సవాళ్లున్నా పౌల్ట్రీ రంగ వృద్ధి
సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని, పౌల్ట్రీ రంగం వృద్ధి సాధిస్తోందని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాస్ వెల్లడించారు.
ఐపీఈఎంఏ ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్
హైదరాబాద్ (బంజారాహిల్స్), న్యూస్టుడే: సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని, పౌల్ట్రీ రంగం వృద్ధి సాధిస్తోందని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాస్ వెల్లడించారు. మన దేశం కోడి గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానం, కోడిమాంసం ఉత్పత్తిలో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలోనూ ఉందని తెలిపారు. దేశంలో పౌష్ఠికాహార లోపాన్ని నివారించడంలో పౌల్ట్రీ రంగం ఎంతో కీలకంగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ఈ నెల 22-24 తేదీల్లో 15వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కాసర్ల మోహన్రెడ్డి, ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఛైర్మన్ చిట్టూరి సురేష్ రాయుడు, ఐపీఈఎంఏ డైరెక్టర్లు అనిల్ ధుమాల్, పి.చక్రధర్రావు, తెలంగాణ బ్రాయిలర్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డి.రాఘవరావు తదితరులతో కలిసి మాట్లాడారు. మన దేశం నుంచి 380 కంపెనీలు, మరో 22 దేశాల నుంచి 45 సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించబోతున్నట్లు పేర్కొన్నారు. 35 వేలకు మందికి పైగా రైతులు దీనికి హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ప్రారంభ వేడుకల్లో దేశ, విదేశాల శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకుంటారని తెలిపారు. దేశీయంగా ప్రత్యక్షంగా లక్షల్లో, పరోక్షంగా కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు. సురేశ్ రాయుడు మాట్లాడుతూ.. కోళ్ల దాణా ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. గుడ్డు ధర తక్కువగా ఉండటం, ఉత్పత్తి ధర పెరగడంతో చాలామంది ఈ రంగానికి దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో గుడ్ల ధరలు కాస్త పెరగడంతో మళ్లీ కొందరు తిరిగి ఈ రంగంలోకి వస్తున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ola: ఇక ఓలా యాప్లోనూ యూపీఐ చెల్లింపులు
Ola cabs: ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా తన యాప్లోనే యూపీఐ పేమెంట్స్ చేసేలా కొత్త ఫీచర్ని యూజర్లకు పరిచయం చేసింది. -
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్తో బోట్ గేమింగ్ ఇయర్బడ్స్
Boat earbuds: సింగిల్ ఛార్జ్తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్తో బోట్ ఇయర్బడ్స్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. -
Tata Tech: టాటా టెక్ అదుర్స్.. లిస్టింగ్ డే గెయిన్స్లో టాప్-7లోకి
టాటా టెక్ సంస్థ లిస్టింగ్ రోజున బంపర్ లిస్టింగ్ నమోదు చేసింది. అత్యధికంగా లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చిన సంస్థల్లో ఏడో స్థానంలో నిలిచింది. -
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్న వేళ మదుపరులు అప్రమత్తత పాటించారు. -
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
ఇన్ఫీ నారాయణమూర్తి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మౌలిక సదుపాయాల రంగంలో మూడు షిఫ్టులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
Expensive Cities: వార్షిక ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ధరలు సగటున 7.4 శాతం చొప్పున పెరిగాయని ఈఐయూ నివేదిక తెలిపింది. -
Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.21 వేల లాభం
Tata Tech Listing: టాటా టెక్ ఐపీఓ లిస్టింగ్ అంచనాలకు మించిన లాభాన్నించ్చింది. ఇష్యూ ధరతో పోలిస్తే 140 శాతం లాభంతో షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. -
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!
Elon Musk | యూదు వ్యతిరేక పోస్ట్నకు మద్దతు తెలిపినందుకు మస్క్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు ఎక్స్లో వాణిజ్య ప్రకటనలను నిలిపివేశాయి. దీనిపై మస్క్ తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 77 పాయింట్ల లాభంతో 66,979 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 26 పాయింట్లు పెరిగి 20,123 వద్ద కొనసాగుతోంది. -
మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. -
ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ
గౌతమ్ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. -
స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు
ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. -
వచ్చే ఏడాది ప్రపంచం మందగమనమే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. -
డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది
కొవిడ్-19 పరిణామాల అనంతరం డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో.... -
2030కి రూ.29 లక్షల కోట్లకు దేశీయ ఐటీ రంగం
దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. -
రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ బుధవారం తెలిపారు. -
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్షైర్ హాతవేకు వైస్ఛైర్మన్గా వ్యవహరించిన చార్లీ మంగర్(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. -
ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ-శాటెల్లాజిక్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్ఎల్ వెల్లడించింది. -
భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి
భారత్లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన -
రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం
రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్(జమ్ము-కశ్మీర్, చత్తీస్గఢ్)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. -
సంక్షిప్త వార్తలు
సంస్థలకు క్లౌడ్, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్వన్) హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్ పైకప్పునుంచి ధార!
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