Vehicle insurance: మీ వాహనాన్ని ఎలా నడుపుతున్నారు?.. దాని బట్టే బీమా ప్రీమియం!
వాహనాన్ని రోజూ ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తున్నారు.. వాహనాన్ని నడిపేటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది.. ఎందుకీ ప్రశ్నలు అనుకుంటున్నారా? ఇక నుంచి వాహన బీమా ప్రీమియాన్ని నిర్ణయించడంలో ఈ ప్రశ్నలు కీలకంగా మారనున్నాయి. వాహన వినియోగం, డ్రైవర్ ప్రవర్తనను బట్టి బీమా ప్రీమియం వసూలుకు అధునాతన అనుబంధ పాలసీలను (యాడ్ ఆన్) కంపెనీలు జారీ చేయబోతున్నాయి. ఈ మేరకు సాధారణ బీమా సంస్థలకు అనుమతినిస్తూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలు జారీ చేసింది.
అధునాతన అనుబంధ పాలసీలు
సాధారణ బీమా సంస్థలకు అనుమతి
ఈనాడు, హైదరాబాద్: వాహనాన్ని రోజూ ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తున్నారు.. వాహనాన్ని నడిపేటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది.. ఎందుకీ ప్రశ్నలు అనుకుంటున్నారా? ఇక నుంచి వాహన బీమా ప్రీమియాన్ని నిర్ణయించడంలో ఈ ప్రశ్నలు కీలకంగా మారనున్నాయి. వాహన వినియోగం, డ్రైవర్ ప్రవర్తనను బట్టి బీమా ప్రీమియం వసూలుకు అధునాతన అనుబంధ పాలసీలను (యాడ్ ఆన్) కంపెనీలు జారీ చేయబోతున్నాయి. ఈ మేరకు సాధారణ బీమా సంస్థలకు అనుమతినిస్తూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలు జారీ చేసింది.
ఓన్ డామేజీకి తోడుగా..
సాధారణంగా వాహన బీమా పాలసీలో వాహనానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇవ్వడం (ఓన్ డామేజీ), తృతీయ పక్షానికి నష్టం జరిగితే పరిహారం ఇవ్వడం (థర్డ్ పార్టీ) ఉంటాయి. ఓన్ డామేజీ పాలసీ తప్పనిసరి కాదు. కానీ, థర్డ్ పార్టీ బీమా లేకుండా వాహనం రోడ్డుపైకి రాకూడదు. కొత్తగా అనుమతించిన అనుబంధ పాలసీలను ఓన్ డామేజీ పాలసీకి జత చేయాల్సి ఉంటుంది.
* వాహనాన్ని ఎంత మేరకు వినియోగిస్తున్నారు అన్నదాని ఆధారంగా ప్రీమియాన్ని నిర్ణయించే పాలసీ ‘పే యాజ్ యు డ్రైవ్’. ఈ పాలసీని ఎంచుకున్నప్పుడు వాహనాన్ని ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తున్నారు అన్నదాన్ని ప్రధానంగా చూస్తారు. వాహనాన్ని వినియోగించనప్పుడు బీమా పాలసీని ఆఫ్ చేసుకునే వీలుంటుంది.
* వాహనాన్ని నడిపేటప్పుడు డ్రైవర్ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టి, ప్రీమియాన్ని నిర్ణయించేది ‘పే హౌ యు డ్రైవ్’. వాహనాన్ని ఎంత సురక్షితంగా నడిపిస్తున్నారన్నది చూసి, బీమా ప్రీమియాన్ని నిర్ణయిస్తారు.
* ఒకే వాహన యజమాని సొంత వినియోగానికి ద్విచక్ర వాహనం, కారు వాడుతుంటే..ఈ రెండింటికి కలిపి ఫ్లోటర్ పాలసీని ఎంచుకునే వీలునూ ఐఆర్డీఏఐ కల్పించింది.
పాలసీదారుల ప్రయోజనం కోసమే..
‘వాహన బీమా పాలసీల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. బీమా రంగంలో సాంకేతికత కీలకంగా మారింది. పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు, దేశంలో బీమా వ్యాప్తికి కృషి చేస్తున్నాం. కాలానుగుణంగా మార్పులనూ చేస్తున్నాం. సాంకేతిక ఆధారిత పాలసీలను అనుమతించడం ఇందులో భాగమే’ అని ఐఆర్డీఏఐ పేర్కొంది.
వాహనదారులకు మేలే
‘వాహనాన్ని అందరూ ఒకేలా వాడరు. వారి వినియోగ ధోరణి బట్టి, ప్రీమియాన్ని చెల్లించేందుకు అనుబంధ పాలసీలు తోడ్పడతాయ’ని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం అన్నారు. ఇప్పటివరకు థర్డ్ పార్టీ బీమానే తీసుకుంటున్న వారు.. కొత్త యాడ్ ఆన్ పాలసీలను జోడించుకుని, ఓన్ డామేజీ పాలసీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే అందుబాటులో..: వాహన వినియోగాన్ని బట్టి, ప్రీమియాన్ని వసూలు చేసే పాలసీలను ఐఆర్డీఏఐ శాండ్బాక్స్లో భాగంగా కొన్ని బీమా సంస్థలు విడుదల చేశాయి. లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ ఈ తరహా యాడ్ ఆన్లతో తొలి పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఎడిల్వైజ్ జనరల్ ఇన్సూరెన్స్ ‘స్విచ్’ పేరుతో ఈ పాలసీని ఆవిష్కరించింది. బీమా సంస్థ మొబైల్ యాప్ ద్వారా వాహన వినియోగం, నడిపిన విధానాన్ని పరిశీలించి, ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె