హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల విక్రయాలతో..
మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ, కమొడిటీ షేర్లు నీరసపడ్డాయి.
నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు
సమీక్ష
మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ, కమొడిటీ షేర్లు నీరసపడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కుదేలవ్వడం, విదేశీ అమ్మకాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 19 పైసలు పెరిగి 82.94 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.59% లాభపడి 93.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 66,215.04 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆరంభంలో తడబడినప్పటికీ.. పుంజుకుని 215 పాయింట్ల లాభంతో 66,445.47 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్టాల్లోకి జారుకుని 65,952.83 పాయింట్లకు చేరింది. చివరకు 221.09 పాయింట్ల నష్టపోయి 66,009.15 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 68.10 పాయింట్లు తగ్గి 19,674.25 దగ్గర స్థిరపడింది.
- అనుబంధ సంస్థ గ్లెన్మార్క్ లైఫ్సైన్సెస్ను రూ.5,651.5 కోట్లకు నిర్మాకు విక్రయించనున్నట్లు ప్రకటించడంతో గ్లెన్మార్క్ ఫార్మా షేరు 3.12% కోల్పోయి రూ.802.25 దగ్గర ముగిసింది.
- ఇటలీ సంస్థ మెనారిని నుంచి 5 ఔషధ బ్రాండ్లను రూ.101 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు లుపిన్ తెలిపింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 17 నష్టపోయాయి. విప్రో 2.32%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.57%, అల్ట్రాటెక్ 1.50%, పవర్గ్రిడ్ 1.34%, సన్ఫార్మా 1.26%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.94%, ఐటీసీ 0.94%, టాటా మోటార్స్ 0.93%, టైటన్ 0.89% చొప్పున కుదేలయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 2.92%, మారుతీ 2.34%, ఎస్బీఐ 1.67%, ఎం అండ్ ఎం 1.52%, బజాజ్ ఫిన్సర్వ్ 1.11% లాభపడ్డాయి.
- ఇంజినీరింగ్, సాంకేతిక పరిష్కారాలను అందించే హైదరాబాద్ సంస్థ సైయెంట్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోకి నితిన్ ప్రసాద్ను తీసుకుంది. ప్రస్తుతం ఆయన షెల్ కంపెనీస్ ఇండియా ఛైర్మన్గా ఉన్నారు.
- విదేశీ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించేందుకు అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు అంతర్ మంత్రిత్వ శాఖల చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రంగంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితోనే శాటిలైట్ ఏర్పాటు, కార్యకలాపాల్లో 100 శాతం ఎఫ్డీఐలను అనుమతిస్తున్నారు.
స్టాప్లాస్ మార్కెట్ ఆర్డర్లను నిలిపివేయనున్న బీఎస్ఈ: అక్టోబరు 9 నుంచి స్టాప్ లాస్ మార్కెట్ (ఎస్ఎల్-ఎం) ఆర్డర్లును నిలిపివేయాలని బీఎస్ఈ నిర్ణయించింది. మాన్యువల్, ఆల్గో ట్రేడ్ల నుంచి వస్తున్న అసాధారణ ఆర్డర్లును నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల ప్రారంభంలో ఎస్ఎల్-ఎం ఆర్డర్ కారణంగా జరిగిన అసాధారణ ట్రేడ్ ఘటన వల్ల ట్రేడింగ్ వర్గాల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. షేరు ట్రిగ్గర్ ధరకు చేరుకున్నప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ధర వద్ద కొనుగోలు, అమ్మకం జరిగే ఆర్డరును ఎస్ఎల్-ఎంగా పరిగణిస్తారు. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమొడిటీ డెరివేటివ్స్ విభాగాల్లో ఎస్ఎల్-ఎం ఆర్డరును నిలిపివేస్తున్నట్లు బీఎస్ఈ తెలిపింది. ఇటువంటి ఆర్డర్లను 2021 సెప్టెంబరులోనే ఎన్ఎస్ఈ నిలిపివేసింది.
ఐపీఓ సమాచారం..
- జాగిల్ ప్రీపెయిడ్ షేర్ల అరంగేట్రం స్తబ్దుగా సాగింది. ఇష్యూ ధర రూ.164తో పోలిస్తే బీఎస్ఈలో షేరు 1.21% నష్టంతో రూ.162 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.176 వద్ద గరిష్ఠాన్ని, రూ.155.60 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 3.47% నష్టపోయి రూ.158.30 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,932.79 కోట్లుగా నమోదైంది.
- సంహీ హోటల్స్ షేరు ఇష్యూ ధర రూ.126తో పోలిస్తే బీఎస్ఈలో 3.61% లాభంతో రూ.130.55 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16.23% దూసుకెళ్లి రూ.146.45 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 13.92% పెరిగి రూ.143.55 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,129.90 కోట్లుగా నమోదైంది.
