ఔషధ ఎగువతులపైౖ ప్రభావం ఉంటుందా?
ఖలిస్థాన్ ఉగ్రవాదుల అంశం మనదేశానికి, కెనడా మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమవుతోంది.
కెనడాతో దౌత్యపరమైన విభేదాలు
పరిశ్రమ వర్గాల్లో చర్చ
ఈనాడు, హైదరాబాద్: ఖలిస్థాన్ ఉగ్రవాదుల అంశం మనదేశానికి, కెనడా మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమవుతోంది. ఇటీవలి కాలంలో ఈ వివాదం పెద్దది కావటం, ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించడం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావటానికి ఎంతో సమయం పడుతుందని స్పష్టమవుతుంది. ఈ వ్యవహారం ద్వైపాక్షిక వాణిజ్యం మీదా ప్రభావం చూపుతుందేమోననే అనుమానాలు స్థానిక వ్యాపార వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 8 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యం నమోదవుతోంది. మనదేశం ఏటా 4 బిలియన్ డాలర్లకు పైగా విలువైన వివిధ రకాలైన వస్తువులు ఎగుమతి చేస్తోంది. ఇందులో మందులు, ప్లాస్టిక్ వస్తువులు, చేపలు- రొయ్యలు, స్మార్ట్ఫోన్లు, ఆభరణాలు, బాస్మతి బియ్యం, దుస్తులు ఉంటున్నాయి. హైదరాబాద్లో అధికంగా ఉన్న ఫార్మా కంపెనీలు కెనడాలోని వినియోగదార్లకు పెద్దఎత్తున మందులు ఎగుమతి చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా తదితర ఫార్మా కంపెనీలు తమ ఔషధాలను కెనడాలో విక్రయిస్తున్నాయి.
2 శాతం మాత్రమే...
గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 500 మిలియన్ డాలర్లకు పైగా విలువైన మందులు కెనడాకు ఎగుమతి కావటం గమనార్హం. అందువల్ల కెనడాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఇరు దేశాల మధ్య సంబంధాలు, సంబంధిత ఇతర అంశాలను స్థానిక ఫార్మా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మందుల ఎగుమతులపై ఏమైనా ప్రభావం పడుతుందా, ఎగుమతులకు ఇబ్బందులు ఎదురవుతాయా... అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కానీ అటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని మరికొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మనదేశం నుంచి నమోదయ్యే మందుల ఎగుమతుల్లో కెనడా వాటా కేవలం 2 శాతం మాత్రమే. అందువల్ల ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- అని స్థానిక ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మనదేశం నుంచి దాదాపు 24 బిలియన్ డాలర్ల విలువైన మందులు ఎగుమతి అయ్యాయి. ఇందులో అత్యధికంగా..., దాదాపు 35 శాతం వరకూ అమెరికాకే మందులు ఎగుమతి అయ్యాయి. ఇంకా ఐరోపా, ఆఫ్రికా దేశాలతో పాటు బ్రెజిల్, రష్యా దేశాలకు మన దేశం నుంచి మందులు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. అందువల్ల కెనడాతో మనదేశానికి సంబంధాలు దెబ్బతినటం వల్ల మందుల ఎగుమతులపై ప్రభావం పెద్దగా ఉండదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. నష్టమూ తక్కువేని చెబుతున్నాయి. అదే సమయంలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు, వివాదం దీర్ఘకాలం పాటు కొనసాగితే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. -
ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ
గౌతమ్ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. -
స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు
ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. -
వచ్చే ఏడాది ప్రపంచం మందగమనమే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. -
డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది
కొవిడ్-19 పరిణామాల అనంతరం డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో.... -
2030కి రూ.29 లక్షల కోట్లకు దేశీయ ఐటీ రంగం
దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. -
రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ బుధవారం తెలిపారు. -
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్షైర్ హాతవేకు వైస్ఛైర్మన్గా వ్యవహరించిన చార్లీ మంగర్(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. -
ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ-శాటెల్లాజిక్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్ఎల్ వెల్లడించింది. -
భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి
భారత్లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన -
రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం
రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్(జమ్ము-కశ్మీర్, చత్తీస్గఢ్)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. -
సంక్షిప్త వార్తలు
సంస్థలకు క్లౌడ్, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్వన్) హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి...


తాజా వార్తలు (Latest News)
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
-
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
-
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
-
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
-
యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు