ఆద్యంతం ఒడుదొడుకులు
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పంగా పెరిగాయి.
సమీక్ష
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పంగా పెరిగాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ అమ్మకాలు మాత్రం మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 20 పైసలు కోల్పోయి 83.14 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.39% పెరిగి 93.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 66,082.99 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్లో తడబడిన సూచీ, 65,764.03 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ పుంజుకుని 66,225.63 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 14.54 పాయింట్ల లాభంతో 66,023.69 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎటువంటి మార్పులేకుండా 19,674.55 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 19,601.55- 19,734.15 పాయింట్ల మధ్య కదలాడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 14 లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ 4.64%, బజాజ్ ఫిన్సర్వ్ 2.23%, కోటక్ బ్యాంక్ 1.60%, ఏషియన్ పెయింట్స్ 1.44%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.72%, ఎన్టీపీసీ 0.69% రాణించాయి. ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, విప్రో, హెచ్సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్ 1.42% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో పరిశ్రమలు, ఐటీ, టెలికాం, వాహన, యంత్ర పరికరాలు, టెక్ డీలాపడ్డాయి.
- రెలిగేర్లో 26% వాటాకు రూ.2,116 కోట్ల ఓపెన్ ఆఫర్: కంపెనీలో 26 శాతం వరకు వాటాను కొనుగోలు చేసేందుకు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ వాటాదార్లకు రూ.2,116 కోట్ల ఓపెన్ ఆఫర్ను డాబర్ ఇండియా ప్రమోటర్ సంస్థ బర్మన్ కుటుంబం ప్రకటించింది. ఈ ఆఫర్ తర్వాత బర్మన్ కుటుంబ వాటా 51 శాతానికి పెరిగి, కంపెనీ నియంత్రణ చేతిలోకి వస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ షేరు7.08% నష్టపోయి రూ.253.15 వద్ద ముగిసింది.
- కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ సంస్థ (సీడీఎంఓ), సాఫ్ట్ జెలాటిన్ వ్యాపారాలను విడదీసి ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ వెల్లడించింది. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, స్టెరిసైన్స్ స్పెషాలిటీస్, స్టెలిస్ బయోఫార్మాల మధ్య ఈ సంస్థ ఏర్పాటు కానుంది. ఈ వార్తలతో స్ట్రైడ్స్ ఫార్మా షేరు 7.42% లాభంతో రూ.535.65 దగ్గర స్థిరపడింది.
- అప్డేటర్ సర్వీసెస్ ఐపీఓ మొదటి రోజున 6% స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,19,99,999 షేర్లను జారీ చేయగా.. 6,94,650 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
- బయోఇంధనాలపై 9 ప్రమాణాలను అభివృద్ధి చేసినట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెల్లడించింది. పారాఫినిక్ (గ్రీన్) డీజిల్ ప్రమాణాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ అన్నారు.
- 2030 గడువులోగా 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని భారత్ సాధిస్తుందని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రి ఆర్కే సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
- బ్యాంబూ హోటల్ గ్లోబల్ సెంటర్, గోవాన్ హోటల్స్ అండ్ రియాల్టీ, బీడీ అండ్ పీ హోటల్స్లో వాటాలను రూ.2,300 కోట్లకు కొనుగోలు చేసినట్లు డీబీ రియాల్టీ వెల్లడించింది. దీంతో కంపెనీ ఆతిథ్య సేవల వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలిపింది.
నిధుల సమీకరణ..
- మొట్టమొదటి ఎన్సీడీల పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2000 కోట్ల వరకు సమీకరించనున్నట్లు ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తెలిపింది. ఈ ఇష్యూ సెప్టెంబరు 27న ప్రారంభమై అక్టోబరు 12న ముగియనుంది.
- మూలధన వ్యయాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.2,250 కోట్ల వరకు సమీకరణ ప్రతిపాదనకు పవర్గ్రిడ్ బోర్డు ఆమోదం ఇచ్చింది.
- ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్ఈసీ, పీఎఫ్సీల నుంచి రూ.5,600 కోట్ల రుణాలు సమీకరించినట్లు సెరెంటికా రెన్యూవబుల్స్ పేర్కొంది.
- భారత రక్షణ శాఖకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అందించేందుకు జెన్ టెక్నాలజీస్కు కొత్త ఆర్డరు లభించింది. మొత్తం ఆర్డరు విలువ రూ.227.65 కోట్లు. ఇందులో జీఎస్టీ, ఏడేళ్ల పాటు నిర్వహణ కోసం రూ.43.22 కోట్లూ కలిసి ఉన్నాయని సంస్థ బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
QR code scams: క్యూఆర్ కోడ్ స్కామ్లతో జాగ్రత్త!
QR code scams: తరచూ క్యూఆర్కోడ్ స్కాన్ చేసి లావాదేవీలు జరుపుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. -
5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు
దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని.. సుమారు 10కోట్ల మంది వీటి సేవలను వినియోగించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. -
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
UCO bank Funds: యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి పొరపాటున కోట్లాది రూపాయల నగదు జమ అయిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నగదు లావాదేవీలు జరిగిన తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించింది. -
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
యూఎస్బీ-సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యాపిల్ సంస్థ కేంద్రాన్ని కోరింది. -
గోఫస్ట్ కథ కంచికేనా?
దేశీయ విమానయాన కంపెనీల్లో మరో సంస్థ కథ కంచికి చేరినట్లే!.. ఈ ఏడాది మే 2న విమాన సర్వీసులు నిలిపేసి.. స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన గోఫస్ట్.. ఇక ఎగరకపోవచ్చు. -
ఏఎల్ఎస్ వ్యాధికి నూతన ఔషధం
నరాల వ్యాధులకు సంబంధించిన ఒక బయోలాజికల్ మిశ్రమ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసి వివిధ దేశాల్లో విక్రయించడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోయ థెరప్యూటిక్స్ ఇంక్., అనే బయోటెక్నాలజీ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. -
కార్లు, బైక్లకు భలే గిరాకీ
ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల)తో పాటు ద్విచక్ర వాహనాల (బైక్లు, స్కూటర్ల)కు లభించిన అధిక గిరాకీ వల్లే, నవంబరులో రికార్డు స్థాయిలో వాహన రిటైల్ విక్రయాలు సాగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. -
కొనసాగిన రికార్డుల పరుగు
వరుసగా ఏడో రోజూ పరుగులు తీసిన సెన్సెక్స్, నిఫ్టీ.. తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించాయి. -
తుపాను బాధిత ప్రాంతాల్లోని వినియోగదార్లకు వాహన సంస్థల మద్దతు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో మిగ్జాం తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వినియోగదార్లకు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్, ఆడి, ఫోక్స్వ్యాగన్ తదితర వాహన సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. -
ఎయిరిండియా విమానాల ఆర్డరులో మార్పులు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా, ఈ ఏడాది మొదట్లో ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్కు 250 విమానాలకు ఆర్డరు పెట్టింది. -
పునరుత్పాదక ఇంధనాలపై అదానీ గ్రూప్ రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడి!
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు, అదానీ గ్రూప్ 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.23 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టబోతోందని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం వెల్లడించారు. -
సుజుకీ మోటార్ గుజరాత్ నుంచి 30 లక్షల వాహనాల ఉత్పత్తి
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)కు కార్లు తయారు చేసే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ), ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది. -
రతన్ టాటా పేరుతో ‘ఫేక్’ సిఫారసులు
టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా పేరును దుర్వినియోగం చేస్తూ.. వచ్చిన ‘ఫేక్’ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇచ్చింది. -
1,14,902 అంకురాలకు గుర్తింపు
పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 31 వరకు దేశంలోని 1,14,902 సంస్థలను అంకురాలుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్లో 8% వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో విక్రయించడం ద్వారా రూ.1,100 కోట్ల నిధుల్ని ప్రభుత్వం సమీకరించబోతోంది.