LuLu Mall - Hyderabad: హైదరాబాద్లో లులు మాల్
అంతర్జాతీయంగా రిటైల్ కేంద్రాలను నిర్వహిస్తున్న లులు గ్రూపు హైదరాబాద్లో అడుగు పెట్టింది.
5 లక్షల చ.అడుగుల విస్తీర్ణం
రూ.300 కోట్ల పెట్టుబడి
నేడు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: అంతర్జాతీయంగా రిటైల్ కేంద్రాలను నిర్వహిస్తున్న లులు గ్రూపు హైదరాబాద్లో అడుగు పెట్టింది. కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన లులు మాల్ను నేడు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, లులు గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలి ఎం.ఎ.తో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో లులు గ్రూపు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలి ఎం.ఎ. మాట్లాడుతూ.. అయిదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన లులు మాల్ హైదరాబాద్కు సరికొత్త ఆకర్షణగా మారనుందని తెలిపారు. ఇందులో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైపర్ మార్కెట్ ఉందన్నారు. దేశవ్యాప్తంగా లులు గ్రూప్నకు కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లఖ్నవూ, కోయంబత్తూర్లలో ఇప్పటికే మాల్స్ ఉండగా.. హైదరాబాద్ మాల్ ఆరోదని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రంలో తొలి దశలో రూ.500 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా ఈ మాల్ను ప్రారంభించాం. దీనికోసం రూ.300 కోట్ల వరకూ కేటాయించాం. ఈ మాల్ 1,500 వరకూ ప్రత్యక్ష, 2,000 వరకూ పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తుంది. 80-85 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాం. రోజుకు కనీసం 30 వేల మంది ఈ మాల్ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నాం. పళ్లు, కూరగాయలు, మాంసం తదితర తాజా ఉత్పత్తులు, కిరాణా సామగ్రి, దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, జీవన శైలి ఉత్పత్తులు లభిస్తాయి. 100కు పైగా దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ల అవుట్లెట్లు ఉంటాయి. నగరంలో ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఉంటున్నారు. వారికి అవసరమైన అన్ని వస్తువులూ ఇక్కడ దొరుకుతాయి’ అని తెలిపారు. 1,400 మంది సామర్థ్యంతో అయిదు సినిమా స్క్రీన్లు, 500 మంది కూర్చునే వసతి ఉన్న ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లూ ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 20,000 చ.అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక వినోద స్థలమూ ఉందన్నారు.
ఇతర నగరాలకూ..: ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ చిన్న పరిమాణంలో స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అష్రఫ్ వెల్లడించారు. ఎక్కడ ఏర్పాటు చేస్తామన్న విషయంపై ఇంకా స్పష్టత లేదని, పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించాకే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్ శివారులోని చెంగిచెర్లలో మాంసం శుద్ధి చేసేందుకు అధునాతన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి మాంసాన్ని ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.200 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆహార, చేపల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకూ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల విషయంపై అడిగిన ప్రశ్నకు ‘ఇది సందర్భం కాదు’ అన్నారు.
రెండున్నర ఏళ్లలో డెస్టినేషన్ మాల్
హైదరాబాద్లో డెస్టినేషన్ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు అష్రఫ్ అలి తెలిపారు. దాదాపు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రాబోతోందని, రూ.1,200 కోట్ల వరకూ పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. వచ్చే రెండున్నర ఏళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Zuckerberg: రోజుకు 4వేల కేలరీల ఆహారం తీసుకుంటా.. ఆసక్తికర విషయాలు పంచుకున్న జుకర్బర్గ్
టెక్ దిగ్గజం, మెటా సీఈవో జుకర్బర్గ్ (Zuckerberg)తన దినచర్యకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. -
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
Automobile retail sales | నవరాత్రితో మొదలై ధనత్రయోదశి తర్వాత 15 రోజుల వరకు కొనసాగిన 42 రోజుల పండగ సీజన్ (festive season)లో మొత్తం వాహన విక్రయాల సంఖ్య 31,95,213 యూనిట్ల నుంచి 37,93,584 యూనిట్లకు చేరింది. -
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!
Samsung Galaxy A05: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఏ05 పేరుతో కొత్త మొబైల్ని లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్లో కొనుగోలు చేసే వారికి రూ.1,000 క్యాష్బ్యాక్ ఇవ్వనుంది. -
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?
Digital Payments: ఆన్లైన్ మోసాలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ సరికొత్త విధానంపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి ఆన్లైన్ లావాదేవీకి నాలుగు గంటల వ్యవధి పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
JioPhone Prima Prepaid Plans: జియో ఇటీవల తీసుకొచ్చిన ప్రైమా ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు బయటకు వచ్చాయి. డేటా ప్రయోజనాలతో కూడిన మొత్తం ఏడు ప్లాన్లను తీసుకొచ్చింది. -
Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 48 పాయింట్ల లాభంతో 66,018 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 37 పాయింట్లు పెరిగి 19,832 దగ్గర కొనసాగుతోంది. -
జనవరి నుంచి కార్ల ధరల పెంపు..
కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ వెల్లడించాయి. -
6 నెలల గరిష్ఠానికి బంగారం ధరలు
అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు 6 నెలల గరిష్ఠానికి చేరాయి. ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర సోమవారం 2013.99 డాలర్లకు చేరింది. -
రేమండ్ వ్యాపారం సాఫీగా సాగుతుంది
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా భరోసా ఇచ్చారు. -
రూ.13,000 కోట్లతో భారత్లో ఫాక్స్కాన్ విస్తరణ!
ఐఫోన్ తయారీ సంస్థ హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ భారత్లో మరింత విస్తరించనుంది. ఫాక్స్కాన్గా సుపరిచితమైన ఈ సంస్థ ఇక్కడి నిర్మాణ ప్రాజెక్టులపై 1.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్లో పూర్తి వాటా విక్రయించం
బ్యాంకస్యూరెన్స్ ప్రయోజనాలు పొందేందుకు, ఐడీబీఐ బ్యాంక్లో కొంత వాటా అట్టే పెట్టుకోవాలని.. ఆ బ్యాంక్ ప్రమోటర్, ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తోంది. -
ఏఐ నైపుణ్యాలను నేర్చుకుందాం
కృత్రిమ మేధ సాంకేతికత, ఐటీ నిపుణులకు తప్పనిసరి అవసరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారని ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. -
66,500 పాయింట్ల స్థాయి కీలకం!
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడంతో మార్కెట్లు స్తబ్దుగా ట్రేడయ్యాయి. -
అల్యూమినియంలో కొనుగోళ్లు!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.61,985 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.62,351; రూ.62,967 వరకు రాణిస్తుందని భావించొచ్చు. -
దివ్యాంగుల కోసం అమెజాన్ ప్రత్యేక కార్యక్రమం
చదువులో ఇబ్బందిపడే దివ్యాంగుల్లో నైపుణ్యాలను వెలికితీసి, వారికి ఉపాధి కల్పించేందుకు అమెజాన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం ‘ఆరోరా’ను ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
వినియోగదారు సేవా ఏజెంట్ల పని భారం తగ్గించేందుకు ఏఐ చాట్బాట్ను వినియోగించడం ప్రారంభించినట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.


తాజా వార్తలు (Latest News)
-
Jos Alukkas Robbery: ప్రముఖ నగల దుకాణంలో 25కిలోల బంగారు ఆభరణాలు చోరీ
-
Cameron Green: గ్రీన్ కోసం రూ.17.5 కోట్లా?.. ఆర్సీబీ వ్యూహమేంటీ?
-
Zuckerberg: రోజుకు 4వేల కేలరీల ఆహారం తీసుకుంటా.. ఆసక్తికర విషయాలు పంచుకున్న జుకర్బర్గ్
-
Uttarakhand Tunnel: సొరంగం వద్ద డ్రిల్లింగ్ పూర్తి.. కాసేపట్లో కూలీలు బయటకు..
-
Supreme court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి