డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలు పెరిగాయ్
డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు పెరిగాయని వరల్డ్లైన్ నివేదిక వెల్లడించింది.
దిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు పెరిగాయని వరల్డ్లైన్ నివేదిక వెల్లడించింది. గత ఆగస్టులో 1,000 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది. పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలు అధికంగా జరగడంతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. 2018 జనవరిలో యూపీఐ లావాదేవీలు 15.1 కోట్లు కాగా, 2023 జూన్ నాటికి 930 కోట్లకు చేరాయని నివేదిక పేర్కొంది. 2022 జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీల్లో పీ2ఎం లావాదేవీల వాటా 40.3 శాతం ఉండగా, 2023 జూన్ నాటికి 57.5 శాతానికి చేరిందని వివరించింది. భవిష్యత్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. యూపీఐ పీ2ఎం లావాదేవీల సరాసరి టికెట్ పరిమాణం (ఏటీఎస్) 2022 జనవరిలో రూ.885 కాగా, 2023 జూన్ నాటికి రూ.653గా ఉందని తెలిపింది. లావాదేవీలు పెరిగినా, ఏటీఎస్ తగ్గడం చూస్తుంటే, వినియోగదార్లు చిన్న మొత్తం (మైక్రో) లావాదేవీలను సైతం యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారని అర్థమవుతోందని వెల్లడించింది.
ఎలక్ట్రానిక్ టోల్ వసూలు (ఈటీసీ) కూడా గణనీయంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 2022 జనవరిలో జారీ చేసిన ట్యాగ్లు 4.58 కోట్లు కాగా, 2023 జూన్లో 56.5 శాతం పెరిగి 7.19 కోట్లకు చేరాయని వివరించింది. పరిమాణం పరంగా చూస్తే, 2023 తొలి అర్ధ భాగంలో 185 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2022 తొలి 6 నెలల్లో 157 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 17.6 శాతం పెరిగాయి. విలువ పరంగా ఈటీసీ లావాదేవీలు 25.3 శాతం మేర పెరిగి ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.30,340 కోట్లకు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి... -
Royal Enfield: వచ్చే ఏడాదిలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రానున్న బైక్స్ ఇవే..
Upcoming Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి కొన్న మోటార్ సైకిళ్లు రానున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.. -
IREDA IPO: అదరగొట్టిన IREDA.. 87% ప్రీమియంతో ముగిసిన షేర్లు
IREDA IPO: ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్ఈడీఏ స్టాక్ మార్కెట్లో అదరగొట్టింది. బుధవారం లిస్టింగ్కు వచ్చిన ఈ సంస్థ 56 శాతం ప్రీమియంతో అడుగుపెట్టగా.. 87 శాతం ప్రీమియం వద్ద ముగిశాయి. -
OnePlus: వన్ప్లస్ నార్డ్ సీఈ 3 ధర తగ్గింపు.. ఇప్పుడెంతంటే?
OnePlus Nord CE 3 Price Cut: జులైలో విడుదలైన వన్ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ రూ.2,000 వరకు తగ్గించింది. -
Byjus: బైజూస్కు వరుస షాకులు.. ఓవైపు బీసీసీఐ.. మరోవైపు ప్రోసస్!
ఎడ్టెక్ సంస్థ బైజూస్కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. బైజూస్ చెల్లించాల్సిన బకాయిల వ్యవహారంలో బీసీసీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించగా.. బైజూస్లో పెట్టుబడులు పెట్టిన సంస్థ సంస్థ విలువను భారీగా తగ్గించింది. -
World Economy: 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుంగుబాటు.. ఓఈసీడీ అంచనా!
World Economy: ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.9 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఓఈసీడీ (OECD).. వచ్చే ఏడాది అది 2.7 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. -
Gautam adani: అదానీ షేర్లు జూమ్.. కుబేరుల జాబితాలో టాప్-20లోకి అదానీ
Gautam adani: అదానీ గ్రూప్ షేర్లు దూసుకెళ్లడంతో గౌతమ్ అదానీ కుబేరుల జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. టాప్-20లోకి చేరారు. -
Stock Market: సెన్సెక్స్కు 728 పాయింట్ల లాభం.. 21,000 చేరువకు నిఫ్టీ
Stock Market Closing bell: ఉదయం సెన్సెక్స్ (Sensex) 727.71 పాయింట్లు లాభపడి 66,901.91 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 206.90 పాయింట్లు పెరిగి 20,096.60 దగ్గర ముగిసింది. -
Amazon Q: చాట్జీపీటీకి పోటీగా అమెజాన్ ‘క్యూ’
Amazon Q | కంటెంట్ను సృష్టించడం, బ్లాగ్ పోస్ట్లను రాయడం వంటి పనులను ‘క్యూ’ సులభంగా చేస్తుందని అమెజాన్ వెల్లడించింది. -
M-cap: 4లక్షల కోట్ల డాలర్లకు మదుపర్ల సంపద.. ఈ మార్క్ దాటిన ఐదో మార్కెట్ భారత్
M-cap: బీఎస్ఈ (BSE)లోని నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2007 మే 28న తొలిసారి 1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Charlie Munger: వారెన్ బఫెట్ సక్సెస్ చిరునామా చార్లీ ముంగర్ ఇకలేరు
Charlie Munger: సుదీర్ఘ కాలం బెర్క్షైర్ హాత్వే వైస్ ఛైర్మన్గా పనిచేసిన చార్లీ ముంగర్ మంగళవారం తుది శ్వాస విడిచారు. ప్రపంచ ప్రఖ్యాత మదుపరి వారెన్ బఫెట్ సక్సెస్లో ముంగర్ది కీలక పాత్ర. -
Airtel vs Jio: నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..
Netflix Prepaid Plans: ప్రస్తుతం 5జీ నెట్వర్క్ని అందిస్తున్న టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్.. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయి. -
December deadline: ఆధార్ అప్డేట్.. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్.. డిసెంబర్ డెడ్లైన్స్ ఇవే!
December 2023 money deadlines: 2023 సంవత్సరానికి దాదాపు చివరకు వచ్చేశాం. ఈ ఒక్క నెలా ఆగితే ఏడాది పూర్తవుతుంది. సంవత్సరమే కాదు అనేక పథకాల డెడ్లైన్ కూడా 31తో ముగియనుంది. -
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,000 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 343 పాయింట్ల లాభంతో 66,517 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు పెరిగి 19,993 దగ్గర కొనసాగుతోంది. -
E-Verification of ITR: ఇ-వెరిఫై చేయలేదా? ఆ రిటర్నులను తొలగించుకోవచ్చు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది. -
రూ.2000కు మించిన తొలి ఆన్లైన్ లావాదేవీ 4 గంటల తర్వాతే
ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో నిబంధనను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పద్దతిలో లావాదేవీ జరగాలంటే.. -
టీకాలపై సంయుక్త పరిశోధన
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ (సిడ్నీ ఐడీ)తో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. టీకాలపై పరిశోధనలో ఉమ్మడిగా ముందుకు సాగాలనేది ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం. -
పండగ సీజన్లో వాహన విక్రయాలు అదుర్స్
బలమైన గిరాకీ నేపథ్యంలో, ఈ ఏడాది పండగ సీజన్లో వాహన రిటైల్ విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైందని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా మంగళవారం వెల్లడించింది. 42 రోజుల పాటు సాగిన పండగ సీజన్లో మొత్తంగా 37,93,584 వాహనాలు విక్రయమయ్యాయి. -
సౌందర్య ఉత్పత్తుల విక్రయాలు 51% పెరిగాయ్: అసిడస్ గ్లోబల్
ఇటీవలి పండగ విక్రయాల్లో ఎలక్ట్రానిక్స్, లైఫ్స్టైల్, సౌందర్య ఉత్పత్తులకు ఎక్కువ ఆదరణ లభించిందని అసిడస్ గ్లోబల్ నివేదిక పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్లు, అడాప్టర్లు, ఇయర్పాడ్లు ఎక్కువగా విక్రయమయ్యాయి. రెడ్మీ, వన్ప్లస్, బోట్ వంటి బ్రాండ్లు ఈ విభాగంలో సత్తా చాటాయి. -
రూ.331 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. మంగళవారం ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో వాహన, విద్యుత్, లోహ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. డాలర్తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 83.34 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.19 శాతం పెరిగి 80.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.


తాజా వార్తలు (Latest News)
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్
-
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
-
Bullet train: తొలి బుల్లెట్ రైలు.. ఆగస్టు 2026 నాటికి 50కి.మీ సిద్ధం!