ఐటీ ఫలితాలు.. అంతంతే!
ఎప్పటిలాగే కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజనులో ముందుగా గణాంకాలను ప్రకటించడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.
గిరాకీలో బలహీనతలు, స్థూల అనిశ్చితుల వల్లే
సెప్టెంబరు త్రైమాసికంపై నొమురా అంచనాలు
ఎప్పటిలాగే కార్పొరేట్ సంస్థల ఫలితాల సీజనులో ముందుగా గణాంకాలను ప్రకటించడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి ఫలితాలు ఈసారి గొప్పగా ఏమీ ఉండకపోవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనా వేస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా గిరాకీలో బలహీనతలు, స్థూల అనిశ్చితులు ఇందుకు కారణమవుతాయని భావిస్తోంది.
కారణాలెన్నో..
దేశీయ ఐటీ కంపెనీలకు పెద్ద ప్రాజెక్టులు తగ్గాయి. చిన్న చిన్న ప్రాజెక్టులకే పరిమితం కావడంతో పాటు.. క్లయింట్ల నిర్ణయాల్లో ఆలస్యమవడంతో ప్రాజెక్టులను దక్కించుకోవడం, వేగంగా పూర్తి చేయడం ఐటీ సంస్థలకు క్లిష్టతరమైంది. దీంతో స్వల్పకాలంలో ఐటీ కంపెనీల ఆదాయాలు, మార్జిన్లు నిరుత్సాహపరచే అవకాశం ఉందని నొమురా విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి త్రైమాసికం వారీగా చూస్తే -1 శాతం నుంచి 2 శాతం మేరే ఉండొచ్చని అంటోంది. మధ్య స్థాయి కంపెనీలు మాత్రం 0.7%-3.3 శాతం వరకు రాణించే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ స్థిర కరెన్సీ లెక్కన గణించినవి. పెద్ద స్థాయి ఐటీ కంపెనీల్లో ఎల్టీఐమైండ్ట్రీ అత్యధికంగా త్రైమాసికం వారీగా 2% వరకు ఆదాయ వృద్ధిని నమోదు చేయొచ్చు. టెక్ మహీంద్రా మాత్రం అన్నిటి కంటే తక్కువగా -1 శాతం అంటే ఆదాయ వృద్ధి 1% మేర క్షీణించొచ్చు. మధ్య స్థాయి కంపెనీల విషయానికొస్తే బిర్లాసాఫ్ట్ 3.3 శాతం మేర రాణించే అవకాశాలు కనిపిస్తుండగా. ఎంఫసిస్ మాత్రం అన్నిటికంటే బలహీనంగా 0.7 శాతం మేర ఆదాయంలో వృద్ధిని నమోదుచేయొచ్చు.
వేతన పెంపులతో ఒత్తిడి..
ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్టీఐమైండ్ట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజాల ఎబిట్ మారిన్లపై వేతన పెంపులు, బలహీన ఆదాయ వృద్ధి ప్రభావం చూపించొచ్చు. మొత్తం మీద ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరు వైవిధ్యంగా ఉండడంతో ఫలితాల సమయంలో ఆయా యాజమాన్యాలు తమ ఒప్పందాలు, ప్రాజెక్టుల వేగంపై చేసే వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. కాగా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్లు మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాలను కొనసాగించే అవకాశం ఉందని అంచనా.
జాగ్రత్త ధోరణి తప్పదా?
ఐటీ కంపెనీల వృద్ధి పథానికి ఎదురయ్యే అడ్డంకులను దృష్టిలో పెట్టుకుంటే స్వల్పకాలంలో ఈ రంగంపై జాగ్రత్త ధోరణి తప్పకపోవచ్చని నొమురా అంటోంది. ఐటీ సేవలకు గిరాకీ పుంజుకోవడానికి, అది కూడా ఎంచదగ్గరీతిలో రాణించేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటోంది. ప్రస్తుత మందగమన ప్రభావం 2023-24 ప్రథమార్ధంపైనే కాకుండా మొత్తం ఆర్థిక సంవత్సరంపై కనిపించొచ్చని.. 2024-25కూ ఈ ధోరణి కొనసాగే అవకాశమూ లేకపోలేదంటోంది.
మధ్యకాలానికి సానుకూలతలు
మధ్యకాలంలో మాత్రం ఆఫ్షోరింగ్ వర్క్ విషయంలో భారత ఐటీ సేవలకు గిరాకీ పెరగొచ్చని నొమురా చెబుతోంది. ఆటోమేషన్, వ్యయ నియంత్రణలకు ఆయా రంగాల కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఐటీ బడ్జెట్లు స్వల్పకాలంలో పెరగొచ్చని ముఖ్యంగా.. బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), సీఎమ్టీ(కమ్యూనికేషన్స్, మీడియా, టెక్నాలజీ) విభాగాలను గమనించాల్సి ఉంటుందని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?
Digital Payments: ఆన్లైన్ మోసాలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ సరికొత్త విధానంపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి ఆన్లైన్ లావాదేవీకి నాలుగు గంటల వ్యవధి పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
JioPhone Prima Prepaid Plans: జియో ఇటీవల తీసుకొచ్చిన ప్రైమా ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు బయటకు వచ్చాయి. డేటా ప్రయోజనాలతో కూడిన మొత్తం ఏడు ప్లాన్లను తీసుకొచ్చింది. -
Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 48 పాయింట్ల లాభంతో 66,018 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 37 పాయింట్లు పెరిగి 19,832 దగ్గర కొనసాగుతోంది. -
జనవరి నుంచి కార్ల ధరల పెంపు..
కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ వెల్లడించాయి. -
6 నెలల గరిష్ఠానికి బంగారం ధరలు
అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు 6 నెలల గరిష్ఠానికి చేరాయి. ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర సోమవారం 2013.99 డాలర్లకు చేరింది. -
రేమండ్ వ్యాపారం సాఫీగా సాగుతుంది
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా భరోసా ఇచ్చారు. -
రూ.13,000 కోట్లతో భారత్లో ఫాక్స్కాన్ విస్తరణ!
ఐఫోన్ తయారీ సంస్థ హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ భారత్లో మరింత విస్తరించనుంది. ఫాక్స్కాన్గా సుపరిచితమైన ఈ సంస్థ ఇక్కడి నిర్మాణ ప్రాజెక్టులపై 1.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్లో పూర్తి వాటా విక్రయించం
బ్యాంకస్యూరెన్స్ ప్రయోజనాలు పొందేందుకు, ఐడీబీఐ బ్యాంక్లో కొంత వాటా అట్టే పెట్టుకోవాలని.. ఆ బ్యాంక్ ప్రమోటర్, ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తోంది. -
ఏఐ నైపుణ్యాలను నేర్చుకుందాం
కృత్రిమ మేధ సాంకేతికత, ఐటీ నిపుణులకు తప్పనిసరి అవసరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారని ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. -
66,500 పాయింట్ల స్థాయి కీలకం!
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడంతో మార్కెట్లు స్తబ్దుగా ట్రేడయ్యాయి. -
అల్యూమినియంలో కొనుగోళ్లు!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.61,985 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.62,351; రూ.62,967 వరకు రాణిస్తుందని భావించొచ్చు. -
దివ్యాంగుల కోసం అమెజాన్ ప్రత్యేక కార్యక్రమం
చదువులో ఇబ్బందిపడే దివ్యాంగుల్లో నైపుణ్యాలను వెలికితీసి, వారికి ఉపాధి కల్పించేందుకు అమెజాన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం ‘ఆరోరా’ను ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
వినియోగదారు సేవా ఏజెంట్ల పని భారం తగ్గించేందుకు ఏఐ చాట్బాట్ను వినియోగించడం ప్రారంభించినట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: ఏ క్షణమైనా మీ వాళ్లు బయటకు.. కూలీల కుటుంబాలకు సమాచారం
-
Britain-Greek: పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు
-
Malla Reddy: మహేశ్బాబు ‘బిజినెస్మేన్’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్కు మహేశ్బాబు నవ్వులే నవ్వులు!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
-
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?