ITR Filing: రిటర్నుల దాఖలుకు తరుణమిదే
గత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను ఆదాయపు పన్ను రిటర్నులు ఈ నెలాఖరులోగా దాఖలు చేయాలి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు (హెచ్యూఎఫ్) ఈ గడువు వరిస్తుంది. ఫారం-16, టీడీఎస్ సర్టిఫికెట్లు, మూలధన రాబడి వివరాలు,
గత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను ఆదాయపు పన్ను రిటర్నులు ఈ నెలాఖరులోగా దాఖలు చేయాలి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు (హెచ్యూఎఫ్) ఈ గడువు వరిస్తుంది. ఫారం-16, టీడీఎస్ సర్టిఫికెట్లు, మూలధన రాబడి వివరాలు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, ఫారం 26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లన్నీ ఒకసారి పరిశీలించుకోవాలి. ఆదాయం, పన్ను చెల్లింపు, జమల్లో ఏదైనా తేడాలున్నాయా గమనించాలి.
ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారుడు ఎలాంటి పత్రాలనూ జమ చేయాల్సిన అవసరం లేదు. కానీ, భవిష్యత్లో ఎప్పుడైనా పన్ను అధికారులు వీటిని కోరేందుకు అవకాశం ఉంది. కాబట్టి, మినహాయింపులు క్లెయిం చేసుకున్నప్పుడు సంబంధిత ధ్రువీకరణలను జాగ్రత్త చేసుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం కేవలం చట్టబద్ధమైన ప్రక్రియే కాదు. మీ ఆదాయానికి ఒక గుర్తింపునిస్తుందని గమనించాలి. రుణాలు తీసుకోవాలన్నా, విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఇది ఎంతో కీలకమైన పత్రంగా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను రిటర్నులను ఎవరికి వారే సులభంగా దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైటులో సలహాలు, సూచనలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అవగాహన చేసుకొని, రిటర్నులు దాఖలు చేయొచ్చు. పొరపాట్లు చేస్తే తర్వాత పన్ను అధికారులు ప్రశ్నించేందుకు అవకాశాలున్నాయి.
ముందుగానే సిద్ధం..
ఆదాయపు పన్ను రిటర్నులు సులువుగా చేసేందుకు ఆదాయపు పన్ను వెబ్సైట్ www.incometax.gov.in లో ఏర్పాట్లు ఉన్నాయి. పాన్తో ఈ వెబ్సైటులోకి లాగిన్ అయి, మీకు వర్తించే రిటర్నుల ఫారాన్ని ఎంచుకోవాలి. వేతనం ద్వారా మీకు అందిన ఆదాయం, బ్యాంకు డిపాజిట్లపై వచ్చిన వడ్డీ, డివిడెండ్ ఆదాయం తదితరాలన్నీ ముందే నింపి సిద్ధంగా ఉంటాయి. చెల్లించిన పన్ను, మీరు పేర్కొన్న మినహాయింపులూ నమోదై ఉంటాయి. ఇందులో ఏదైనా మార్పులుంటే మీరు చేసుకునే వీలుంది. ఏఐఎస్లో మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. ఇందులో మీరు చేసిన అధిక విలువ లావాదేవీలూ తెలుసుకోవచ్చు.
ఫారం 26 ఏఎస్తో పోలిస్తే.. ఏఐఎస్లో మరిన్ని వివరాలుంటాయి. 26ఏఎస్లో పన్ను చెల్లించినప్పుడు మాత్రమే ఆ లావాదేవీలు కనిపిస్తాయి. వార్షిక నివేదికలో వ్యవహారాలన్నీ నమోదు చేసి ఉంటాయి. మీ లభించిన ఆదాయాలకు భిన్నంగా నివేదికలో ఉంటే.. వాటిని పన్ను విభాగం దృష్టికి తీసుకెళ్లవచ్చు. చాలామంది తమకు వచ్చిన వడ్డీ ఆదాయం ఫారం 26ఏఎస్లో కనిపించకపోతే విస్మరిస్తుంటారు. కానీ, ఏఐఎస్లో వీటిని చూసి, ఆదాయపు పన్ను రిటర్నులలో వాటిని పేర్కొని, వర్తించే పన్ను చెల్లించడం మేలు.
ఎవరికి ఏ పత్రం
ఐటీఆర్ 1 (సహజ్): రూ.50లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు. వేతనం, ఒకే ఇంటి నుంచి ఆదాయం, వడ్డీ ఆదాయం, రూ.5వేల లోపు వ్యవసాయ ఆదాయం ఉన్నవారికి.
ఐటీఆర్ 2: రూ.50లక్షలకు మించి ఆదాయం ఉన్నవారికి, విదేశీ ఆస్తులు, ఒక ఇంటికి మించి ఇళ్ల ద్వారా ఆదాయం ఉన్న సందర్భంలో
ఐటీఆర్ 3: పై ఆదాయాలతోపాటు, వృత్తి, వ్యాపారం ద్వారా లాభ నష్టాలు ఉన్నప్పుడు.
ఐటీఆర్ 4: వ్యక్తులు, హెచ్యూఎఫ్లకు రూ.50లక్షలకు మించి ఆదాయం ఉండి, వృత్తి, వ్యాపారం ద్వారా ఆదాయం ఆర్జించేవారికి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా