జొమాటో షేరుకు మరిన్ని కష్టాలు!
జొమాటో షేరుకు వచ్చే వారం నుంచి మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏడాది పాటు లాక్-ఇన్ పీరియడ్లో కొనసాగిన 613 కోట్ల షేర్లను
లాక్-ఇన్ సమయం ఈనెల 22తో ముగింపు
వ్యవస్థాపకులు, వాటాదార్ల వద్ద ఉన్న 78% షేర్లు విక్రయించుకునే వెసులుబాటు
స్టాక్ విలువ మరింత తగ్గొచ్చని విశ్లేషకుల అంచనా
జొమాటో షేరుకు వచ్చే వారం నుంచి మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏడాది పాటు లాక్-ఇన్ పీరియడ్లో కొనసాగిన 613 కోట్ల షేర్లను (మొత్తం షేర్లలో 77.87 శాతం) వచ్చే వారం నుంచి విక్రయించుకునే వెసులుబాటు కలుగుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ‘జొమాటోకు ప్రమోటర్ లేరు. వ్యవస్థాపకులతో పాటు ఇతర మదుపర్ల దగ్గర 613 కోట్ల షేర్లు ఏడాది పాటు లాక్ ఇన్లో ఉన్నాయి. 2021 జులై 23న ఈ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఏడాది కాలావధి ముగుస్తున్నందున, ఈనెల 23 నుంచి వాటిని వారు విక్రయించుకోవచ్చు. దీంతో స్టాక్ ధరపై ప్రభావం పడే అవకాశం ఉంద’ని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్గవర్న్ వ్యవస్థాపకులు, ఎండీ శ్రీరామ్ సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు.
* ‘జొమాటో షేర్లు స్టాక్ మార్కెట్లో నమోదైన తర్వాత యాంకర్ మదుపర్లకు కేటాయించిన షేర్లను ఒక నెల పాటు విక్రయించడానికి వీలు లేదు. అది ముగిసిన మరుసటి రోజే షేరు 8 శాతం నష్టపోయిన’ విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
* పబ్లిక్ ఇష్యూలో రూ.76 చొప్పున జొమాటో షేర్లు కేటాయించారు. 2021 జులై 23న షేరు భారీ ప్రీమియంతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రూ.115 వద్ద నమోదైంది. తర్వాత రోజుల్లో షేరు విలువ జీవన కాల గరిష్ఠమైన రూ.169 స్థాయికి చేరడమే కాదు.. రూ.లక్ష కోట్ల మార్కెట్ విలువను సాధించింది. తదుపరి షేరు విలువ తగ్గుతూ వస్తూ, మంగళవారం బీఎస్ఈలో రూ.53.90 వద్ద ముగిసింది.
రిటైల్ మదుపర్లు ఇవి గమనించాలి
* నష్టాల్లో ఉన్న క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ (గతంలో గ్రోఫర్స్)ను 570 మి.డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాక, షేరు నష్టపోతూ వస్తోంది.
* పీసీ/వీసీ ఇన్వెస్టర్లకు షేరును ఎంత విలువకు కేటాయించారో చూడాలి. ప్రస్తుత విలువ కంటే వారికి తక్కువకే లభిస్తే కనుక, వారు విక్రయాలకు దిగే అవకాశముంటుంది.
* జొమాటో ప్రారంభ దశలో పెట్టుబడి పెట్టిన ఇన్ఫో ఎడ్జ్ సంస్థకు, సగటున రూ.1.16 చొప్పునే షేర్లు లభించాయి. పబ్లిక్ ఇష్యూ సమయంలో, ఆ సంస్థ రూ.357 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇంకా 15.18 శాతం వాటా (రూ.6,330 కోట్లకు సమానం) ఆ సంస్థకు ఉంది.
* తొలిదశ ఇన్వెస్టర్లయిన అలిపే (7.1 శాతం), యాంట్ ఫైనాన్షియల్ (6.99 శాతం), టైగర్ గ్లోబల్ (5.11 శాతం), సెఖోయా క్యాపిటల్ (5.10 శాతం), టెమాసెక్ (3.11 శాతం)తో పాటు ఉబర్ (7.78 శాతం), డెలివరీ హీరో (1.36 శాతం) సంస్థలు కూడా ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఏం చేస్తాయో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.