ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ
ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో మంగళవారం సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
సమీక్ష
ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో మంగళవారం సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బలహీన ఆసియా సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 15 పైసలు తగ్గి 83.28 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.79% నష్టపోయి 92.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 66,071.63 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీ.. ఒక దశలో 65,865.63 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 78.22 పాయింట్ల నష్టంతో 65,945.47 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 9.85 పాయింట్లు తగ్గి 19,664.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 19,637.45- 19,699.35 పాయింట్ల మధ్య కదలాడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 15 డీలాపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.29%, టెక్ మహీంద్రా 1.28%, కోటక్ బ్యాంక్ 1.24%, ఇన్ఫోసిస్ 1%, ఏషియన్ పెయింట్స్ 0.89%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.83%, టైటన్ 0.75%, బజాజ్ ఫిన్సర్వ్ 0.56% చొప్పున నష్టపోయాయి. నెస్లే, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.58% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ 0.46%, బ్యాంకింగ్ 0.45%, టెక్ 0.36%, మన్నికైన వినిమయ వస్తువులు 0.23%, ఆర్థిక వలు 0.21% నీరసించాయి. కమొడిటీస్, వినియోగ, ఎఫ్ఎమ్సీజీ, పరిశ్రమలు, టెలికాం పెరిగాయి. బీఎస్ఈలో 1861 షేర్లు నష్టాల్లో ముగియగా, 1803 స్క్రిప్లు లాభపడ్డాయి. 129 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- రూ.1,040.5 కోట్ల విలువైన ఏఏఏ రేటింగ్ సామాజిక బాండ్లను జారీ చేసినట్లు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ (నాబార్డ్) వెల్లడించింది. అయిదేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ బాండ్లను సంస్థాగత మదుపర్లకు జారీ చేస్తారు. సెప్టెంబరు 29న బీఎస్ఈలో ఇవి నమోదుకానున్నాయి.
- ఇండస్ఇండ్ బ్యాంక్తో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును జారీ చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చినట్లు సైరస్ పూనావాలా గ్రూప్ సంస్థ పూనావాలా ఫిన్కార్ప్ తెలిపింది. వచ్చే మూడు నెలల్లో ఈ క్రెడిట్ కార్డును తీసుకురానుంది.
- హిమాచల్ ప్రదేశ్లో ఆసుపత్రులు, ఫార్మసీలకు కీలకమైన ఔషధాలను అందించేందుకు డ్రోన్ ఆధారిత డెలివరీలను తీసుకొచ్చినట్లు సిప్లా పేర్కొంది. ఇందుకోసం స్కై ఎయిర్ మొబిలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
- కోంటార్ స్పేస్ ఐపీఓ బుధవారం ప్రారంభమై అక్టోబరు 3న ముగియనుంది. ఒక్కో షేరు రూ.93 చొప్పున విక్రయించడం ద్వారా రూ.15.62 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం ఈ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్పై నమోదుకానున్నాయి.
- పలు రకాల పరిశ్రమల వారీగా కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్లను అందించేందుకు మైక్రోసాఫ్ట్తో ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
QR code scams: క్యూఆర్ కోడ్ స్కామ్లతో జాగ్రత్త!
QR code scams: తరచూ క్యూఆర్కోడ్ స్కాన్ చేసి లావాదేవీలు జరుపుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. -
5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు
దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని.. సుమారు 10కోట్ల మంది వీటి సేవలను వినియోగించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. -
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
UCO bank Funds: యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి పొరపాటున కోట్లాది రూపాయల నగదు జమ అయిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నగదు లావాదేవీలు జరిగిన తేదీల్లో తెరుచుకున్న ఖాతాలపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించింది. -
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
యూఎస్బీ-సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యాపిల్ సంస్థ కేంద్రాన్ని కోరింది. -
గోఫస్ట్ కథ కంచికేనా?
దేశీయ విమానయాన కంపెనీల్లో మరో సంస్థ కథ కంచికి చేరినట్లే!.. ఈ ఏడాది మే 2న విమాన సర్వీసులు నిలిపేసి.. స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన గోఫస్ట్.. ఇక ఎగరకపోవచ్చు. -
ఏఎల్ఎస్ వ్యాధికి నూతన ఔషధం
నరాల వ్యాధులకు సంబంధించిన ఒక బయోలాజికల్ మిశ్రమ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసి వివిధ దేశాల్లో విక్రయించడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోయ థెరప్యూటిక్స్ ఇంక్., అనే బయోటెక్నాలజీ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. -
కార్లు, బైక్లకు భలే గిరాకీ
ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల)తో పాటు ద్విచక్ర వాహనాల (బైక్లు, స్కూటర్ల)కు లభించిన అధిక గిరాకీ వల్లే, నవంబరులో రికార్డు స్థాయిలో వాహన రిటైల్ విక్రయాలు సాగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. -
కొనసాగిన రికార్డుల పరుగు
వరుసగా ఏడో రోజూ పరుగులు తీసిన సెన్సెక్స్, నిఫ్టీ.. తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ షేర్లు మార్కెట్లను ముందుకు నడిపించాయి. -
తుపాను బాధిత ప్రాంతాల్లోని వినియోగదార్లకు వాహన సంస్థల మద్దతు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో మిగ్జాం తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వినియోగదార్లకు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్, ఆడి, ఫోక్స్వ్యాగన్ తదితర వాహన సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. -
ఎయిరిండియా విమానాల ఆర్డరులో మార్పులు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా, ఈ ఏడాది మొదట్లో ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్కు 250 విమానాలకు ఆర్డరు పెట్టింది. -
పునరుత్పాదక ఇంధనాలపై అదానీ గ్రూప్ రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడి!
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు, అదానీ గ్రూప్ 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.23 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టబోతోందని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం వెల్లడించారు. -
సుజుకీ మోటార్ గుజరాత్ నుంచి 30 లక్షల వాహనాల ఉత్పత్తి
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)కు కార్లు తయారు చేసే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ), ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది. -
రతన్ టాటా పేరుతో ‘ఫేక్’ సిఫారసులు
టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా పేరును దుర్వినియోగం చేస్తూ.. వచ్చిన ‘ఫేక్’ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇచ్చింది. -
1,14,902 అంకురాలకు గుర్తింపు
పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 31 వరకు దేశంలోని 1,14,902 సంస్థలను అంకురాలుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
రైల్వే ప్రభుత్వ రంగ సంస్థ ఇర్కాన్లో 8% వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో విక్రయించడం ద్వారా రూ.1,100 కోట్ల నిధుల్ని ప్రభుత్వం సమీకరించబోతోంది.


తాజా వార్తలు (Latest News)
-
భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన మందుబాబు వీరంగం
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం
-
Hyderabad: రేవంత్ ప్రమాణస్వీకారం.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్