2023-24లో జీడీపీ వృద్ధి 6.5%
దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 6.5 శాతంగా నమోదు కావొచ్చని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అంచనా వేశారు.
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్
దిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 6.5 శాతంగా నమోదు కావొచ్చని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అంచనా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 9 ఏళ్లుగా తీసుకొచ్చిన సంస్కరణలు దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై సానుకూల ప్రభావం చూపాయని పేర్కొన్నారు. దేశ యువత ఆకాంక్షలకు తగ్గట్లు సరిపడా ఉద్యోగాల సృష్టికి 8 శాతం పైన ఆర్థిక వృద్ధి నమోదు కావాల్సిన అవసరం ఉందని, ఇది సాధ్యమేనని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉండటంతో పాటు, వచ్చే కొన్నేళ్లపాటు ఇది స్థిరంగా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. 2022-23లో దేశ ఆర్థిక వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. 2021-22లో ఇది 9.1 శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాల ప్రకారం, దేశ జీడీపీ వృద్ధి 2023-24లో 6.5 శాతంగా నమోదు కావొచ్చు.
- బాహ్య స్థూల ఆర్థికానికి, దేశీయ ఆర్థిక పరిస్థితులకు సమతౌల్యం ఉందని, స్థూలంగా ఆర్థిక పరిస్థితులు మంచి స్థితిలో ఉన్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు. కరెంట్ ఖాతా లోటు అదుపులోనే ఉందని, దేశ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు 11 నెలల దిగుమతులకు సరిపోయేలా ఉన్నాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దేశీయంగా చూస్తే ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయిలకు దగ్గరగా వస్తోందని, పన్ను ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే 16 శాతం పెరిగి మంచి స్థితిలో ఉందని వెల్లడించారు. ఇవన్నీ దేశ ఆర్థిక స్థితిని సరిగ్గా చూసుకుంటాయని, ఆర్థిక స్థిరీకరణ జరుగుతుందని వివరించారు. రేటింగ్ ఏజెన్సీలు మన దేశ రేటింగ్ను పెంచుతున్నాయని, జేపీ మోర్గాన్ భారత్ను అంతర్జాతీయ బాండ్ల సూచీలో చేర్చడం దీనికి ఒక నిదర్శనమని పేర్కొన్నారు.
- దేశ ఎగుమతులకొస్తే ఏప్రిల్-ఆగస్టులో 11 శాతం తగ్గడంపై రాజీవ్ స్పందిస్తూ.. అంతర్జాతీయ వాణిజ్య పని తీరుతో మన దేశం బలంగా సహసంబంధాలు కలిగి ఉండటంతో ఎగుమతులు తగ్గాయన్నారు. ఐరోపా, యూఎస్, ఇతర అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో బలహీన గిరాకీ ఉండటంతో అంతర్జాతీయ వాణిజ్యం కూడా స్తబ్దుగా ఉందని, మన దేశం కూడా దీన్ని అనుసరించిందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
హోండా కంపెనీ తన సీబీ350, సీబీ 350 ఆర్ఎస్ మోడల్ బైకులను రీకాల్ చేసింది. ఒక పార్ట్లో లోపాన్ని గుర్తించామని, దాన్ని రీప్లేస్ చేసి ఇస్తామని కంపెనీ పేర్కొంది. -
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్
Google: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? -
రామలింగ రాజు, మరో నలుగురు రూ.624 కోట్లు లాభపడ్డారు
దాదాపు 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. -
జోష్
దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది -
వాహన అమ్మకాలకు పండగ హుషారు
ఈ ఏడాది నవంబరులో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరా రికార్డు స్థాయిలో జరిగింది. పండగ సీజను గిరాకీకి తగ్గట్లుగా డీలర్లకు కంపెనీలు భారీగా వాహనాలను అందించాయి -
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15 శాతం అధికం. ‘2023 నవంబరులో స్థూలంగా రూ.1,67,929 కోట్ల జీఎస్టీ వసూలైంది. -
భారత ఆర్థిక భవితపై సీఎఫ్ఓలు ఆశావహం
దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94 శాతం భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్ఓ) విశ్వాసం వ్యక్తం చేశారని డెలాయిట్ ఇండియా పేర్కొంది. ఆసియా పసిఫిక్ (అపాక్) ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావహ శాతమని వెల్లడించింది. -
న్యాయ సలహాదారును నియమించుకోనున్న రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లు
రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గౌతమ్ సింఘానియా విడాకుల వివాదం వల్ల ఏర్పడ్డ పరిస్థితులను పరిశీలిస్తున్నామని ఆ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు పేర్కొన్నారు. కంపెనీ వ్యవహారాలు, వ్యాపారంపై ప్రభావం పడకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం. -
రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే
చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది -
డీప్ఫేక్ వీడియోలపై ఆసక్తి లేదు
డీప్ఫేక్ వీడియోలపై యూట్యూబ్కు ఎంతమాత్రం ఆసక్తి లేదని ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంతో అనుబంధం ఉండాలని మా భాగస్వాములెవరూ భావించడం లేదనీ తెలిపారు. -
ఒక కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వం
ఒక రంగంలోని సంస్థలన్నింటికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ, ఒక విభాగంలోని ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎటువంటి రాయితీలను ఇవ్వదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు -
రూ.22 పెరిగిన వాణిజ్య సిలిండర్
హోటళ్లు, రెస్టారెంట్ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. ఈ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.2002 నుంచి రూ.22 పెరిగి రూ.2024 అయ్యింది. -
సంక్షిప్త వార్తలు(6)
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎమ్ఎస్ఐ) తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైక్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
-
Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!