Dollor Vs rupee: ధరలు మండుతున్నా... డాలరుదే హవా
అమెరికాలో 40 ఏళ్లలోనే ఎన్నడూ లేనంతగా ధరలు మండుతున్నాయి. జూన్లో ద్రవ్యోల్బణం 9.1 శాతంగా నమోదైంది. అదే మన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతమే. యూరోను కరెన్సీగా వినియోగిస్తున్న 19 ఐరోపా దేశాల్లో కూడా జూన్ ద్రవ్యోల్బణం 8.6 శాతమే.
అయినా బలపడుతున్న ఆ దేశ కరెన్సీ
అమెరికాలో 40 ఏళ్లలోనే ఎన్నడూ లేనంతగా ధరలు మండుతున్నాయి. జూన్లో ద్రవ్యోల్బణం 9.1 శాతంగా నమోదైంది. అదే మన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతమే. యూరోను కరెన్సీగా వినియోగిస్తున్న 19 ఐరోపా దేశాల్లో కూడా జూన్ ద్రవ్యోల్బణం 8.6 శాతమే. అంటే మనదేశం, ఐరోపా కంటే అమెరికాలోనే ద్రవ్యోల్బణ భారం అధికంగా ఉంది. ఏ దేశంలో అయినా ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంటే, ఆ దేశ కరెన్సీ మారకపు విలువ పతనమవుతుంది. అయితే అమెరికా డాలరు విలువ అందుకు భిన్నంగా చలిస్తోంది. డాలర్ విలువ ఇప్పుడు రూ.79.82కు చేరితే, ఐరోపా కరెన్సీ అయిన యూరో విలువ కూడా డాలర్ విలువకు దిగి రావడం గమనార్హం. డాలర్ ఇంత బలంగా ఉండటం ఎలా సాధ్యమవుతోంది..?
అమెరికా, ఐరోపా దేశాలకు పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ ఎగుమతుల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యా నుంచి పెట్రో ఉత్పత్తుల కొనుగోలును కొన్ని దేశాలు నిలిపేశాయి. దీంతో ముడిచమురుకు కొరత ఏర్పడి, బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 140 డాలర్ల వరకూ వెళ్లినా, ఇప్పుడు 100 డాలర్ల వద్ద కదలాడుతోంది. రష్యా నుంచి వచ్చే లోహాల ధరలకూ కొరత ఏర్పడి, వాటి ధరలూ పెరిగాయి. ఉక్రెయిన్ నుంచి గోధుమలు, సన్ఫ్లవర్ నూనె సరఫరాలు స్తంభించి, ఆహార పదార్థాల ధరలూ పెరిగాయి. అమెరికాలోనూ ఆ దేశ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ లక్ష్యమైన 2% కంటే పైనే ద్రవ్యోల్బణం నమోదు కావడం ప్రారంభమయ్యాక, గిరాకీని-నగదు చెలామణిని అదుపు చేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. వడ్డీరేట్లు పెంచుతోంది.
డాలరుకు బలం ఇలా..
* అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే, అక్కడి బాండ్లపై అధిక ప్రతిఫలం లభిస్తుంది. ఇందువల్ల వాటిని కొనేందుకు ఆసక్తి పెరిగింది. దీంతోపాటు యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్నాలజీ కంపెనీల షేర్లపై పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఉంది. అంతర్జాతీయ వర్తకం అంతా డాలర్లలోనే జరుగుతుందనేది తెలిసిన విషయమే. . ఫలితంగా డాలర్లే ప్రపంచంలో అత్యంత భద్రమైన ఆస్తిగా భావించడం పెరిగింది.
* అమెరికాలో వడ్డీరేట్లు సున్నాగా ఉన్నప్పుడు, అక్కడి నుంచి పెట్టుబడులు భారత్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి తరలి వచ్చేవి. ఈ దేశాల్లో మార్కెట్లు రాణించడంతో, వారికి అధిక ప్రతిఫలం లభించేది. అయితే బాండ్లపై ప్రతిఫలం పెరిగాక, వర్థమాన దేశాల్లో ఈక్విటీలు విక్రయించి, పెట్టుబడులను వెనక్కి పట్టికెళ్లడం పెరిగింది. ఫలితంగా డాలర్కు గిరాకీ పెరిగి, రూపాయి పతనమైంది.
* 1999లో యూరోను ఐరోపా దేశాల సమాఖ్య ఆవిష్కరించింది. ఇప్పుడు 19 దేశాల్లో ఆ కరెన్సీ అమల్లో ఉంది. 2002 డిసెంబరులో డాలరు కంటే తక్కువగా ఉన్న యూరో విలువ, ఆ తరవాత పెరిగి ఇటీవలి వరకు ఎక్కువగానే ఉండేది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో, మాంద్యం భయాలు ఐరోపాలో పెరిగాయి. తమపై విధించిన ఆంక్షలకు నిరసనగా జర్మనీకి శాశ్వతంగా గ్యాస్ సరఫరాను రష్యా నిలిపేస్తే, పరిస్థితి మరింత దుర్భరమవుతుందని ఐరోపా వాసులు ఆందోళన చెందుతున్నారు. అందుకే డాలర్ సురక్షితమని భావించి, దానిపై పెట్టుబడులు పెరగడం వల్ల, విలువ హెచ్చుతోంది.
అమెరికాలో మందగమనం ఏర్పడితే
అమెరికాలో రేట్లు మరింత పెంచుతారనే నమ్ముతున్నారు. పైగా ద్రవ్యలభ్యత తగ్గితే కొనుగోళ్లు నెమ్మదిస్తాయి. ఫలితంగా ఉత్పత్తి, సేవలకు గిరాకీ తగ్గి, ఉద్యోగ కోతలు సంభవిస్తాయి. ఇందువల్ల అమెరికా మాంద్యంలోకి జారొచ్చన్న అంచనాలున్నాయి. ఇందువల్ల భారత్ వంటి దేశాల నుంచి వస్తు, ఐటీ సేవల ఎగుమతులు, వాటిపై ఆదాయం క్షీణిస్తుంది. మన ఆర్థిక వృద్ధిలో ఎగుమతుల వాటా నాలుగో వంతు కావడం గమనార్హం.
* ముడిచమురు, వంటనూనెలు, ఎలక్ట్రానిక్స్, బంగారం వంటి లోహాల కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం కనుక, డాలర్లలో చెల్లించాల్సిన దిగుమతుల బిల్లు భారం అధికమవుతుంది. ఇందువల్ల వాణిజ్యలోటు, కరెంటు ఖాతాలోటు పెరుగుతున్నాయి. ఈనెల 8తో ముగిసిన వారంలో మన విదేశీ మారకపు నిల్వలు 800 కోట్ల డాలర్లు తగ్గి 58,025 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడేందుకు ‘దిగుమతులకు రూపాయల్లో చెల్లింపు, డాలర్లలో నిధుల సమీకరణకు కంపెనీలతో పాటు బ్యాంకులకూ మరిన్ని సౌలభ్యాల’ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. ముడిచమురు బిల్లు తగ్గించుకునేందుకు రష్యా నుంచి చౌకగా కొనుగోలు చేసేందుకు అనుమతిస్తోంది. ఇవన్నీ రూపాయి విలువ మరింత వేగంగా పతనం కాకుండా చూస్తాయని భావించొచ్చు.
చైనా ఆర్థికానికి కరోనా
బీజింగ్: చైనా ఆర్థిక వ్యవస్థ రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 0.4 శాతానికే పరిమితమైంది. చైనాకు ‘జీరో కొవిడ్’ విధానం వల్ల ఎదురుదెబ్బ తగిలింది. ‘పెద్ద నగరాల్లో దీర్ఘకాలం పాటు లాక్డౌన్ కొనసాగించడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక సరఫరా వ్యవస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయ’ని శుక్రవారం విడుదలైన అధికారిక ప్రకటన తెలిపింది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటస్టిక్స్(ఎన్బీఎస్) ప్రకటన ప్రకారం..2022 రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే తక్కువగా 0.4 శాతమే వృద్ధి చెందింది. 2020 తొలి త్రైమాసికంలో ఏకంగా 6.8 శాతం మేర క్షీణించిన అనంతరం ఇదే అత్యంత తక్కువ వృద్ధి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల
ఒక టెక్ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఆవిష్కరణతో యాపిల్ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు. -
సాగు సాయం అంతంతే!
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. -
‘లఖ్పతి’తో లక్షార్జన!
స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లకు సంబంధించిన ‘లఖ్పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. -
ఆదాయపు పన్ను ఏం మారలే!
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. -
కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు
దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
రక్షణకు ఓ మోస్తరు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్