సాయంత్రం 6 నుంచి 9 దాకా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్
ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్రేడింగ్ సమయాన్ని పొడిగించాలని ఎన్ఎస్ఈ భావిస్తోంది. ఇందులో భాగంగా దశల వారీగా, ఉత్పత్తుల వారీగా ట్రేడింగ్ సమయాన్ని పొడిగించాలనుకుంటోంది.
స్పందనను బట్టి రాత్రి 11:55 దాకా
ప్రణాళిక సిద్ధం చేస్తున్న ఎన్ఎస్ఈ
సెబీ అనుమతి కోసం ప్రతిపాదన
దిల్లీ: ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్రేడింగ్ సమయాన్ని పొడిగించాలని ఎన్ఎస్ఈ భావిస్తోంది. ఇందులో భాగంగా దశల వారీగా, ఉత్పత్తుల వారీగా ట్రేడింగ్ సమయాన్ని పొడిగించాలనుకుంటోంది. తొలుత ఇండెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ)లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రేడింగ్ సెషన్ నిర్వహించాలనుకుంటున్నట్లు ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. అనుమతి కోసం మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఎదుట ఈ ప్రతిపాదనను ఉంచినట్లు పేర్కొన్నారు. త్వరలోనే అనుమతి వస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఎక్స్ఛేంజీకి సెబీ నుంచి అనుమతి లభించగానే అందుకు తగ్గట్లు వ్యవస్థను సిద్ధం చేస్తామన్నారు. పొడిగించిన ట్రేడింగ్ సమయంలో మదుపర్ల నుంచి వచ్చే స్పందన ఆధారంగా దీన్ని ఆ తర్వాత రాత్రి 11.55 గంటల వరకు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకు ట్రేడింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
12.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలు
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్ మదుపర్ల ఆసక్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డీమ్యాట్ ఖాతాల్లో వృద్ధి కనిపిస్తోంది. ఆగస్టులో డీమ్యాట్ ఖాతాల సంఖ్య గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 26 శాతం పెరిగి, మొత్తమ్మీద 12.7 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 21 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఈ జులైలో 30 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభం కాగా, ఆగస్టులో 31 లక్షల కొత్త ఖాతాలు జత అయ్యాయని పేర్కొంది. గత ఏడాది ఆగస్టు నాటికి 10.1 కోట్ల డీమ్యాట్ ఖాతాలున్నాయి. మొత్తం డీమ్యాట్ ఖాతాల్లో ఎన్ఎస్డీఎల్లో 3.3 కోట్లు, సీడీఎస్ఎల్లో 9.35 కోట్ల మేరకు ఖాతాలున్నాయని సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
E-Verification of ITR: ఇ-వెరిఫై చేయలేదా? ఆ రిటర్నులను తొలగించుకోవచ్చు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది. -
రూ.2000కు మించిన తొలి ఆన్లైన్ లావాదేవీ 4 గంటల తర్వాతే
ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో నిబంధనను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పద్దతిలో లావాదేవీ జరగాలంటే.. -
టీకాలపై సంయుక్త పరిశోధన
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ (సిడ్నీ ఐడీ)తో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. టీకాలపై పరిశోధనలో ఉమ్మడిగా ముందుకు సాగాలనేది ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం. -
పండగ సీజన్లో వాహన విక్రయాలు అదుర్స్
బలమైన గిరాకీ నేపథ్యంలో, ఈ ఏడాది పండగ సీజన్లో వాహన రిటైల్ విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైందని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా మంగళవారం వెల్లడించింది. 42 రోజుల పాటు సాగిన పండగ సీజన్లో మొత్తంగా 37,93,584 వాహనాలు విక్రయమయ్యాయి. -
సౌందర్య ఉత్పత్తుల విక్రయాలు 51% పెరిగాయ్: అసిడస్ గ్లోబల్
ఇటీవలి పండగ విక్రయాల్లో ఎలక్ట్రానిక్స్, లైఫ్స్టైల్, సౌందర్య ఉత్పత్తులకు ఎక్కువ ఆదరణ లభించిందని అసిడస్ గ్లోబల్ నివేదిక పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్లు, అడాప్టర్లు, ఇయర్పాడ్లు ఎక్కువగా విక్రయమయ్యాయి. రెడ్మీ, వన్ప్లస్, బోట్ వంటి బ్రాండ్లు ఈ విభాగంలో సత్తా చాటాయి. -
రూ.331 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. మంగళవారం ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో వాహన, విద్యుత్, లోహ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. డాలర్తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 83.34 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.19 శాతం పెరిగి 80.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
70 లక్షల మొబైల్ కనెక్షన్ల రద్దు
ఆన్లైన్లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
ఓయో మళ్లీ సొంత హోటళ్ల నిర్వహణ
ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓయో, మళ్లీ సొంతంగా హోటళ్ల నిర్వహణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ వెబ్సైట్, యాప్ ద్వారా ‘మేనేజ్డ్ బై ఓయో’ పేరుతో ఈ సేవలను అందించనుంది. ఈ హోటళ్ల కోసం స్థిరాస్తులను అన్వేషించేందుకు స్థిరాస్తి అభివృద్ధి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఓయో పేర్కొంది. -
టీసీఎస్ రూ.17,000 కోట్ల షేర్ల బైబ్యాక్ 1 నుంచే
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.17,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియ (బైబ్యాక్)ను డిసెంబరు 1 నుంచి 7 వరకు నిర్వహించనుంది. ఈ బైబ్యాక్లో మదుపర్ల దగ్గర నుంచి 4.09 కోట్ల షేర్లను (సంస్థలో 1.12 శాతం వాటా) ఒక్కోటి రూ.4,150 చొప్పున కొనుగోలు చేయనుంది. -
వంటగ్యాస్లో హైడ్రోజన్ కలిపే ప్రాజెక్టు
వంటకు, పరిశ్రమలకు వినియోగించే సహజ వాయువు (గ్యాస్)లో హరిత హైడ్రోజన్ను కలిపే నమూనా ప్రాజెక్టును అదానీ టోటల్ గ్యాస్ అహ్మదాబాద్లో చేపట్టింది. గౌతమ్ అదానీ గ్రూప్, ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ సంయుక్త సంస్థే అదానీ టోటల్ గ్యాస్. గ్యాస్లో హరిత హైడ్రోజన్ వాటాను క్రమంగా 8 శాతానికి చేరుస్తామని కంపెనీ తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
-
CM Jagan: పిల్లల కళ్లజోళ్ల మీదా ఆయన బొమ్మే
-
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
-
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు