వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఇంకా ఎందుకు రాలేదు?
చేతిలో మొబైల్ ఫోన్ లేనిదే రోజు గడవని కాలమిది. పరాకుగా ఉన్నప్పుడో, సెల్ఫీ తీసుకుంటున్నప్పుడో, చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడో.. నాజూకైన ఫోన్లు చేతిలోంచి చటుక్కున జారి నీళ్లలో పడటం సర్వ సాధారణం. 39% ఫోన్లు నీటిలో పడి పాడైపోయినట్టు 2018లో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది.
చేతిలో మొబైల్ ఫోన్ లేనిదే రోజు గడవని కాలమిది. పరాకుగా ఉన్నప్పుడో, సెల్ఫీ తీసుకుంటున్నప్పుడో, చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడో.. నాజూకైన ఫోన్లు చేతిలోంచి చటుక్కున జారి నీళ్లలో పడటం సర్వ సాధారణం. 39% ఫోన్లు నీటిలో పడి పాడైపోయినట్టు 2018లో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, మోడళ్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన చరవాణులు మార్కెట్లోకి వస్తున్నా... నీటిలో పడగానే ఇట్టే మూగబోతున్నాయి. అసలు నీటి నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే ‘వాటర్ప్రూఫ్’ మొబైల్ ఫోన్లను ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నారన్నది ఇంకా సమాధానం వెతకాల్సిన సవాలుగానే మిగిలిపోయింది.
స్మార్ట్ఫోన్లు నీటిని వికర్షించేలా (వాటర్-రిపెల్లింగ్) చేయడంలో ఉత్పత్తిదారులు కొంతవరకూ విజయం సాధించారు. నీరు సులభంగా చొరబడని (వాటర్-రెసిస్టెంట్) ఫోన్లను తీసుకురాగలిగారు. అలాగని ఇవేమీ ఫోన్ లోపలికి నీరు చేరకుండా 100% అడ్డుకోలేకపోతున్నాయి. నీటిలో పూర్తిగా మునిగిపోయే సందర్భాల్లో చాలామటుకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో నీటి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించే వాటర్ప్రూఫ్ చరవాణుల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది.
తప్పుడు ప్రచారానికి భారీ జరిమానా
తమ ఫోన్లు నీటిలోనూ భేషుగ్గా పనిచేస్తాయంటూ తప్పుడు ప్రచారం చేసిన ఓ దిగ్గజ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థకు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు గతవారం సుమారు రూ.75 కోట్ల (14 మిలియన్ డాలర్ల) జరిమానా విధించింది. సముద్రపు నీటిలో పడితే, తమ ఫోన్లలోని ఛార్జింగ్ పోర్టులు తుప్పు పడతాయని, తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే పాడవుతాయని ఆ సంస్థ నిజం వెల్లడించింది.
ఆ రేటింగ్ను ఎలా కొలుస్తారు?
ఇంగ్రెస్ ప్రొటెక్షన్ (ఐపీ) అనే రేటింగ్ సిస్టం ద్వారా.. ఫోన్లు ధూళి వంటి ఘన పదార్థాలు, నీరు వంటి ద్రవపదార్థాలను వికర్షించే గుణాన్ని కొలుస్తారు. రెండు సంఖ్యలతో ఈ రేటింగ్ను సూచిస్తారు. ‘ఐపీ68’ను తీసుకుంటే, ఇందులో ఎడమవైపు సంఖ్య ఘన పదార్థాల నుంచి, కుడివైపు సంఖ్య ద్రవ పదార్థాల నుంచి కల్పించే రక్షణ స్థాయులకు సూచన. ఈ సంఖ్యలు 0 (నో ప్రొటెక్షన్) నుంచి 6/8 (హై ప్రొటెక్షన్) వరకూ రేటింగ్ను సూచిస్తాయి. అయితే ఇవి కేవలం ప్రయోగశాల పరీక్ష ఫలితాలను అనుసరించి నిర్ధరించినవే.
నీటి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలంటే?
ఫోన్లు ధూళిని, నీటిని వికర్షించాలంటే... వాటి ఛార్జింగ్ పోర్టులు, బటన్లు, స్పీకర్లు, కెమెరా, ఫ్లాష్, మైక్రోఫోన్, సిమ్కార్డు ట్రే, యూఎస్బీ పోర్టులు ఉన్నచోట పూర్తిగా మూసెయ్యాలి. ఇందుకు గ్లూ, టేపు, సిలికాన్ సీల్, రబ్బర్ రింగ్, గ్యాస్కెట్, ప్లాస్టిక్ మెష్ వంటి పదార్థాలను వినియోగించాలి. కొంతవరకూ ఇలా చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే. స్మార్ట్ఫోన్లోని భాగాలన్నీ ఎంతో సున్నితమైనవి. పెళుసుగా ఉంటాయి. అత్యంత నాజూకైన పెట్టెల్లో వీటిని అమర్చాలి. నీటిని పూర్తిగా వికర్షించేలా రూపొందించాలంటే.. వీటి పరిమాణం పెరుగుతుంది. ధర కూడా 30% వరకూ ఎక్కువవుతుంది. ఒకవేళ ఫోన్కి చిన్నపాటి బీట వచ్చినా, ఇక దానికి రక్షణ లేనట్టే!
ప్రయోగాలు ఫలించవచ్చు...
‘‘లేజర్ రైటింగ్ సాంకేతికతతో సర్క్యూట్ వంటి లోపలి పరికరాలతో పాటు బయటి భాగాలకూ సిలికాన్, వాటర్-రెసిస్టెంట్ పూతను వేయడం ద్వారా ఫలితం ఉండొచ్చు. దీనిపై జరుగుతున్న ప్రయోగాలు ఫలించే అవకాశముంది. ఒకవేళ మీ ఫోన్ నీటిలో పడిపోతే వెంటనే దాన్ని బయటకు తీసి, పూర్తిగా ఆరనివ్వాలి. అప్పటివరకూ ఛార్జింగ్ పెట్టకూడదు. వాటర్ప్రూఫ్ పౌచ్ను వినియోగించడం మేలు’’ అని ఆస్ట్రేలియాలోని సీక్యూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రితేశ్ చుగ్ పేర్కొన్నారు.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