- వాలియంట్ లేబొరేటరీస్ ఐపీఓ ఈ నెల 27న ప్రారంభమై అక్టోబరు 3న ముగియనుంది. ఐపీఓలో భాగంగా 1.08 కోట్ల తాజా షేర్లను కంపెనీ విక్రయించనుంది. సెప్టెంబరు 26న యాంకర్ మదుపర్లు బిడ్లు దాఖలు చేయొచ్చు. ఐపీఓ ఎటువంటి ఆఫర్ ఫర్ సేల్ లేదు.
- మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జువెలర్స్ ఐపీఓ మొదటి రోజున 13% స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 91,20,664 షేర్లు జారీ చేయగా, 12,22,128 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
- సిగ్నేచర్ గ్లోబల్ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 11.88 రెట్ల స్పందన నమోదైంది. ఇష్యూలో భాగంగా 1,12,43,196 షేర్లు ఆఫర్ చేయగా, 13,36,05,074 షేర్లకు బిడ్లు వచ్చాయి. ఎన్ఐఐ విభాగంలో 13.54 రెట్లు, క్యూఐబీ విభాగంలో 12,71 రెట్లు, రిటైల్ మదుపర్ల నుంచి 6.82 రెట్ల స్పందన లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
India Shelter Finance IPO: 13న ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493
India Shelter Finance IPO: రూ.1,200 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభం కానుంది. -
Onion Exports: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..
Onion Exports: దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు వీటి ఎగుమతులపై నిషేధం విధించింది. -
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
RBI: ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. -
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell | ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 69,716 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 20,967 దగ్గర ట్రేడవుతోంది. -
ఐటీ సెజ్ల్లో స్థలాలకు గిరాకీ
ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్ హోదాను రద్దు చేసే అధికారం అంతర్ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
సంస్థల్లో నియామకాలు 12% తగ్గాయ్
వేర్వేరు రంగాల కార్యాలయాల్లో నైపుణ్యంతో కూడిన (వైట్-కాలర్) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్స్పీక్ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా, ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది. -
2025కు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు: ఇక్రా
దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి 170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ - కార్పొరేట్ రేటింగ్స్ వి.విక్రమ్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది. -
ఏడు రోజుల జోరుకు విరామం
సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. -
వివో కేసులో తొలి ఛార్జిషీట్ దాఖలు
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, తొలి ఛార్జిషీట్ను ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది. -
దూసుకెళ్తున్న ఈవీలు
విద్యుత్ వాహనాల (ఈవీల) అమ్మకాలు రాణిస్తున్నాయి. విద్యుత్తు విభాగంలో ప్రయాణికులు- వాణిజ్య వాహనాలు కలిపి నవంబరులో 1,52,606 యూనిట్లు అమ్ముడైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం వెల్లడించింది. -
1 నుంచి హ్యుందాయ్ ధరల పెంపు
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎమ్ఐఎల్), జనవరి 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ముడి పదార్థాల ధరలు, ప్రతికూల మారకపు రేటు, అధిక కమొడిటీ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
స్టార్బక్స్కు రూ.91,500 కోట్ల నష్టం
సియాటెల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్బక్స్ కార్పొరేషన్ ఆదాయంపై, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం వేగంగా కనిపించింది. విక్రయాలు తగ్గడంతో, సుమారు 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91,500 కోట్ల) మేర విలువను కంపెనీ నష్టపోయింది. -
పంచదార ధరల అదుపునకు చర్యలు
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా నిషేధం విధిస్తూ, చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు, ధరలు అదుపులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటా విక్రయం
ఐడీఎఫ్సీ బ్యాంక్లో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటాను రూ.790.18 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ విక్రయం జరిగింది. ఈ వార్తలతో బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.02 శాతం నష్టపోయి రూ.87.69 వద్ద ముగిసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
భారత్ 8% వృద్ధి సాధిస్తుంది
మన ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెర్రీ పేర్కొన్నారు. కార్మిక శక్తి బలంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ పరంగా సంస్థాగత అనుభవం ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర భారతదేశం అంతగా రాణించడం లేదని, సార్వభౌమ వ్యవస్థలో ఇది ఉద్రిక్తతలను సృష్టించొచ్చని అన్నారు. -
సంక్షిప్త వార్తలు
ఇటీవలి కొద్ది నెలలుగా భారత అంకురాల్లో జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్ తన వాటాలుతగ్గించుకుంటూ వస్తోంది. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే జొమాటోలో కూడా రూ.1,125.5 కోట్ల (135 మిలియన్ డాలర్ల) విలువైన షేర్లను సాఫ్ట్బ్యాంక్ విక్రయించనుందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
Pawan Kalyan: కేసీఆర్కు గాయమైందని తెలిసి బాధపడ్డా: పవన్కల్యాణ్
-
India Shelter Finance IPO: 13న ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ICC: వరల్డ్ కప్ ‘ఫైనల్’ పిచ్ యావరేజ్.. వివాదాస్పదమైన భారత్-కివీస్ సెమీస్ ‘పిచ్’ రేటింగ్ ఎంతంటే?
-
Women Education: మహిళల విద్యపై అఫ్గాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై ఆరోపణలు.. లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదిక