బీమా రంగం వృద్ధికి అపార అవకాశాలు
‘దేశంలో బీమా రంగం వృద్ధికి అపార అవకాశాలున్నాయి. కొవిడ్ అనంతరం బీమా పాలసీలపై అవగాహన పెరిగింది.
ఈనాడు ఇంటర్వ్యూ
కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనుజ్ మాథుర్
ఈనాడు - హైదరాబాద్
‘దేశంలో బీమా రంగం వృద్ధికి అపార అవకాశాలున్నాయి. కొవిడ్ అనంతరం బీమా పాలసీలపై అవగాహన పెరిగింది. చిన్న వయసులోనే బీమా అవసరాన్ని గుర్తిస్తున్నారు. ఇది సానుకూల పరిణామం. గ్రామీణ ప్రాంతాలకూ బీమా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిజిటలీకరణలో పెరిగిన వేగం ఇందుకు తోడ్పడుతుంది’ అని కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనుజ్ మాథుర్ అన్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియాలు మన దేశంలో ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయని ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో వివరించారు.
జీవిత బీమా రంగంలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు వస్తున్నాయి? పాలసీదారుల వైఖరి ఎలా ఉంది
భారతదేశంలో జీవిత బీమా మార్కెట్ భారీ మార్పులకు లోనవుతోంది. బీమా సంస్థలకూ, పాలసీదారులకూ ఇది సరికొత్త అవకాశాలను అందిస్తోంది. దేశంలో కేవలం 3.2 శాతం జనాభాకే బీమా పాలసీలున్నాయి. దీన్ని బట్టి, బీమా పరిశ్రమ వృద్ధిని అంచనా వేసుకోవచ్చు. బీమా కంపెనీలు కొత్త ఉత్పత్తులు, వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లుగా పాలసీలను తీసుకొస్తూ పాలసీలదారులకు దగ్గరవుతున్నాయి. మరోవైపు కొవిడ్ అనంతరం బీమాపై అవగాహన పెరిగింది. పాలసీదారులు సానుకూల దృష్టితో చూడటం ప్రారంభించారు. బీమాను ఒక తప్పనిసరి అవసరంగా చూస్తున్నారు. డిజిటలీకరణ పెరగడం బీమా పరిశ్రమకు ఎంతో మేలు చేస్తోంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బీమా పూర్తి స్థాయిలో విస్తరించలేదు. ఇక్కడ పాలసీలు పెరిగితే.. బీమా రంగానికి ఎంతో సానుకూలమైన అంశంగా మారుతుంది.
కొవిడ్-19 తర్వాత జీవిత బీమా ఎలా ప్రభావితం అవుతోంది
పాలసీదారులకు ఆర్థిక భద్రత ప్రాముఖ్యాన్ని గ్రహించేలా మహమ్మారి చేసింది. దీనిపై మరింత అవగాహన పెంచుకుంటున్నారు. పూర్తి రక్షణ, పొదుపు ఆధారిత బీమా ఉత్పత్తులను ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జీవిత బీమా పాలసీలంటే పన్ను మినహాయింపు, పొదుపు అవసరాలకు మాత్రమే కాదని గుర్తిస్తున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, పొదుపు ఉత్పత్తులను పరిశీలిస్తున్నారు. మన దేశంలో టర్మ్ పాలసీల ప్రీమియం ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. వారు చెల్లించే ప్రీమియంతో కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుందన్న విషయంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం సాధ్యమవుతుందా? దీనికి బీమా పరిశ్రమ ఎలా సిద్ధం అవుతోంది
భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) 2047 నాటికి అందరికీ బీమా పాలసీలు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా బీమా పాలసీలపై విస్తృతమైన ప్రచారం నిర్వహించడం అవసరం. బీమా సంస్థలు దీనిపై పూర్తిగా దృష్టి సారిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీమా అక్షరాస్యతను పెంచేందుకు మా సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ స్థాయిలో బీమా పాలసీల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. స్థానిక పంపిణీ వ్యవస్థలతో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడం, సాంకేతికతను ఉపయోగించుకోవడంతోపాటు పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించాల్సిన అవసరం ఉంది.
పాలసీదారులకు మెరుగైన పాలసీలు, సేవలను అందించేందుకు మీరేం చేస్తున్నారు
ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మేము మా పాలసీలను తీసుకొస్తున్నాం. ఇందుకోసం మా డిజిటల్ సేవలను మెరుగుపర్చుకునేందుకు పెట్టుబడులు పెడుతున్నాం. కేవలం పాలసీలను నిర్వహించేందుకే కాకుండా.. ఇతర సేవలనూ మా యాప్ ద్వారా అందిస్తున్నాం. ఇందులో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలనూ జోడించాం. కెనరా బ్యాంకుకున్న 10 వేలకు పైగా శాఖలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా మా బీమా ఉత్పత్తులను అందిస్తున్నాం.
ఏ రకం బీమా ఉత్పత్తులకు ఆదరణ అధికంగా ఉంటోంది
వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ, యూనిట్ ఆధారిత, పూర్తి రక్షణ, యాన్యుటీ పాలసీల్లో ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పాలసీలను ఎంచుకోవాలి. ఆరోగ్య పరీక్షల అవసరం లేకుండా తక్కువ విలువైన పాలసీలను విక్రయించేందుకు మా సంస్థ దృష్టి పెడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జై.. జీడీపీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ఇది సాధ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. -
అత్యంత విలువైన అంకురాలు @ బెంగళూరు
స్వయం కృషితో ఎదిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన అత్యంత విలువైన కంపెనీలకు అతిపెద్ద కేంద్రస్థానంగా భారత సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నిలిచింది. -
పీవీఆర్ ఐనాక్స్ రూ.500 కోట్ల పెట్టుబడులు
దేశీయంగా అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్గా కొనసాగుతున్న పీవీఆర్ ఐనాక్స్, వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 150 కొత్త తెరలను ప్రారంభించాలనుకుంటోంది. -
అల్ట్రాటెక్ చేతికి కేశోరామ్ సిమెంట్
బి.కె.బిర్లా గ్రూపు ప్రధాన సంస్థ కేశోరామ్ ఇండస్ట్రీస్కు చెందిన సిమెంట్ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయనుంది. షేర్ల బదిలీ (స్వాప్) రూపేణా ఈ కొనుగోలు లావాదేవీ జరగనుందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. -
పిల్లలకు ఆర్థిక భద్రత..
యూనియన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా యూనియన్ చిల్డ్రన్ ఫండ్ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. కానీ, కనీసం అయిదేళ్లపాటు లేదా మైనర్ పిల్లలు మేజర్ అయ్యే వరకూ లాకిన్ నిబంధన వర్తిస్తుంది. -
ప్రయాణ బీమా..క్లెయిం చేసుకోవాలంటే...
-
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్తో బోట్ గేమింగ్ ఇయర్బడ్స్
Boat earbuds: సింగిల్ ఛార్జ్తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్తో బోట్ ఇయర్బడ్స్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. -
నెలకు రూ.8 వేలతో రూ.5 కోట్లు
నా వయసు 34. ప్రైవేటు ఉద్యోగిని. ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్ కోసం నెలకు రూ.15 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
పన్ను ప్రణాళిక ఆర్థిక లక్ష్యం నెరవేరేలా...
ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఇప్పటికే చాలామందికి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) ప్రారంభమయ్యింది. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన పెట్టుబడులను ఎంచుకోవాలి -
ఆదాయం.. బీమా రక్ష జీవితాంతం..
బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పొదుపు, బీమాతోపాటు, హామీతో కూడిన ఆదాయాన్ని అందించేలా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే జీవన్ ఉత్సవ్. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవితాంతం వరకూ బీమా రక్షణ అందించే పాలసీ. -
మదుపరి పంట పండింది
ఐపీఓ.. ఐపీఓ.. ఐపీఓ.. గత వారం రోజులుగా స్టాక్మార్కెట్ మదుపర్ల చర్చ అంతా వీటి మీదే. ఇందుకు తగ్గట్టుగానే టాటా టెక్నాలజీస్ సహా ఇతర కంపెనీల ఐపీఓలు లాభాల పంట పండించి,. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాయి. భారీ నమోదు లాభాలను పంచి, మదుపర్లను మురిపించాయి. -
Gold Loan: అత్యవసరంలో పసిడి రుణం..
వ్యక్తిగత రుణాలకు నిబంధనలు కఠినతరం అవడంతో అప్పు దొరకడం కాస్త కష్టమవుతోంది.అత్యవసర సందర్భాల్లో ఉన్న సులువైన మార్గం బంగారంపై రుణం తీసుకోవడం. ఈ నేపథ్యంలో ఈ అప్పు తీసుకునేటప్పుడు ఏం చూడాలి? అనే అంశాలను తెలుసుకుందాం. -
గృహ విక్రయాలు 22% పెరిగాయ్!
దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో జులై-సెప్టెంబరు త్రైమాసికంలో గృహ విక్రయాలు 22 శాతం పెరిగాయని స్థిరాస్తి డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రోప్ టైగర్.కామ్ వెల్లడించింది. వినియోగదారు గిరాకీ బాగుందని తెలిపింది. -
ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో నందన్ నీలేకని, నిఖిల్ కామత్
ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ ఛైర్మన్ కె.పి.సింగ్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్కు చోటు లభించింది. -
అత్యంత విలాసవంత గృహాల విక్రయాలు 4 రెట్లు పెరిగాయ్
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు అల్ట్రా-లగ్జరీ (అత్యంత విలాసవంత) గృహాల విక్రయాలు 4 రెట్లు పెరిగి 58కి చేరాయని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. -
ముడి చమురు 80 డాలర్ల దిగువకు వస్తేనే రిటైల్ ధరల సవరణ!
అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్ల దిగువన స్థిరపడితేనే, ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను రోజువారీగా సవరిస్తాయని అధికారులు వెల్లడించారు. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు నమోదుచేశాయి. నవంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. -
అరబిందో ఔషధానికి అమెరికాలో అనుమతి
బుడెసొనైడ్ ఇన్హలేషన్ సస్పెన్షన్ ఔషధాన్ని అమెరికాలో విడుదల చేయడానికి అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా స్పెషాలిటీస్కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి లభించింది. -
వర్ల్పూల్ ఆఫ్ ఇండియాలో 24% వాటా విక్రయించనున్న వర్ల్పూల్
అమెరికాకు చెందిన గృహోపకరణాల దిగ్గజ సంస్థ వర్ల్పూల్ కార్పొరేషన్ భారత్లోని తన అనుబంధ సంస్థ వర్ల్పూల్ ఆఫ్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది. -
అక్టోబరులో కీలక రంగాల వృద్ధి 12.1%
అక్టోబరులో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 12.1 శాతం పెరిగింది. కిందటేడాది ఇదే సమయంలో వృద్ధి 0.7 శాతంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు