశీయ సూచీలు తారాజువ్వల్లా ఎగిశాయి. -
అంచనాలకు ముందుగానే 5 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థికవ్యవస్థ!
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాలైన 2027-28 కంటే ముందుగానే మన ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని, తద్వారా 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు తెలిపారు. -
రూ.12 లక్షల కోట్లకు అదానీ గ్రూప్ మార్కెట్ విలువ
అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర సంపద గతవారం మొత్తం మీద 5.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.46,500 కోట్లు) పెరిగినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ఆధారంగా తెలుస్తోంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెబీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేయడం ఇందుకు నేపథ్యం. -
ముకేశ్ అంబానీపై సెబీ ఆదేశాల కొట్టివేత
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ, మరో రెండు సంస్థలపై సెబీ విధించిన అపరాధ రుసుమును విధిస్తూ సెబీ ఇచ్చిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) పక్కనపెట్టింది. 2007 నవంబరులో రిలయన్స్ పెట్రోలియం (ఆర్పీఎల్) షేర్ల ట్రేడింగ్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో శాట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
6 విమానాశ్రయాల లీజు వల్ల ఏటా రూ.515 కోట్లు ఆదా
2018 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ) ఆరు విమానాశ్రయాలను అద్దెకు ఇవ్వడం వల్ల, నిర్వహణా వ్యయాల రూపంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఏటా రూ.515 కోట్లు ఆదా అవుతున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. -
దేశీయంగా ఐఫోన్ బ్యాటరీల తయారీలోకి జపాన్ సంస్థ
జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థ టీడీకే కార్ప్.. మన దేశంలో యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయనుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. తమ ఉత్పత్తిలో కొంతభాగాన్ని చైనా వెలుపలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్న యాపిల్, ఇందుకోసం మనదేశంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. -
ద్రవ్య లభ్యత పరిమితుల వల్లే వైజాగ్ స్టీల్ కార్మికుల వేతనాలు ఆలస్యం
ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ అయిన ఆర్ఐఎన్ఎల్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులలో తమ కార్మికులకు వేతనాలను ఆలస్యంగా చెల్లించింది. -
అంతరిక్ష అంకురాలకు నిధులు
పట్టణాభివృద్ధి, విపత్తు నిర్వహణ అంశాల్లో పనిచేస్తున్న అంతరిక్ష అంకురాలకు ప్రాథమిక నిధులను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) వెల్లడించింది. -
స్పాటిఫైలో 1,500 ఉద్యోగాల కోత
సంగీత స్ట్రీమింగ్ సేవలు అందిస్తున్న స్పాటిఫై, మరో విడతలో 1,500 మంది (17 శాతం) ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది. -
వినికిడి లోపం ఉన్నవారికి భారత్లో తొలి వీసా సమాచార కేంద్రం
వినికిడి లోపం ఉన్నవారు వీసా సేవల సమాచారాన్ని సులువుగా, స్వతంత్రంగా అందుకునేందుకు వీలు కల్పించేలా భారత్లో తొలి ‘సైన్ లాంగ్వేజ్ కాల్ సెంటర్’ను వీఎఫ్ఎస్ గ్లోబల్ ఆవిష్కరించింది. -
డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ 13 నుంచి
పెన్సిల్ తయారీలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న డోమ్స్ ఇండస్ట్రీస్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) డిసెంబరు 13న ప్రారంభమై 15న ముగియనుంది. ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా రూ.350 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్ ఫర్ సేల్లో మరో రూ.850 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. -
2025 కల్లా ఓఎన్డీసీకి కోటి మంది వ్యాపారులను తెస్తాం
ప్రభుత్వ మద్దతు ఉన్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) ప్లాట్ఫామ్కు 2025 కల్లా కోటి మంది వ్యాపారులను తీసుకురావాలని పేటీఎమ్ బ్రాండ్పై సేవలందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ యోచనగా ఉంది. ఓఎన్డీసీ ప్లాట్ఫాం నుంచి తమ వద్దకు 1.18 కోట్ల మంది వినియోగదార్లు వచ్చారని సోమవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో శర్మ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!