వైభవ్ జ్యువెలర్స్ షేర్ల నమోదు నేడే
గత త్రైమాసికంలో (జులై- సెప్టెంబరు) ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ ఇష్యూలు సందడి చేశాయి. అయితే ఈ త్రైమాసికం (అక్టోబరు- డిసెంబరు) స్తబ్దుగానే మొదలుకానుంది.
మరో 6 కంపెనీలవి ఈ వారంలోనే
14 పబ్లిక్ ఇష్యూల ముగింపు కూడా
స్తబ్దుగా ప్రారంభమవుతున్న అక్టోబరు- డిసెంబరు త్రైమాసికం
గత త్రైమాసికంలో (జులై- సెప్టెంబరు) ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ ఇష్యూలు సందడి చేశాయి. అయితే ఈ త్రైమాసికం (అక్టోబరు- డిసెంబరు) స్తబ్దుగానే మొదలుకానుంది. ఈవారం కొత్త పబ్లిక్ ఇష్యూలు లేకపోవడమే ఇందుకు కారణం. అయితే ప్రధాన, ఎస్ఎమ్ఈ ప్లాట్ఫామ్లపై గత నెల చివర్లో ప్రారంభమైన 14 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓలు) ఈవారంలోనే ముగియనున్నాయి. అలాగే ఏడు కంపెనీల షేర్లు ఇదే వారంలో ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి.
ప్రధాన ప్లాట్ఫాంపై
- ఔషధ కంపెనీ వాలియంట్ లేబొరేటరీస్ పబ్లిక్ ఇష్యూ అక్టోబరు 3న ముగియనుంది. ఇప్పటివరకు ఈ సంస్థ ఐపీఓకు 2.17 రెట్ల స్పందన లభించింది. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా రూ.152 కోట్లు సమీకరించాలని వాలియంట్ లేబొరేటరీస్ భావిస్తోంది.
- దిల్లీ కేంద్రంగా వైర్ల తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ప్లాజా వైర్స్ ఐపీఓకు చివరి తేదీ అక్టోబరు 5. ఇష్యూ సెప్టెంబరు 29న ప్రారంభమైంది. తొలి రోజున 4.68 రెట్ల మేర అధికంగా షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
ఎస్ఎమ్ఈ ప్లాట్ఫామ్పై
- ఐటీ సొల్యూషన్ల సంస్థ కేనరీస్ ఆటోమేషన్స్, లాజిస్టిక్స్ సంస్థ వన్క్లిక్ లాజిస్టిక్స్ ఇండియా ఇష్యూలు అక్టోబరు 3న ముగియనున్నాయి. ఈ రెండు సంస్థల ఇష్యూలకు ఇప్పటివరకు వరుసగా 98 శాతం, 16.49 రెట్ల స్పందన లభించింది.
- ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ విన్యాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, ఈవెంట్ల నిర్వహణ సంస్థ ఈ ఫ్యాక్టర్ ఎక్స్పీరియెన్సెస్, ముడి ఉప్పు శుద్ధి సంస్థ గోయల్ సాల్ట్ పబ్లిక్ ఇష్యూలు కూడా అక్టోబరు 3వ తేదీనే ముగియనున్నాయి. వీటికి ఇప్పటివరకు వరుసగా 3.03 రెట్లు, 3.77 రెట్లు, 103.71 రెట్ల మేర స్పందన లభించడం విశేషం. ఇవే కాకుండా కొంటోర్ స్పేస్, సునీతా టూల్స్ ఐపీఓలకు కూడా అక్టోబరు 3వ తేదీనే చివరి రోజు. ఈ రెండు సంస్థలు ఐపీఓలో భాగంగా జారీ చేసిన షేర్లకుగాను ఇప్పటివరకు వరుసగా 15.76 రెట్లు, 8.72 రెట్ల మేర అధికంగా షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
- ఇప్పటివరకు వరుసగా 12 శాతం, 1.33 రెట్ల మేర స్పందన లభించిన కర్ణిక ఇండస్ట్రీస్, ప్లాడా ఇన్ఫోటెక్ సర్వీసెస్ ఐపీఓలకు ముగింపు తేదీ అక్టోబరు 5. షార్ప్ చక్స్ అండ్ మెషీన్స్, విష్ణుసూర్య ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్రాల ఇష్యూలు కూడా ఇదే రోజు ముగియనున్నాయి. వీటికి ఇప్పటివరకు 93 శాతం, 78 శాతం మేర స్పందన లభించింది. వివా ట్రేడ్కామ్ ఐపీఓ అక్టోబరు 4న ముగియనుండగా.. ఇప్పటివరకు 50 శాతం మేర షేర్లకే బిడ్లు వచ్చాయి.
