పట్టణ సహకార బ్యాంకుల్లో ఎన్పీఏలు పెరిగాయ్
పట్టణ సహకార బ్యాంకు(యూసీబీ)ల్లో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) నిష్పత్తి 8.7 శాతంగా ఉందని, ఇది ఆమోదయోగ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ఇది ఆమోదయోగ్యం కాదు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి: పట్టణ సహకార బ్యాంకు(యూసీబీ)ల్లో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) నిష్పత్తి 8.7 శాతంగా ఉందని, ఇది ఆమోదయోగ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఎన్పీఏలు తగ్గేలా పాలన మెరుగుపరచుకోవాలని రుణదాతలకు సూచించారు. ఆర్బీఐ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో యూసీబీల డైరెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. యూసీబీ రంగంలో అనేక సవాళ్లు ఉన్న విషయాన్ని గుర్తించామని, ఇటీవలి కాలంలో ఆయా బ్యాంకులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘డిపాజిటర్ల నమ్మకంపై బ్యాంకులు నడుస్తాయి. మధ్య తరగతి, పేద వర్గాలు, పదవీ విరమణ పొందిన వారు కష్టపడి సంపాదించిన సొమ్మును కాపాడటాన్ని గుడికి లేదా గురుద్వారాకు వెళ్లడం కంటే చాలా పవిత్రంగా బ్యాంకులు భావించాల’ని యూసీబీల డైరెక్టర్లకు సలహా ఇచ్చారు. మొత్తం మీద చూస్తే పరిస్థితులు బాగానే ఉన్నా.. ఎన్పీఏలు, కనీస మూలధన నిష్పత్తి సంతృప్తికరంగా లేవని దాస్ ఆందోళన వెలిబుచ్చారు.షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ఎన్పీఏలు 2023 మార్చి నాటికి దశాబ్ద ఉత్తమ స్థాయి అయిన 3.9 శాతానికి రాగా, మున్ముందు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్పీఏలను నిర్వహించడానికి క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాలని సూచించారు. కనీస మూలధన నిష్పత్తి విషయంలో ఏడాది క్రితంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరం చివరకు 15.5 శాతం నుంచి 16.6 శాతానికి యూసీబీలు మెరుగయ్యాయని దాస్ తెలిపారు. బోర్డులో ఒకరిద్దరి ఆధిపత్యం మంచిది కాదు: పెద్ద వాణిజ్య బ్యాంకుల్లో సైతం బోర్డు సభ్యుల్లో ఒకరిద్దరు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు గుర్తించామని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ తరహా పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. బోర్డులో జరిగే చర్చలు స్వేచ్ఛగా, న్యాయంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో యెస్ బ్యాంక్ సంక్షోభంతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ సమస్యలు ఎదుర్కొన్న ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
3 ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా
నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లపై ఆర్బీఐ జరిమానా విధించింది. ‘రుణాలు, అడ్వాన్సులు-చట్టబద్ధ, ఇతర ఆంక్షలు’, ‘ఇంట్రా-గ్రూప్ లావాదేవీలు, ఎక్స్పోజర్ నిర్వహణపై మార్గదర్శకాలు’పై ఆర్బీఐ జారీ చేసిన పలు ఆదేశాలను పాటించనందుకు ఎస్బీఐపై రూ.1.3 కోట్ల జరిమానా విధించారు. రుణాలు, అడ్వాన్సులు-చట్టబద్ధ, ఇతర ఆంక్షలు, కేవైసీ, 2016 ఆర్బీఐ (డిపాజిట్లపై వడ్డీ రేట్లు) ఆదేశాల ఉల్లంఘనకు గాను ఇండియన్ బ్యాంక్ను రూ.1.62 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్బీఐ ఆదేశించింది. డిపాజిటర్ విద్య, అవగాహన నిధి పథకంలోని కొన్ని నిబంధనలు పాటించనందుకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కు రూ.1 కోటి జరిమానా వేసింది. ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్పై రూ.8.80 లక్షల జరిమానా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. -
ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ
గౌతమ్ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. -
స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు
ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. -
వచ్చే ఏడాది ప్రపంచం మందగమనమే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. -
డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది
కొవిడ్-19 పరిణామాల అనంతరం డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో.... -
2030కి రూ.29 లక్షల కోట్లకు దేశీయ ఐటీ రంగం
దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. -
రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ బుధవారం తెలిపారు. -
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్షైర్ హాతవేకు వైస్ఛైర్మన్గా వ్యవహరించిన చార్లీ మంగర్(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. -
ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ-శాటెల్లాజిక్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్ఎల్ వెల్లడించింది. -
భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి
భారత్లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన -
రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం
రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్(జమ్ము-కశ్మీర్, చత్తీస్గఢ్)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. -
సంక్షిప్త వార్తలు
సంస్థలకు క్లౌడ్, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్వన్) హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి...