వాహన, కమొడిటీ షేర్లు డీలా
వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. గరిష్ఠ స్థాయుల్లో వాహన, యుటిలిటీ, కమొడిటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడమే ఇందుకు కారణం.
డాలర్ @ రూ.83.38
సమీక్ష
వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. గరిష్ఠ స్థాయుల్లో వాహన, యుటిలిటీ, కమొడిటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడమే ఇందుకు కారణం. అయితే ఐటీ షేర్లు రాణించడంతో సూచీలకు నష్టాలు పరిమితం అయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 12 పైసలు క్షీణించి తాజా జీవనకాల కనిష్ఠమైన 83.38 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.74% పెరిగి 81.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో నష్టపోగా, మిగతావి లాభపడ్డాయి. ఐరోపా షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 65,787.51 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కదలాడిన సూచీ, 65,547.80 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు 139.58 పాయింట్ల నష్టంతో 65,655.15 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.80 పాయింట్లు తగ్గి 19,694 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 19,670.50- 19,756.45 పాయింట్ల మధ్య కదలాడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 19 నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ 2.11%, ఎం అండ్ ఎం 1.91%, అల్ట్రాటెక్ 1.47%, బజాజ్ ఫిన్సర్వ్ 1.05%, టాటా మోటార్స్ 1.02%, హెచ్యూఎల్ 0.94% నీరసించాయి. భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.48% వరకు లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో వాహన 0.69%, కమొడిటీస్ 0.66%, యంత్ర పరికరాలు 0.43%, స్థిరాస్తి 0.33% నష్టపోయాయి. ఇంధన, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, టెక్ పెరిగాయి. బీఎస్ఈలో 1997 షేర్లు నష్టాల్లో ముగియగా, 1840 స్క్రిప్లు లాభపడ్డాయి. 143 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- తగ్గిన పీ-నోట్ పెట్టుబడులు: భారత స్టాక్ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్ల) ద్వారా వచ్చిన పెట్టుబడులు అక్టోబరులో రూ.1.26 లక్షల కోట్లకు తగ్గాయి. భారత ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో ఈ పెట్టుబడులు ఉన్నాయి. అంతకు ముందు వరుసగా 7 నెలల పాటు పీ-నోట్ల పెట్టుబడులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీ-నోట్ల పెట్టుబడులు రూ.88,398 కోట్లు కాగా, మార్చిలో రూ.88,600 కోట్లు, ఏప్రిల్లో రూ.95,911 కోట్లు, మేలో రూ.1.04 లక్షల కోట్లు, జూన్లో రూ.1.13 లక్షల కోట్లు, జులైలో రూ.1.23 లక్షల కోట్లు, ఆగస్టులో రూ.1.23 లక్షల కోట్లు, సెప్టెంబరులో రూ.1.33 లక్షల కోట్లుగా ఉన్నాయి. అక్టోబరులో కొంత తగ్గాయి.
- పశ్చిమాసియాలో తమ హైడ్రోకార్బన్ విభాగం ‘మెగా’ ఆర్డర్ను దక్కించుకున్నట్లు ఎల్ అండ్ టీ తెలిపింది. కంపెనీ రూ.10,000- 15,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టును మెగా ఆర్డర్లుగా పరిగణిస్తుంది.
- ఆస్ట్రేలియా మార్కెట్కు కొత్త తరం క్లియరింగ్, సెటిల్మెంట్ ప్లాట్ఫామ్ను అందించేందుకు ఆస్ట్రేలియా స్టాక్ ఎక్స్ఛేంజీ ఏఎస్ఎక్స్తో టీసీఎస్ ఒప్పందం కుదుర్చుకుంది.
- రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అయిదుగురు హిందుజా గ్రూప్ ప్రతినిధులను డైరెక్టర్లుగా నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న రిలయన్స్ క్యాపిటల్ను కొనుగోలు చేయడానికి రూ.9,650 కోట్లతో అత్యధిక బిడ్డర్గా హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ నిలిచిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
GST: ఈ ఏడాదిలో ప్రతినెలా జీఎస్టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
Airtel: డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
Disney+ Hotstar Prepaid Plan: ఎయిర్టెల్ సంస్థ డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
Stock Market: రంకేసిన బుల్.. మదుపర్లకు లాభాల పంట
Stock Market Closing bell: సెన్సెక్స్ (Sensex) 1383.93 పాయింట్లు లాభపడి 68,865.12 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 418.90 పాయింట్లు పెరిగి 20,686.80 దగ్గర ముగిసింది. -
Stock Market Update: దూసుకెళ్తున్న సూచీలు.. మదుపర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం
Stock Market Update: రెండు ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. -
Job Interview: ‘ఇంటర్వ్యూలో ఇవి చేయొద్దు..’ గూగుల్ మాజీ రిక్రూటర్ చెప్పిన సీక్రెట్లు
Job Interview: ఇంటర్వ్యూ కోసం అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను గూగుల్ మాజీ రిక్రూటర్ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. -
Bitcoin: 40,000 డాలర్ల మార్క్ దాటిన బిట్కాయిన్
Bitcoin: గత 24 గంటల వ్యవధిలో బిట్కాయిన్ (Bitcoin) విలువ నాలుగు శాతం పెరిగి 40,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్.. 20,500 పైకి నిఫ్టీ
Stock Market Opening bell | ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 825 పాయింట్ల లాభంతో 68,306 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 248 పాయింట్లు పెరిగి 20,516 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. -
ఎన్ఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా (ఈ నెల 1న) 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.334.72 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. -
విమానాల పార్కింగుకు అధిక ఛార్జీలు!
సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విమానాలను నిలిపివేస్తున్న (గ్రౌండింగ్) సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల, దిల్లీ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలం తగ్గిపోతోంది. -
పొరుగు దేశాల నుంచి రూ.లక్ష కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు సంబంధించి.. మనదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాల నుంచే, 2020 ఏప్రిల్ తర్వాత రూ.లక్ష కోట్ల విలువైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో సగం దరఖాస్తులను ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. -
హోండా కార్ల ధరలూ పెరుగుతాయ్
జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. పెరిగిన తయారీ వ్యయాల భారాన్ని కంపెనీపై తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్, విక్రయాలు) కునాల్ బెల్ వివరించారు. -
వెండి రాణింపు!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో కదలాడితే రూ.63,930 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.64,505; రూ.66,629 వరకు రాణించొచ్చు. -
ఎఫ్ఐఐల కొనుగోళ్లతో ముందుకే
ఈ వారమూ మార్కెట్లలో జోష్ కొనసాగేందుకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా పనితీరు కనబరచని బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్ల వైపు అందరి దృష్టీ ఉంది. దేశీయ వృద్ధిపై బలమైన అంచనాలకు తోడు అంతర్జాతీయంగా అధిక వడ్డీ రేట్లు, చమురు ధరల్లో ఊగిసలాటలు కొలిక్కి వస్తుండటంతో మార్కెట్లో సెంటిమెంటు సానుకూలంగా మారింది. -
67,928ను మించితే సానుకూలం!


తాజా వార్తలు (Latest News)
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
-
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
-
Team India: ముగ్గురు కెప్టెన్లు.. భవిష్యత్తుకు సంకేతం కావచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
Manipur Violence: మణిపుర్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
-
Yashasvi Jaiswal: బాదుడు సరే.. తొందరెందుకు యశస్వి.. కుదురుకోవాలి కదా!