రిలయన్స్ ‘హోల్డింగ్ కంపెనీ’గా మారొచ్చు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మున్ముందు హోల్డింగ్ కంపెనీగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని ఫిచ్ గ్రూపులో భాగమైన క్రెడిట్ సైట్స్ పేర్కొంది.
ప్రధాన వ్యాపారాల నిర్వహణ సంస్థల్లో మెజార్టీ వాటాలు దాని చేతిలోనే
ముకేశ్ పిల్లల మధ్య వైరుధ్యాలు రాకుండా స్పష్టమైన వ్యాపార విభజన అవసరం
రిలయన్స్లో వారసత్వ ప్రణాళికపై క్రెడిట్ సైట్స్ నివేదిక వెల్లడి
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మున్ముందు హోల్డింగ్ కంపెనీగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని ఫిచ్ గ్రూపులో భాగమైన క్రెడిట్ సైట్స్ పేర్కొంది. బలమైన రుణ ప్రొఫైల్తో పాటు టెలికాం, రిటైల్ విభాగాలు మంచి ఆదాయాలు నమోదుచేయొచ్చన్న అంచనాలు.. అధిక ముడి చమురు ధరల వల్ల చమురు వ్యాపారం బలహీన పనితీరును కనబరచే అవకాశం ఉండటం, మూలధన అవసరాలు పెరగడం లాంటి వాటి వల్ల కలిగే ప్రతికూలతల ప్రభావాన్ని తగ్గిస్తాయని రిలయన్స్ వారసత్వ ప్రణాళికపై రూపొందించిన నివేదికలో క్రెడిట్ సైట్స్ అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల రిలయన్స్ గ్రూపులో వారసత్వ ప్రణాళికను ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సంస్థ బోర్డులో తన ముగ్గురు పిల్లలు- ఆకాశ్, ఈశా, అనంత్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపడతారని ముకేశ్ తెలిపారు. తాను మాత్రం మరో ఐదేళ్లు రిలయన్స్ ఛైర్మన్, సీఈఓగా కొనసాగుతానని వెల్లడించారు.
కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం పడకుండా..: ‘కీలకమైన వ్యక్తికి సంబంధించిన అంశంపైనా చాలా మంది మదుపర్ల దృష్టి ఉంటుంది. ముకేశ్ ముగ్గురు పిల్లలకు ప్రధాన వ్యాపార విభాగాల్లో (టెలికాం, రిటైల్, కొత్త ఇంధనం) నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. భవిష్యత్లో ముగ్గురి మధ్య ఎలాంటి వివాదాలు రాకూడదంటే స్పష్టమైన వ్యాపార విభజన అవసరమన్నది మా భావన’ అని క్రెడిట్సైట్స్ విశ్లేషించింది. వారసత్వ ప్రణాళిక... అంబానీ అనూహ్యంగా లేదంటే అనుకోని పరిస్థితిలో గ్రూపు నుంచి వైదొలిగేందుకు దారి తీయకూడదని, దీని వల్ల కంపెనీ పనితీరు, కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని తెలిపింది. బదులుగా ఆయన కొత్త తరానికి మార్గదర్శకంగా.. వాళ్లను ఉత్తమ సారథులుగా తీర్చిదిద్దేలా ఈ ప్రణాళిక ఉపయోగపడాలని పేర్కొంది.
ట్రస్టు ద్వారా నిర్వహణకు అవకాశం: ‘ప్రధాన వ్యాపార విభాగాలను నిర్వహించే స్వతంత్ర సంస్థల్లో మెజార్టీ వాటాలతో హోల్డింగ్ కంపెనీగా ఆర్ఐఎల్ రూపాంతరం చెందుతుందని తాము భావిస్తున్నామ’ని క్రెడిట్సైట్స్ తెలిపింది. అంబానీ చేతిలో నుంచి ముగ్గురు పిల్లలకు సంస్థ బాధ్యతలు వెళ్లిన తర్వాత కూడా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కుటుంబ నేతృత్వంలోని కంపెనీగానే కొనసాగుతుందనే తాము అనుకుంటున్నట్లు వివరించింది. అయితే అంబానీ, ఆయన ముగ్గురు పిల్లలు, కుటుంబ సభ్యుల నియంత్రణలో ఒక ట్రస్టు ఏర్పాటుకు అవకాశమైతే ఉండొచ్చని తెలిపింది. ‘గత రెండు వార్షిక సాధారణ సమావేశాలను(ఏజీఎంలు) గమనిస్తే.. తన ముగ్గురు పిల్లలు వాళ్లకు అప్పగించిన వ్యాపార విభాగంలో ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకొని, దీర్ఘకాలం పాటు రాణించాలన్నది అంబానీ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే వాళ్లకు కేటాయించిన వ్యాపారం ద్వారా భవిష్యత్లో తన పిల్లలు ఎలాంటి హోదా/బాధ్యతను నిర్వహించాలనే దానిపైనా ఆయనకు పూర్తి స్పష్టత ఉందని మేం భావిస్తున్నామ’ని క్రెడిట్ సైట్స్ వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామలింగ రాజు, మరో నలుగురు రూ.624 కోట్లు లాభపడ్డారు
దాదాపు 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. -
జోష్
దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది -
వాహన అమ్మకాలకు పండగ హుషారు
ఈ ఏడాది నవంబరులో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరా రికార్డు స్థాయిలో జరిగింది. పండగ సీజను గిరాకీకి తగ్గట్లుగా డీలర్లకు కంపెనీలు భారీగా వాహనాలను అందించాయి -
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15 శాతం అధికం. ‘2023 నవంబరులో స్థూలంగా రూ.1,67,929 కోట్ల జీఎస్టీ వసూలైంది. -
భారత ఆర్థిక భవితపై సీఎఫ్ఓలు ఆశావహం
దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94 శాతం భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్ఓ) విశ్వాసం వ్యక్తం చేశారని డెలాయిట్ ఇండియా పేర్కొంది. ఆసియా పసిఫిక్ (అపాక్) ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావహ శాతమని వెల్లడించింది. -
న్యాయ సలహాదారును నియమించుకోనున్న రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లు
రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గౌతమ్ సింఘానియా విడాకుల వివాదం వల్ల ఏర్పడ్డ పరిస్థితులను పరిశీలిస్తున్నామని ఆ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు పేర్కొన్నారు. కంపెనీ వ్యవహారాలు, వ్యాపారంపై ప్రభావం పడకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం. -
రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే
చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది -
డీప్ఫేక్ వీడియోలపై ఆసక్తి లేదు
డీప్ఫేక్ వీడియోలపై యూట్యూబ్కు ఎంతమాత్రం ఆసక్తి లేదని ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంతో అనుబంధం ఉండాలని మా భాగస్వాములెవరూ భావించడం లేదనీ తెలిపారు. -
ఒక కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వం
ఒక రంగంలోని సంస్థలన్నింటికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ, ఒక విభాగంలోని ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎటువంటి రాయితీలను ఇవ్వదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు -
రూ.22 పెరిగిన వాణిజ్య సిలిండర్
హోటళ్లు, రెస్టారెంట్ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. ఈ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.2002 నుంచి రూ.22 పెరిగి రూ.2024 అయ్యింది. -
సంక్షిప్త వార్తలు(6)
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎమ్ఎస్ఐ) తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైక్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
టీచర్ అవుదామనుకొని..
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య