దేశంలో రెండు భారీ సెమీకండక్టర్ ప్లాంట్లు!
దేశంలో రెండు భారీ సెమీకండక్టర్ ప్లాంట్లు రాబోతున్నాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ శనివారం పేర్కొన్నారు.
పరిశీలనలో ప్రతిపాదనలు
కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
సనంద్: దేశంలో రెండు భారీ సెమీకండక్టర్ ప్లాంట్లు రాబోతున్నాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ శనివారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, వచ్చే కొన్ని నెలల్లో కొలిక్కిరానున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ అగ్రగామిగా ఎదిగే అవకాశం ఉన్న ప్రత్యేక ప్రాంతాలపై ఈ ప్రాజెక్టులు దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనల పూర్తి వివరాలను వెల్లడించలేదు. మైక్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. సెమీకండక్టర్ విభాగంలో భారత్ పురోగతిని అంతర్జాతీయ కంపెనీలు చూస్తున్నాయని.. భారీ, సంక్షిష్ట విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థులని అన్నారు. ‘అంతర్జాతీయ సెమీకండక్టర్ కంపెనీలు ప్రస్తుతం భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నాయి. రాబోయే నెలల్లో మరో రెండు భారీ సెమీకండక్టర్ ప్లాంట్లు వచ్చే అవకాశం ఉంది’ అని వైష్ణవ్ తెలిపారు. సెమీకండక్టర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ద్వారా భారత్ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరనుందన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభమైన మైక్రాన్ ప్లాంట్, 2024 డిసెంబరు నుంచి చిప్ ఉత్పత్తి ప్రారంభించనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లుగా ఉన్న సెమీకండక్టర్ గిరాకీ.. వచ్చే కొన్నేళ్లలో రూ.5 లక్షల కోట్లకు చేరొచ్చని వైష్ణవ్ అంచనా వేశారు. మైక్రాన్కు చెందిన అయిదు సరఫరా సంస్థలు ప్లాంట్ ఏర్పాటుకు చూస్తున్నట్లు సమాచారం. ఇందులో సిమ్టెక్ సంస్థ కూడా ఉంది.
టాటా ప్రాజెక్ట్స్ చేతికి నిర్మాణ పనులు: గుజరాత్లోని సనంద్లో అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్లాంట్ నిర్మాణ పనులను చేపట్టడానికి మైక్రాన్ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టాటా ప్రాజెక్ట్స్ వెల్లడించింది. సనంద్ దగ్గర చారోడీలోని గుజరాత్ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ స్థలంలో ఈ ప్లాంట్ నిర్మించనున్నారు. మొత్తం 93 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు కానుంది. మొదటిదశలో 5,00,000 చదరపు అడుగుల క్లీన్రూమ్ స్థలాన్ని నిర్మించనున్నామని.. 2024 చివర్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి చూస్తున్నట్లు కంపెనీ వివరించింది.
గుజరాత్లో 2.75 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22,540 కోట్లు) పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు దిగ్గజ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ఈ ఏడాది జూన్లో ప్రకటించింది. రెండు దశల్లో ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు మైక్రాన్ 825 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. మిగిలిన మొత్తం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.21 వేల లాభం
Tata Tech Listing: టాటా టెక్ ఐపీఓ లిస్టింగ్ అంచనాలకు మించిన లాభాన్నించ్చింది. ఇష్యూ ధరతో పోలిస్తే 140 శాతం లాభంతో షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. -
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!
Elon Musk | యూదు వ్యతిరేక పోస్ట్నకు మద్దతు తెలిపినందుకు మస్క్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు ఎక్స్లో వాణిజ్య ప్రకటనలను నిలిపివేశాయి. దీనిపై మస్క్ తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 77 పాయింట్ల లాభంతో 66,979 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 26 పాయింట్లు పెరిగి 20,123 వద్ద కొనసాగుతోంది. -
మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. -
ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ
గౌతమ్ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. -
స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు
ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. -
వచ్చే ఏడాది ప్రపంచం మందగమనమే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. -
డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది
కొవిడ్-19 పరిణామాల అనంతరం డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో.... -
2030కి రూ.29 లక్షల కోట్లకు దేశీయ ఐటీ రంగం
దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. -
రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ బుధవారం తెలిపారు. -
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్షైర్ హాతవేకు వైస్ఛైర్మన్గా వ్యవహరించిన చార్లీ మంగర్(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. -
ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ-శాటెల్లాజిక్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్ఎల్ వెల్లడించింది. -
భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి
భారత్లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన -
రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం
రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్(జమ్ము-కశ్మీర్, చత్తీస్గఢ్)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. -
సంక్షిప్త వార్తలు
సంస్థలకు క్లౌడ్, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్వన్) హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి...


తాజా వార్తలు (Latest News)
-
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
-
EastCoast Train: ఈస్ట్కోస్టు ఎక్స్ప్రెస్లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
-
Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.21 వేల లాభం
-
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!
-
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120