2024లో వృద్ధి 6.3 శాతానికి తగ్గొచ్చు
వచ్చే సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి స్వల్పంగా 6.3 శాతానికి తగ్గే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది. 2023లో జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఎన్నికల సంవత్సరంలో రాజకీయ అనిశ్చితే ప్రధాన ముప్పు
ముంబయి: వచ్చే సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి స్వల్పంగా 6.3 శాతానికి తగ్గే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది. 2023లో జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ‘వచ్చే సంవత్సరం రెండు విభాగాలుగా ఉండనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యయాలు వృద్ధికి కీలకం అవుతాయి. ఎన్నికల తర్వాత పెట్టుబడుల వృద్ధి మళ్లీ వేగవంతం కావడంపై వృద్ధి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు’ అని గోల్డ్మన్ శాచ్స్ తన నివేదికలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2024-25లో జీడీపీ వృద్ధి 6.5 శాతానికి పెరగొచ్చు. 2023-24లో ఇది 6.2 శాతంగా ఉందని తెలిపింది. ‘భారత్కు వృద్ధిపరంగా అత్యుత్తమ వ్యవస్థీకృత అవకాశాలు ఉన్నాయి. 2024లో జీడీపీ వృద్ధి 6.3 శాతంగా ఉండొచ్చ’ని వెల్లడించింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరగడం, డాలరు బలోపేతం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు లాంటి విదేశీ కుదుపుల ప్రభావం భారత్పై పరిమితంగానే ఉండొచ్చని వివరించింది. వృద్ధికి పొంచి ఉన్న ముప్పులను తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ.. 2024 ఏప్రిల్- జూన్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వల్ల కలిగే రాజకీయ అనిశ్చితుల నుంచే ప్రధాన ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ఇప్పటికే ఎన్నికల సీజను ప్రారంభమైంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగునున్నాయి. ఆర్థిక సంస్కరణలు, విధానాలు కొనసాగుతాయా? లేదా? అనే అంశం ఆధారంగా ఈ ఎన్నికల ఫలితాలను మదుపర్లు నిశితంగా గమనించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
5.1 శాతానికి ద్రవ్యోల్బణం: వచ్చే ఏడాదిలో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) 5.1 శాతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్బీఐ 4.7 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే 2023కు అంచనా వేసిన 5.7 శాతం కంటే కూడా తమ అంచనా అయిన 5.1 శాతం తక్కువే కావడం గమనార్హం. ఎన్నికల సంవత్సరంలో ఆహార పదార్థాల ధరల నియంత్రణకు సబ్సిడీలు లేదా ఇతరత్రా చర్యల ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. 2025 ప్రారంభంలో ఆర్బీఐ కీలక రేట్లను 0.50 శాతం తగ్గి 6 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ తెలిపింది. 2024 నాలుగో త్రైమాసికంలో పావు శాతం కోత ఉండే అవకాశం ఉందని వివరించింది. 2024లో జీడీపీ 1.9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2023లో దీనిని 1.3 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2024 చివరికల్లా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 82కు పెరిగే అవకాశం ఉంది. 2023 చివరినాటికి ఇది 83 స్థాయిల వద్ద ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock Market Update: దూసుకెళ్తున్న సూచీలు.. మదుపర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం
Stock Market Update: రెండు ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. -
Job Interview: ‘ఇంటర్వ్యూలో ఇవి చేయొద్దు..’ గూగుల్ మాజీ రిక్రూటర్ చెప్పిన సీక్రెట్లు
Job Interview: ఇంటర్వ్యూ కోసం అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను గూగుల్ మాజీ రిక్రూటర్ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. -
Bitcoin: 40,000 డాలర్ల మార్క్ దాటిన బిట్కాయిన్
Bitcoin: గత 24 గంటల వ్యవధిలో బిట్కాయిన్ (Bitcoin) విలువ నాలుగు శాతం పెరిగి 40,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్.. 20,500 పైకి నిఫ్టీ
Stock Market Opening bell | ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 825 పాయింట్ల లాభంతో 68,306 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 248 పాయింట్లు పెరిగి 20,516 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. -
ఎన్ఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా (ఈ నెల 1న) 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.334.72 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. -
విమానాల పార్కింగుకు అధిక ఛార్జీలు!
సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విమానాలను నిలిపివేస్తున్న (గ్రౌండింగ్) సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల, దిల్లీ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలం తగ్గిపోతోంది. -
పొరుగు దేశాల నుంచి రూ.లక్ష కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు సంబంధించి.. మనదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాల నుంచే, 2020 ఏప్రిల్ తర్వాత రూ.లక్ష కోట్ల విలువైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో సగం దరఖాస్తులను ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. -
హోండా కార్ల ధరలూ పెరుగుతాయ్
జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. పెరిగిన తయారీ వ్యయాల భారాన్ని కంపెనీపై తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్, విక్రయాలు) కునాల్ బెల్ వివరించారు. -
వెండి రాణింపు!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో కదలాడితే రూ.63,930 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.64,505; రూ.66,629 వరకు రాణించొచ్చు. -
ఎఫ్ఐఐల కొనుగోళ్లతో ముందుకే
ఈ వారమూ మార్కెట్లలో జోష్ కొనసాగేందుకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా పనితీరు కనబరచని బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్ల వైపు అందరి దృష్టీ ఉంది. దేశీయ వృద్ధిపై బలమైన అంచనాలకు తోడు అంతర్జాతీయంగా అధిక వడ్డీ రేట్లు, చమురు ధరల్లో ఊగిసలాటలు కొలిక్కి వస్తుండటంతో మార్కెట్లో సెంటిమెంటు సానుకూలంగా మారింది. -
67,928ను మించితే సానుకూలం!


తాజా వార్తలు (Latest News)
-
Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం
-
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత
-
Andhra Pradesh: తీవ్ర తుపానుగా మిగ్జాం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం
-
Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్ ఫలితం అంతుపట్టడం లేదు!
-
Cyclone Michaung: ‘మిగ్జాం’ ప్రభావం.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
-
Telangana: టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు రాజీనామా