ఐఫోనా.. మజాకా..
టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 15 అమ్మకాలు భారత్లో మొదలయ్యాయి. దేశంలోని రెండు స్టోర్ల ముందు జనాల సందడి కనిపించింది.
భారత్లో కొనుగోళ్లు ప్రారంభం
స్టోర్ల ముందు బారులు తీరిన టెక్ ప్రియులు
టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 15 అమ్మకాలు భారత్లో మొదలయ్యాయి. దేశంలోని రెండు స్టోర్ల ముందు జనాల సందడి కనిపించింది. శుక్రవారం ఉదయం అమ్మకాలు మొదలుపెట్టగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఓ వైపు ముంబయిలోని బీకేసీ వద్ద ఉన్న యాపిల్ స్టోర్ వద్ద, మరోవైపు దేశ రాజధాని దిల్లీ సాకేత్లోని రెండో స్టోర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రజలు వరుసల్లో నిలబడ్డారు. భారత్లో తొలి ఐఫోన్ 15 కోనుగోలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు కొనుగోలుదారుడు రాహుల్. ‘భారత్లో తొలి ఐఫోన్ 15 కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి లైన్లో నిలబడ్డాను. ఇప్పటికే విడుదలైన ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 14 ప్రో మాక్స్ నా వద్ద ఉన్నాయి. తాజాగా ఐఫోన్ 15 విడుదల కావడం వల్ల ఆ ఫోన్ కోసం వచ్చాను.’ అని చెప్పాడు. సెప్టెంబర్ 12న అమెరికా కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను, యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2లను యాపిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఐఫోన్ 14 సిరీస్ మొదటి రోజు విక్రయాలతో పోలిస్తే యాపిల్ తాజా ఐఫోన్ 15 సిరీస్ విక్రయాలు 100 శాతం వృద్ధి నమోదుచేసినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భారత్లో తయారైన ఈ మోడళ్లకు అధిక గిరాకీ లభిస్తోందని తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇ-వెరిఫై చేయలేదా? ఆ రిటర్నులను తొలగించుకోవచ్చు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది. -
రూ.2000కు మించిన తొలి ఆన్లైన్ లావాదేవీ 4 గంటల తర్వాతే
ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో నిబంధనను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పద్దతిలో లావాదేవీ జరగాలంటే.. -
టీకాలపై సంయుక్త పరిశోధన
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ (సిడ్నీ ఐడీ)తో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. టీకాలపై పరిశోధనలో ఉమ్మడిగా ముందుకు సాగాలనేది ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం. -
పండగ సీజన్లో వాహన విక్రయాలు అదుర్స్
బలమైన గిరాకీ నేపథ్యంలో, ఈ ఏడాది పండగ సీజన్లో వాహన రిటైల్ విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైందని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా మంగళవారం వెల్లడించింది. 42 రోజుల పాటు సాగిన పండగ సీజన్లో మొత్తంగా 37,93,584 వాహనాలు విక్రయమయ్యాయి. -
సౌందర్య ఉత్పత్తుల విక్రయాలు 51% పెరిగాయ్: అసిడస్ గ్లోబల్
ఇటీవలి పండగ విక్రయాల్లో ఎలక్ట్రానిక్స్, లైఫ్స్టైల్, సౌందర్య ఉత్పత్తులకు ఎక్కువ ఆదరణ లభించిందని అసిడస్ గ్లోబల్ నివేదిక పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్లు, అడాప్టర్లు, ఇయర్పాడ్లు ఎక్కువగా విక్రయమయ్యాయి. రెడ్మీ, వన్ప్లస్, బోట్ వంటి బ్రాండ్లు ఈ విభాగంలో సత్తా చాటాయి. -
రూ.331 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. మంగళవారం ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో వాహన, విద్యుత్, లోహ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. డాలర్తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 83.34 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.19 శాతం పెరిగి 80.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
70 లక్షల మొబైల్ కనెక్షన్ల రద్దు
ఆన్లైన్లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
ఓయో మళ్లీ సొంత హోటళ్ల నిర్వహణ
ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓయో, మళ్లీ సొంతంగా హోటళ్ల నిర్వహణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ వెబ్సైట్, యాప్ ద్వారా ‘మేనేజ్డ్ బై ఓయో’ పేరుతో ఈ సేవలను అందించనుంది. ఈ హోటళ్ల కోసం స్థిరాస్తులను అన్వేషించేందుకు స్థిరాస్తి అభివృద్ధి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఓయో పేర్కొంది. -
టీసీఎస్ రూ.17,000 కోట్ల షేర్ల బైబ్యాక్ 1 నుంచే
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.17,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియ (బైబ్యాక్)ను డిసెంబరు 1 నుంచి 7 వరకు నిర్వహించనుంది. ఈ బైబ్యాక్లో మదుపర్ల దగ్గర నుంచి 4.09 కోట్ల షేర్లను (సంస్థలో 1.12 శాతం వాటా) ఒక్కోటి రూ.4,150 చొప్పున కొనుగోలు చేయనుంది. -
వంటగ్యాస్లో హైడ్రోజన్ కలిపే ప్రాజెక్టు
వంటకు, పరిశ్రమలకు వినియోగించే సహజ వాయువు (గ్యాస్)లో హరిత హైడ్రోజన్ను కలిపే నమూనా ప్రాజెక్టును అదానీ టోటల్ గ్యాస్ అహ్మదాబాద్లో చేపట్టింది. గౌతమ్ అదానీ గ్రూప్, ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ సంయుక్త సంస్థే అదానీ టోటల్ గ్యాస్. గ్యాస్లో హరిత హైడ్రోజన్ వాటాను క్రమంగా 8 శాతానికి చేరుస్తామని కంపెనీ తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
-
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్
-
Rat hole Miners: ‘మమల్ని గట్టిగా కౌగిలించుకున్నారు.. ఇలాంటిది జీవితంలో ఒకేసారి వస్తుంది’