బేరమాడితే.. తగ్గేను వడ్డీ
రెండేళ్లుగా తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు పెరగడం ప్రారంభించాయి. ఏప్రిల్లో గృహరుణాల వడ్డీ రేట్లు 6.40%-6.80% మధ్య ఉండేవి. ఇప్పుడు దాదాపు 90 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఆర్బీఐ రెపో రేటును మరింత పెంచుతుందనే అంచనాలున్నాయి.
రెండేళ్లుగా తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు పెరగడం ప్రారంభించాయి. ఏప్రిల్లో గృహరుణాల వడ్డీ రేట్లు 6.40%-6.80% మధ్య ఉండేవి. ఇప్పుడు దాదాపు 90 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఆర్బీఐ రెపో రేటును మరింత పెంచుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి రుణం మరింత భారం కానుంది. ఇలాంటి సందర్భంలో వడ్డీ రేటుపై ఎంతో కొంత రాయితీ వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? తెలుసుకుందాం.
ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆ ప్రభావం వడ్డీ రేట్లపైనా పడుతోంది. దీర్ఘకాలం తీసుకునే రుణాలకు అధిక వడ్డీ చెల్లిస్తే.. మన జేబుపై భారం తప్పదు. 15-20 ఏళ్లు కొనసాగే రుణంపై 25-50 బేసిస్ పాయింట్ల వడ్డీ ఎక్కువగా ఉన్నా.. దాని ప్రభావం అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇంటి రుణాలు తీసుకునేటప్పుడు ఇది తప్పనిసరిగా గమనించాల్సిన అంశం.
రుణదాతను అడగండి..
ఇప్పుడు బ్యాంకులు గృహరుణ వడ్డీ రేట్లను రెపో ఆధారంగానే నిర్ణయిస్తున్నాయి. రెపో రేటుకు, కొంత క్రెడిట్ స్ప్రెడ్ను కలిపి వడ్డీ రేటు పేర్కొంటాయి. ఉదాహరణకు.. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 4.90శాతం ఉంది. దీనికి ఒక బ్యాంకు 2.70% క్రెడిట్ స్ప్రెడ్ను నిర్ణయిస్తే.. వడ్డీ రేటు 7.60 శాతంగా మారుతుంది. ఈ స్ప్రెడ్ రేటు రుణ వ్యవధి కొనసాగినంత కాలం స్థిరంగా ఉంటుంది. సాధారణంగా ఇది 2.70 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 3.55 శాతం వరకూ వెళ్లొచ్చు. చాలా సందర్భాల్లో బ్యాంకులు తాము ప్రకటనల్లో చెప్పే రేటుకన్నా.. 15-20 బేసిస్ పాయింట్లు తగ్గించి, రుణాలను అందించే అవకాశం లేకపోలేదు. ఇది పూర్తిగా రుణగ్రహీత క్రెడిట్ స్కోరు, చెల్లింపుల తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ఇతర బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని కొత్త బ్యాంకుకు మార్చుకునే సందర్భంలో బేరమాడేందుకు అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలిక బంధం...
సాధారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు వీలైనన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. మీ వేతనం ఖాతా, పెట్టుబడులు, ఇంతకు ముందే రుణాలు తీసుకోవడం తదితర లావాదేవీలు ఉన్నప్పుడు మీకు ఇతరులతో పోలిస్తే కాస్త తక్కువ వడ్డీకే రుణం రావచ్చు. కొన్నిసార్లు బ్యాంకుతో మీకున్న సంబంధాల ఆధారంగా రుణాలను ముందుగానే మంజూరు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో డిస్కౌంటు వడ్డీ రేటుకే రుణాలను అందించే అవకాశం ఉంది. వ్యక్తిగత, వాహన రుణాలను తీసుకోవాలనుకున్నప్పుడు ఈ మందస్తు మంజూరు రుణాల (ప్రీ అప్రూవ్డ్ లోన్స్) వల్ల ఆదాయ, ఇతర ధ్రువీకరణలు అందించాల్సిన అవసరాలు అంతగా ఉండవు. కొన్నిసార్లు.. ఒకటికి మించి అప్పులు ఒకే బ్యాంకులో తీసుకుంటే.. ఉదాహరణకు ఇంటి, కారు రుణం కోసం ఒకే బ్యాంకులో దరఖాస్తు చేస్తే కాస్త తక్కువ వడ్డీకి అప్పు పొందే వీలుంటుంది. ఒకసారి బ్యాంకుతో ఈ విషయాన్ని చర్చించండి.
వీటినీ గుర్తుంచుకోండి..
* మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనేదీ రుణ వడ్డీని నిర్ణయించడంలో బ్యాంకులు పరిశీలిస్తాయి. సాధారణంగా ప్రముఖ సంస్థలు, కార్పొరేట్లలో పనిచేస్తున్న వారికి ఈ విషయంలో ఇబ్బంది ఉండదు. సొంతంగా వ్యాపారం, వృత్తి నిర్వహించే వారికి వడ్డీ రేటు కాస్త అధికంగానే ఉంటుంది. కాస్త పరిశోధన చేశాకే బ్యాంకును ఎంచుకోండి.
* మహిళా రుణగ్రహీతలకు బ్యాంకులు కొంత శాతం వడ్డీలో రాయితీని ఇస్తాయి. వీరు ప్రాథమిక రుణ గ్రహీత లేదా సహ-దరఖాస్తుదారులుగానూ ఉన్నా వడ్డీ తగ్గింపును అందిస్తాయి.
* బ్యాంకులు గుర్తించిన డెవలపర్ల దగ్గర ఇల్లు, ఫ్లాటు కొన్నప్పుడు కొంతమేరకు వడ్డీ రాయితీ లభించే అవకాశాలున్నాయి. మీరు కొంటున్న ఆస్తికి ఏ బ్యాంకు రుణం ఇస్తుందో తెలుసుకోండి. వాహన రుణాలకూ ఇదే వర్తిస్తుంది.
800 దాటితే..
ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వారికి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుతాయి. వాయిదాల చెల్లింపులను సక్రమంగా చేయని వారికి బ్యాంకులు అధిక వడ్డీకే అప్పులిస్తాయి. మీ క్రెడిట్ స్కోరు 750 దాటితే.. మీరు మంచి రుణగ్రహీతగా బ్యాంకులు భావిస్తాయి. ఇలాంటి వారిని వదులుకోవు. 800 దాటి స్కోరున్న వారికి తక్కువ వడ్డీకే రుణాలను ఇచ్చేందుకు ముందుకువస్తాయి. కొత్త రుణం తీసుకోబోయే ముందు మీ క్రెడిట్ స్కోరు ఎంతుందో చూసుకోండి. ఇది 750 లోపు ఉంటే.. కొత్త రుణం తీసుకునేందుకు తొందరవద్దు. ముందు స్కోరు పెంచుకునే దిశగా చర్యలు చేపట్టండి.
తక్కువ మొత్తం..
గృహరుణాన్ని ఎంత మొత్తం తీసుకుంటున్నారనేదీ మీ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు రూ.30 లక్షల లోపు రుణాలకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. రూ.75లక్షలు దాటినప్పుడు వడ్డీ అధికంగా ఉంటుంది. ఇంటి విలువలో ఎంత నిష్పత్తి రుణాన్ని తీసుకుంటున్నారు అనేదీ కీలకమే. ఈ నిష్పత్తి తక్కువగా ఉంటే వడ్డీలో రాయితీ లభిస్తుంది. చాలా సందర్భాల్లో రుణగ్రహీతలు అధిక మొత్తంలో రుణం తీసుకునేందుకే మొగ్గు చూపిస్తుంటారు. దీనివల్ల వారి దగ్గరున్న పొదుపు మొత్తం ఖర్చవకుండా ఉంటుందని అనుకుంటారు. కానీ, అధిక రుణం దీర్ఘకాలంలో భారాన్నే మోపుతుందని మర్చిపోవద్దు.
- అధిల్ శెట్టి, సీఈఓ బ్యాంక్బజార్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల
ఒక టెక్ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఆవిష్కరణతో యాపిల్ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు. -
సాగు సాయం అంతంతే!
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. -
‘లఖ్పతి’తో లక్షార్జన!
స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లకు సంబంధించిన ‘లఖ్పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. -
ఆదాయపు పన్ను ఏం మారలే!
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. -
కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు
దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
రక్షణకు ఓ మోస్తరు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే