Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
మ్యాట్రిక్స్ ప్రసాద్గా పేరుపొందిన నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫార్మా రంగంలో అడుగు పెడుతున్నారు.
ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజెస్ చేతికి ‘వియాట్రిస్’ భారత ఏపీఐ వ్యాపారం
ఒప్పందం ఖరారు
ఈనాడు - హైదరాబాద్: మ్యాట్రిక్స్ ప్రసాద్గా పేరుపొందిన నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫార్మా రంగంలో అడుగు పెడుతున్నారు. మ్యాట్రిక్స్ లేబొరేటరీస్ను ఆయన 2006లో యూఎస్కు చెందిన ఫార్మా దిగ్గజం మైలాన్ ల్యాబ్స్కు విక్రయించిన విషయం విదితమే. ఆ తర్వాత ఆయన వివిధ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఫార్మా రంగం వైపు చూడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి ఫార్మా పరిశ్రమలోకి నేరుగా అడుగుపెట్టబోతున్నారు. ఆయన కుటుంబానికి చెందిన ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజెస్, యూఎస్లో ఔషధ దిగ్గజ సంస్థ అయిన వియాట్రిస్కు మనదేశంలో ఉన్న ఔషధ వ్యాపారం, యూనిట్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ‘గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్’ లో వియాట్రిస్ భారత వ్యాపార కార్యకలాపాలు, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం తనకు దక్కినట్లు ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజెస్ సోమవారం ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించింది.
వియాట్రిస్కు మనదేశంలో 6 ఫార్మా యూనిట్లు ఉన్నాయి. ఇందులో మూడు యూనిట్లు వైజాగ్లో, మరో 3 యూనిట్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇవేకాకుండా హైదరాబాద్లో ఆర్అండ్డీ కేంద్రం, ఏపీఐ థర్డ్ పార్టీ విక్రయాల విభాగం ఉన్నాయి. ఈ యూనిట్లలో కొన్ని గతంలో మ్యాట్రిక్స్ లేబొరేటరీస్కు చెందినవి కావటం గమనార్హం. మ్యాట్రిక్స్ను మైలాన్ ల్యాబ్స్ కొనుగోలు చేయగా, ఆ తర్వాత మైలాన్ మరొక సంస్థలో విలీనమై వయాట్రిస్గా మారింది. మ్యాట్రిక్స్ యూనిట్లే అటు ఇటూ తిరిగి మళ్లీ ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజెస్ చేతికి రావటం ఆసక్తికర అంశంగా మారింది.
ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజెస్కు నిమ్మగడ్డ ప్రసాద్ ముఖ్య సలహాదారుడిగా, ప్యాట్రన్గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఏఐజీ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, మాటీవీ, సెలాన్ లేబొరేటరీస్.. తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. మళ్లీ ఔషధ రంగంలో అడుగు పెడుతున్నందుకు తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె, ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గునుపాటి స్వాతిరెడ్డి అన్నారు. ఫార్మా రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా పరిశ్రమలో మనదేశం క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో, ఈ రంగంలోకి వస్తున్నామని పేర్కొన్నారు. మరోరకంగా చెప్పాలంటే.. సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లుందని పేర్కొన్నారు.
విలువ రూ. 10,000 కోట్లు?
మనదేశంలోని ఏపీఐ వ్యాపారం, ఉమెన్స్ హెల్త్కేర్ బిజినెస్.. రెండింటినీ కలిపి 1.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10,000 కోట్లు) విలువకట్టి ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజెస్, ఇన్సడ్ ఫార్మాలకు వియాట్రిస్ విక్రయించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లావాదేవీ వచ్చే ఆరు నెలల వ్యవధిలో పూర్తవుతుందని అంచనా. వియాట్రిస్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కొన్ని వ్యాపార విభాగాలను విక్రయించటానికి గత కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మనదేశంలో తన వ్యాపారాన్ని, యూనిట్లను విక్రయించటానికి ముందుకొచ్చినట్లు స్పష్టమవుతోంది.
‘ఉమెన్స్ హెల్త్కేర్ బిజినెస్’ స్పానిష్ సంస్థ చేతికి
మనదేశంలో తనకు ఉన్న ‘ఉమెన్స్ హెల్త్కేర్ బిజినెస్’ ను కూడా విక్రయించటానికి వియాట్రిస్ సిద్ధమైంది. ఈ వ్యాపారాన్ని స్పానిష్ సంస్థ అయిన ఇన్సడ్ ఫార్మాకు విక్రయించటానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద ఓరల్, ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్ ఉత్పత్తులు ఉన్నాయి. దీనికి అహ్మదాబాద్, సరిగమ్ లో యూనిట్లు ఉన్నాయి. ఏపీఐ యూనిట్లు, వ్యాపారాన్ని 2007లో మ్యాట్రిక్స్ ప్రసాద్ నుంచి కొనుగోలు చేసినట్లుగానే ‘ఉమెన్స్ హెల్త్కేర్ బిజినెస్’ను 2015లో ముంబయికి చెందిన తపారియా కుటుంబం నుంచి మైలాన్ కొనుగోలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. -
ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ
గౌతమ్ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. -
స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు
ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. -
వచ్చే ఏడాది ప్రపంచం మందగమనమే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. -
డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది
కొవిడ్-19 పరిణామాల అనంతరం డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో.... -
2030కి రూ.29 లక్షల కోట్లకు దేశీయ ఐటీ రంగం
దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. -
రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ బుధవారం తెలిపారు. -
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్షైర్ హాతవేకు వైస్ఛైర్మన్గా వ్యవహరించిన చార్లీ మంగర్(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. -
ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ-శాటెల్లాజిక్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్ఎల్ వెల్లడించింది. -
భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి
భారత్లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన -
రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం
రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్(జమ్ము-కశ్మీర్, చత్తీస్గఢ్)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. -
సంక్షిప్త వార్తలు
సంస్థలకు క్లౌడ్, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్వన్) హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి...


తాజా వార్తలు (Latest News)
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
-
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
-
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!