నమోదయ్యేవి ఇవే..
- ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఆభరణాల విక్రయాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న వైభవ్ జ్యువెలర్స్ షేర్లు నేడు ఎక్స్ఛేంజీల్లో అడుగుపెట్టనున్నాయి. దేశంలోని రెండో అతిపెద్ద వాణిజ్య ఓడరేవుల నిర్వాహక సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు కూడా ఈ వారంలోనే (అక్టోబరు 3న) ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి.
- ఎస్ఎమ్ఈ విభాగంలో సాక్షి మెడ్టెక్ అండ్ ప్యానెల్స్ షేర్లు అక్టోబరు 3న, మంగళం ఎల్లాయ్స్, డిజికోర్ స్టూడియోస్ షేర్లు అక్టోబరు 4న నమోదు కానున్నాయి. ఆర్గానిక్ రీసైక్లింగ్ సిస్టమ్స్, ఇన్స్పైర్ ఫిల్మ్స్ షేర్లలో ట్రేడింగ్ అక్టోబరు 5 నుంచి మొదలుకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Whatsapp: వాట్సప్లో యూజర్ నేమ్.. చాట్స్కు సీక్రెట్ కోడ్!
Whatsapp new features: వాట్సప్లో త్వరలో యూజర్ నేమ్ సదుపాయం రాబోతోంది. అలాగే ఎంపిక చేసిన చాట్స్ను లాక్ చేసిన వాటికి సీక్రెట్ కోడ్ పెట్టుకునే సదుపాయాన్ని వాట్సప్ తీసుకొస్తోంది. -
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
హోండా కంపెనీ తన సీబీ350, సీబీ 350 ఆర్ఎస్ మోడల్ బైకులను రీకాల్ చేసింది. ఒక పార్ట్లో లోపాన్ని గుర్తించామని, దాన్ని రీప్లేస్ చేసి ఇస్తామని కంపెనీ పేర్కొంది. -
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్
Google: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? -
రామలింగ రాజు, మరో నలుగురు రూ.624 కోట్లు లాభపడ్డారు
దాదాపు 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. -
జోష్
దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది -
వాహన అమ్మకాలకు పండగ హుషారు
ఈ ఏడాది నవంబరులో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరా రికార్డు స్థాయిలో జరిగింది. పండగ సీజను గిరాకీకి తగ్గట్లుగా డీలర్లకు కంపెనీలు భారీగా వాహనాలను అందించాయి -
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15 శాతం అధికం. ‘2023 నవంబరులో స్థూలంగా రూ.1,67,929 కోట్ల జీఎస్టీ వసూలైంది. -
భారత ఆర్థిక భవితపై సీఎఫ్ఓలు ఆశావహం
దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94 శాతం భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్ఓ) విశ్వాసం వ్యక్తం చేశారని డెలాయిట్ ఇండియా పేర్కొంది. ఆసియా పసిఫిక్ (అపాక్) ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావహ శాతమని వెల్లడించింది. -
న్యాయ సలహాదారును నియమించుకోనున్న రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లు
రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గౌతమ్ సింఘానియా విడాకుల వివాదం వల్ల ఏర్పడ్డ పరిస్థితులను పరిశీలిస్తున్నామని ఆ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు పేర్కొన్నారు. కంపెనీ వ్యవహారాలు, వ్యాపారంపై ప్రభావం పడకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం. -
రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే
చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది -
డీప్ఫేక్ వీడియోలపై ఆసక్తి లేదు
డీప్ఫేక్ వీడియోలపై యూట్యూబ్కు ఎంతమాత్రం ఆసక్తి లేదని ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంతో అనుబంధం ఉండాలని మా భాగస్వాములెవరూ భావించడం లేదనీ తెలిపారు. -
ఒక కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వం
ఒక రంగంలోని సంస్థలన్నింటికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ, ఒక విభాగంలోని ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎటువంటి రాయితీలను ఇవ్వదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు -
రూ.22 పెరిగిన వాణిజ్య సిలిండర్
హోటళ్లు, రెస్టారెంట్ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. ఈ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.2002 నుంచి రూ.22 పెరిగి రూ.2024 అయ్యింది. -
సంక్షిప్త వార్తలు(6)
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎమ్ఎస్ఐ) తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైక్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
WPL Auction: డిసెంబర్ 9న డబ్ల్యూపీఎల్ వేలం.. స్లాట్లు 30.. అందుబాటులోకి 165 మంది
-
Whatsapp: వాట్సప్లో యూజర్ నేమ్.. చాట్స్కు సీక్రెట్ కోడ్!
-
Pawan Kalyan: నేను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చూపిస్తా: పవన్ కల్యాణ్
-
Animal: రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి