సెజ్ స్థానంలో దేశ్
ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) స్థానంలో డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్ (డీఈఎస్హెచ్-దేశ్) విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే పారిశ్రామిక వేత్తలకు పంపి, అభిప్రాయసేకరణ చేపట్టింది. ‘‘దేశ్’లో రాష్ట్రాలు భాగస్వాములయ్యేలా సెజ్ల చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తాం. దీనివల్ల కొత్త, పాత పారిశ్రామిక ప్రాంతాల్లోని మౌలిక వసతులను గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకుని, ఎగుమతుల్లో పోటీని పెంచొచ్చు’ అని బడ్జెట్ సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి విదితమే.
బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కసరత్తు
ఈనాడు-దిల్లీ
ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) స్థానంలో డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్ (డీఈఎస్హెచ్-దేశ్) విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే పారిశ్రామిక వేత్తలకు పంపి, అభిప్రాయసేకరణ చేపట్టింది. ‘‘దేశ్’లో రాష్ట్రాలు భాగస్వాములయ్యేలా సెజ్ల చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తాం. దీనివల్ల కొత్త, పాత పారిశ్రామిక ప్రాంతాల్లోని మౌలిక వసతులను గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకుని, ఎగుమతుల్లో పోటీని పెంచొచ్చు’ అని బడ్జెట్ సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి విదితమే. అందుకనుగుణంగా సెజ్ చట్టం 2005 స్థానంలో కేంద్ర వాణిజ్యశాఖ పార్లమెంటు సమావేశాల్లో కొత్త బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇది చట్టరూపం దాలిస్తే సెజ్లన్నీ ఇక డెవలప్మెంట్ హబ్స్గా మారతాయి. వాటికి వివిధ చట్టాల నియంత్రణల నుంచి విముక్తి లభిస్తుంది.
* ప్రస్తుతం సెజ్ల నుంచి ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయి. ఈ చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు తగ్గ విధంగా లేదని, ఆ సంస్థకు చెందిన వివాద పరిష్కార సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సెజ్ లోని యూనిట్లు తొలి అయిదేళ్లు 100%, తర్వాత 5 ఏళ్లు 50% ఆదాయపు పన్ను మినహాయింపును పొందుతున్నాయి. ఇలా సబ్సిడీ పొందిన దేశాల నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల, తమ మార్కెట్ ధరలపై ప్రభావం పడుతోందని చాలా దేశాలు వీటిని అనుమతించడం లేదు.
* దేశ్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు దేశీయ తయారీ పెంచేందుకు, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ తయారైన వస్తువులను దేశీయంగా విక్రయించుకోడానికీ అనుమతిస్తారు. ఇందువల్ల ఇవి డబ్ల్యూటీఓ నిబంధనల పరిధిలోకి వస్తాయి.యూనిట్ల ఏర్పాటుకు ఆన్లైన్లో సింగిల్ విండో పోర్టల్ ద్వారా నిర్దిష్టకాలంలో అనుమతులు ఇస్తారు. ఇందులో ఏర్పాటైన కంపెనీలు ఎగుమతి చేయొచ్చు.. ముడిసరుకును దిగుమతి చేసుకోవచ్చు. ఇందులో తయారైన అంతిమ వస్తువు (ఫైనల్ప్రోడక్ట్)పై కాకుండా, వాటి తయారీ/అసెంబ్లింగ్ కోసం దిగుమతి చేసుకున్న వస్తువులు, ముడిసరుకుపై సుంకాలు చెల్లిస్తే సరిపోతుంది.
ఇదే తేడా: ప్రస్తుతం సెజ్లో తయారైన వస్తువులను దేశీయ మార్కెట్లో విక్రయిస్తే అంతిమ వస్తువుపై సుంకాలు చెల్లించాల్సి వస్తోంది. అదీ విదేశీ మారకద్రవ్య రూపంలో కట్టాల్సి వస్తుంది. దేశ్లో ఈ నిబంధనలు ఉండవు.
* సెజ్ చట్టం కింద అత్యధిక నిర్ణయాలు కేంద్ర వాణిజ్యశాఖ చేతుల్లో ఉన్నాయి. కొత్త బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకూ దేశ్ యూనిట్ల నిర్వహణలో తగిన భాగస్వామ్యం ఉంటుంది. తమ రాష్ట్రంలో కొత్త హబ్ల ఏర్పాటుకు అనుమతుల కోసం అవి నేరుగా కేంద్ర బోర్డుకు సిఫారసు చేయొచ్చు.
* నీ వీటి పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధ్వర్యంలో రాష్ట్ర మండళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దిగుమతులు, వస్తు సేకరణకు అనుమతి ఇచ్చే అధికారం వాటికి ఉంటుంది. బయటి నుంచి సేకరించిన వస్తువులు, సేవలు, గోదాముల వినియోగం, హబ్లలో జరుగుతున్న వాణిజ్యాన్ని ఈ బోర్డులు పర్యవేక్షించవచ్చు.
ప్రధాన లక్ష్యాలివీ
1.అదనపు ఆర్థిక కార్యకలాపాల సృష్టి, 2.భారీగా ఉద్యోగాల కల్పన, 3.దేశ, విదేశీ మార్గాల నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడం. 4.పరిశోధన, అభివృద్ధిలో వినూత్న ఆలోచనలు, పెట్టుబడులకు పెద్దపీట వేయడం. 5.మౌలిక వసతుల కల్పన. 6.అంతర్జాతీయ సరఫరా వ్యాల్యూ ఛైన్లతో దేశీయ వస్తువులను అనుసంధానం చేయడం, మరింత పోటీ తట్టుకునేలా వస్తు తయారీ, ఎగుమతులను నిలబెట్టడం. 7.భారత సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతను కాపాడుకుంటూనే విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం కొత్త బిల్లు ప్రధాన ఉద్దేశాలని ముసాయిదాలో కేంద్రం పేర్కొంది.
* కొత్త హబ్లు ఏర్పాటు చేయదలచుకున్న వ్యక్తులెవరైనా తమ ప్రతిపాదనలను రాష్ట్ర పరిధిలోని బోర్డులకు పంపుకోవచ్చు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర బోర్డులు సెం్రçËల్ బోర్డులకు పంపుతాయి. వాటిని ఆమోదిస్తే లెటర్ ఆఫ్ అప్రూవల్ పంపుతారు. ఒకవేళ తిరస్కరిస్తే అందుకు కారణాలను వివరిస్తూ వెనక్కి పంపుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం