ఏఐ, క్లౌడ్తో లాభాలే లాభాలు
కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్ వంటి కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెట్టేందుకు వివిధ వ్యాపార సంస్థలు ఆసక్తిగా ముందుకు వస్తున్నట్లు అగ్రశ్రేణి కన్సల్టింగ్ సేవల సంస్థ అయిన కేపీఎంజీ స్పష్టం చేసింది.
కొత్త తరం సాంకేతికతపై పెట్టుబడులు పెట్టేందుకు సంస్థల ఆసక్తి
పెరుగుతున్న ఉద్యోగుల సామర్థ్యం
కేపీఎంజీ ‘గ్లోబల్ టెక్ రిపోర్ట్’ విశ్లేషణ
ఈనాడు - హైదరాబాద్
కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్ వంటి కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెట్టేందుకు వివిధ వ్యాపార సంస్థలు ఆసక్తిగా ముందుకు వస్తున్నట్లు అగ్రశ్రేణి కన్సల్టింగ్ సేవల సంస్థ అయిన కేపీఎంజీ స్పష్టం చేసింది. అంతేగాక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ద్వారా అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశాన్ని ఆయా సంస్థలు అందిపుచ్చుకుంటున్నట్లు పేర్కొంది. ‘కేపీఎంజీ గ్లోబల్ టెక్ రిపోర్ట్ 2023’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం...
- కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆసక్తి ప్రదర్శిస్తున్న వ్యాపారవేత్తల సంఖ్య 10 శాతం నుంచి గత ఏడాదిలో 38 శాతానికి పెరిగింది.
- కృత్రిమ మేధ(ఏఐ)ను ఎంతో ముఖ్యమైన టెక్నాలజీగా ఎక్కువ మంది పరిగణిస్తున్నారు. స్వల్పకాలానికి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏఐ ఎంతగానో దోహదపడుతుందని విశ్వసిస్తున్నారు.
- డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యోగుల సామర్థ్యం బాగా పెరిగినట్లు 72 శాతం మంది ‘డిజిటల్ లీడర్స్’ స్పష్టం చేశారు.
- ఈఎస్జీ (ఎన్విరాన్మెంట్, సోషల్ గవర్నెన్స్) లక్ష్యాల సాధనకు నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రధానోద్దేశంగా, చోదక శక్తిగా కనిపిస్తోంది.
- నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలు, డిజిటల్ పెట్టుబడులు అధికంగా పెట్టడం ద్వారా వినియోగదార్లకు సరికొత్త అనుభూతిని అందించడం సాధ్యమని ఎక్కువ మంది వ్యాపారవేత్తలు, బిజినెస్ లీడర్స్ భావిస్తున్నారు.
- నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి సమన్వయంతో కూడిన చర్యలు అవసరమని, ఇదే పెద్ద సవాలు అనేది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది.
10 శాతానికి పైగా అధిక లాభాలు: దాదాపు 2,100 మంది టెక్నాలజీ లీడర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను కేపీఎంజీ సిద్ధం చేసింది. ఇందులో 29 శాతం మంది ఆసియా, పసిఫిక్ ప్రాంతానికి చెందిన వారు కాగా, అమెరికా నుంచి 33 శాతం మంది ఉన్నారు. ఇంధనం, విద్య, ఆర్థిక సేవలు, ప్రభుత్వం, ఆరోగ్య రంగం, పారిశ్రామిక ఉత్పత్తి, టెక్నాలజీ, రిటైల్, ప్యాక్ చేసిన ఆహార పదార్ధాల పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యాపారవేత్తలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఇందులో ఉన్నారు. అవసరమైన పెట్టుబడులు పెట్టి అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసినట్లయితే లాభాలు 10 శాతానికి పైగా పెరుగుతున్నట్లు ఎక్కువ మంది స్పష్టం చేశారు. కృత్రిమ మేధ, డేటా, అనలిటిక్స్, ఎక్స్ఏఏఎస్ (ఎనీథింగ్ యాస్ ఏ సర్వీస్) టెక్నాలజీలపై అధికంగా పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది సుముఖంగా ఉన్నారు. వినియోగదార్ల సంతృప్తి, ఈఎస్జీ, సైబర్ సెక్యూరిటీలను దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీలను అమలు చేయడానికి వ్యాపార సంస్థలు ముందుకు వస్తున్నాయని ఈ నివేదిక విశ్లేషించింది. ఏఐ, ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నులను సమూలంగా మార్చివేస్తున్నట్లు కేపీఎంజీ ఇండియా భాగస్వామి, లైట్హౌస్ (డేటా, ఏఐ, అనలిటిక్స్) హెడ్ సచిన్ అరోరా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. -
ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ
గౌతమ్ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. -
స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు
ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. -
వచ్చే ఏడాది ప్రపంచం మందగమనమే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. -
డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది
కొవిడ్-19 పరిణామాల అనంతరం డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో.... -
2030కి రూ.29 లక్షల కోట్లకు దేశీయ ఐటీ రంగం
దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. -
రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ బుధవారం తెలిపారు. -
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్షైర్ హాతవేకు వైస్ఛైర్మన్గా వ్యవహరించిన చార్లీ మంగర్(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. -
ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ-శాటెల్లాజిక్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్ఎల్ వెల్లడించింది. -
భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి
భారత్లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన -
రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం
రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్(జమ్ము-కశ్మీర్, చత్తీస్గఢ్)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. -
సంక్షిప్త వార్తలు
సంస్థలకు క్లౌడ్, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్వన్) హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి...


తాజా వార్తలు (Latest News)
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
-
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
-
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!