2 కొత్త గనుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలు
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్, త్వరలో రెండు కొత్త ఇనుప ఖనిజం గనులను ప్రారంభించబోతోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం
ఆస్ట్రేలియాలో బంగారు గని ప్రారంభం
భవిష్యత్తు వ్యూహాలపై మెకెన్సీ అండ్ కంపెనీ, డెలాయిటీలతో అధ్యయనం
ఎన్ఎండీసీ సీఎండీ అమితవ్ ముఖర్జీ
ఈనాడు - హైదరాబాద్
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్, త్వరలో రెండు కొత్త ఇనుప ఖనిజం గనులను ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఉన్న గనుల్లో అధికోత్పత్తి సాధించే అవకాశాలు ఉండటం, కొత్తగా 2 గనుల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నందున, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం లక్ష్యాన్ని చేరుకోవచ్చని సంస్థ ఆశిస్తోంది. కొత్త గనుల్లో బచేలి మైనింగ్ ప్రాజెక్టు ఒకటి. ఛత్తీస్గఢ్లోని ఈ గని నుంచి అదనంగా 2 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయొచ్చని, కర్ణాటకలోని కుమారస్వామి గని నుంచి 2.2 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం లభిస్తుందని ఎన్ఎండీసీ లిమిటెడ్ సీఎండీ అమితవ్ ముఖర్జీ ‘కాన్ఫెరెన్స్ కాల్’లో మదుపరులకు ఇటీవల వెల్లడించారు. కుమారస్వామి గనికి వారం, పది రోజుల్లో అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ 2 కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైతే, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాబోదని తెలిపారు. కనీసం 47- 49 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధిస్తామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేయడాన్ని ప్రస్తావించారు.
రూ.2,000 కోట్ల వరకు పెట్టుబడి
అధికోత్పత్తి లక్ష్యాల సాధనకు పెద్దఎత్తున మూలధన పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. గనుల అభివృద్ధితో పాటు రవాణా, సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన యంత్ర సామగ్రి సమకూర్చుకోడానికి మూలధన పెట్టుబడి అవసరమని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల మూలధన పెట్టుబడి పెట్టాలనే లక్ష్యం ఉండగా, ఇప్పటికే రూ.1,000 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి రూ.1,800 - రూ.2,000 కోట్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదని వివరించారు. వచ్చే 3- 4 ఏళ్లలో ఏటా మూలధన పెట్టుబడి రూ.4,000- 5,000 కోట్లకు చేరుకుంటుందని అన్నారు. ఇనుప ఖనిజానికి దేశీయ మార్కెట్లో తక్కువ ధర లభించడం, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర పలుకుతూ ఉండటంపై స్పందిస్తూ, తమ వరకూ దేశీయ మార్కెట్లో విక్రయించడం వల్ల అధిక లాభాలు వస్తున్నాయని తెలిపారు. రవాణా ఛార్జీలు, పోర్టు ఛార్జీలు, పన్నులు కలుపుకొని లెక్కిస్తే, దేశీయ మార్కెట్లో ఇనుప ఖనిజం అమ్మకాలపై లాభాలు ఎక్కువగా ఉన్న విషయం స్పష్టమవుతుందని తెలిపారు.
స్టీల్ప్లాంటు ప్రైవేటీకరణపై..
ఎన్ఎండీసీ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు చాలా వరకూ కసరత్తు పూర్తయిందని అన్నారు. పెద్దసంఖ్యలో బిడ్లు దాఖలైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరుగుతున్నందున ఈ ప్రక్రియ నిలిచిపోయిందని, ఆ తర్వాత త్వరగానే పూర్తికావచ్చని అన్నారు. పూర్తి వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ఒక బంగారం గనిలో తవ్వకాలు మొదలుపెట్టినట్లు అమితవ్ ముఖర్జీ తెలిపారు. దీని నుంచి వచ్చే 12- 15 నెలల వ్యవధిలో ఒక టన్ను బంగారాన్ని ఉత్పత్తి చేయగలమన్నారు. ఇది చిన్నదే అయినప్పటికీ దాని పక్కనే 10 బంగారం గనులు ఉన్నాయని, వాటిని కూడా తీసుకుని, నిర్వహించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కేవలం ఇనుప ఖనిజం ఉత్పత్తికే పరిమితం కాకుండా అన్ని రకాల ఖనిజాల తవ్వకాన్ని చేపట్టాలనేది తమ ఉద్దేశమని అన్నారు. ఆస్ట్రేలియాలో అక్కడి ఒక కంపెనీ భాగస్వామ్యంతో లిథియమ్ గనుల్లో తవ్వకాలు చేపట్టాలనే ఆలోచన ఉందని తెలిపారు. వచ్చే ఆయిదారేళ్లలో ఇనుప ఖనిజం మార్కెట్ తీరుతెన్నులు, వినియోగదార్ల అవసరాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుని, దానికి తగ్గట్లుగా వ్యాపార వ్యూహాన్ని సిద్ధం చేసుకునే కసరత్తు మొదలు పెట్టామని అన్నారు. ఈ విషయంలో అగ్రశ్రేణి కన్సల్టెన్సీ సంస్థలైన మెకెన్సీ అండ్ కంపెనీ, డెలాయిటీలతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ సంస్థలకు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Airtel: డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
Disney+ Hotstar Prepaid Plan: ఎయిర్టెల్ సంస్థ డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
Stock Market: రంకేసిన బుల్.. మదుపర్లకు లాభాల పంట
Stock Market Closing bell: సెన్సెక్స్ (Sensex) 1383.93 పాయింట్లు లాభపడి 68,865.12 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 418.90 పాయింట్లు పెరిగి 20,686.80 దగ్గర ముగిసింది. -
Stock Market Update: దూసుకెళ్తున్న సూచీలు.. మదుపర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం
Stock Market Update: రెండు ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. -
Job Interview: ‘ఇంటర్వ్యూలో ఇవి చేయొద్దు..’ గూగుల్ మాజీ రిక్రూటర్ చెప్పిన సీక్రెట్లు
Job Interview: ఇంటర్వ్యూ కోసం అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను గూగుల్ మాజీ రిక్రూటర్ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. -
Bitcoin: 40,000 డాలర్ల మార్క్ దాటిన బిట్కాయిన్
Bitcoin: గత 24 గంటల వ్యవధిలో బిట్కాయిన్ (Bitcoin) విలువ నాలుగు శాతం పెరిగి 40,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్.. 20,500 పైకి నిఫ్టీ
Stock Market Opening bell | ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 825 పాయింట్ల లాభంతో 68,306 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 248 పాయింట్లు పెరిగి 20,516 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. -
ఎన్ఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా (ఈ నెల 1న) 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.334.72 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. -
విమానాల పార్కింగుకు అధిక ఛార్జీలు!
సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విమానాలను నిలిపివేస్తున్న (గ్రౌండింగ్) సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల, దిల్లీ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలం తగ్గిపోతోంది. -
పొరుగు దేశాల నుంచి రూ.లక్ష కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు సంబంధించి.. మనదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాల నుంచే, 2020 ఏప్రిల్ తర్వాత రూ.లక్ష కోట్ల విలువైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో సగం దరఖాస్తులను ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. -
హోండా కార్ల ధరలూ పెరుగుతాయ్
జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. పెరిగిన తయారీ వ్యయాల భారాన్ని కంపెనీపై తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్, విక్రయాలు) కునాల్ బెల్ వివరించారు. -
వెండి రాణింపు!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో కదలాడితే రూ.63,930 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.64,505; రూ.66,629 వరకు రాణించొచ్చు. -
ఎఫ్ఐఐల కొనుగోళ్లతో ముందుకే
ఈ వారమూ మార్కెట్లలో జోష్ కొనసాగేందుకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా పనితీరు కనబరచని బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్ల వైపు అందరి దృష్టీ ఉంది. దేశీయ వృద్ధిపై బలమైన అంచనాలకు తోడు అంతర్జాతీయంగా అధిక వడ్డీ రేట్లు, చమురు ధరల్లో ఊగిసలాటలు కొలిక్కి వస్తుండటంతో మార్కెట్లో సెంటిమెంటు సానుకూలంగా మారింది. -
67,928ను మించితే సానుకూలం!


తాజా వార్తలు (Latest News)
-
Railway: రైల్వే ‘బీస్ట్’ను చూశారా..? వైరల్ అవుతున్న వీడియో
-
Animal Movie: ‘యానిమల్’ మూవీపై రాంగోపాల్వర్మ రివ్యూ.. నాలుగున్నర గంటలున్నా తక్కువే!
-
Jobs: ఐఐటీ కాన్పూర్లో కొలువుల జోష్.. ఒకేరోజు 485మందికి జాబ్ ఆఫర్లు
-
TS News: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు.. ఇక ముఖ్యమంత్రే తరువాయి!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
IND vs SA: భారత్తో టీ20, వన్డే, టెస్టు సిరీస్లు.. జట్లను ప్రకటించిన దక్షిణాఫ్రికా