ITR Filing: రిటర్నుల దాఖలు చాలా జాగ్రత్తగా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం, చెల్లించిన పన్నును అధీకృతం చేయడానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలులో ఎన్నో గణనీయమైన మార్పులు వచ్చాయి. వెల్లడించాల్సిన ఆదాయాలు, ఖర్చుల వివరాలు పెరిగాయి
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం, చెల్లించిన పన్నును అధీకృతం చేయడానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కొన్నేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలులో ఎన్నో గణనీయమైన మార్పులు వచ్చాయి. వెల్లడించాల్సిన ఆదాయాలు, ఖర్చుల వివరాలు పెరిగాయి. ఆదాయపు పన్ను విభాగం వీటన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి, సులభంగా రిటర్నుల సమర్పణకు అవసరమైన చర్యలనూ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ రిటర్నులను సమర్పించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి చిక్కులూ లేకుండా.. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలను పూర్తి చేసేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే..
సరైన పత్రంలో...
ఆదాయపు పన్ను రిటర్నులను ఏ ఫారంలో దాఖలు చేయాలన్నది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. సరైన ఫారాన్ని ఎంచుకోకపోతే.. రిటర్నులను ఆదాయపు పన్ను శాఖ ఆమోదించకపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా మన ప్రయత్నం వృథా అవుతుంది. మీకు వచ్చిన ఆదాయం, ఆదాయ మార్గం, పెట్టుబడులు, ఒకటికి మించి ఇళ్లు.. ఇలా సందర్భాన్ని బట్టి రిటర్నుల ఫారాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా వేతనం తప్ప మిగతా ఆదాయాలు లేని వారు, ఒక ఇంటి నుంచి ఆదాయం ఉన్నవారికి ఐటీఆర్-1 సరిపోతుంది. ఈక్విటీల్లో పెట్టుబడుల వల్ల మూలధన లాభం/నష్టం ఉన్నవారు, ఇతర వృత్తి, వ్యాపార ఆదాయాలు ఉన్నవారు ఐటీఆర్-2ను ఎంచుకోవాలి. షేర్లలో ఇంట్రాడే లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ లావాదేవీలు నిర్వహించిన వారు ఐటీఆర్-3లో రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
వ్యక్తిగత వివరాలు..
ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్ అంటే.. 2022-23 (ఆర్థిక సంవత్సరం 2021-22)కు గాను ఆదాయపు పన్ను శాఖ ముందే దాదాపు 90 శాతానికి పైగా నింపిన ఐటీఆర్ ఫారాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫారాన్ని ఒకసారి చూసుకోవడంతోపాటు, వ్యక్తిగత వివరాలు అంటే.. మీ పేరు, చిరునామా, ఫోన్, ఇ-మెయిల్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. మార్పులుంటే.. ఐటీఆర్ ఫారంలో కాకుండా.. పోర్టల్లోని అప్డేట్ విభాగానికి వెళ్లి, అక్కడ ఆ వివరాలను నమోదు చేయండి.
పోల్చి చూసుకోండి..
పన్ను గణనలో పారదర్శకతను పెంచేందుకు ఆదాయపు పన్ను శాఖ ఫారం 26 ఏఎస్తో పాటు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)ను అందిస్తోంది. ఈ రెండింటినీ ఒకసారి పోల్చి చూసుకోండి. ఈ రెండింటి ఆధారంగానే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే.. ఏఐఎస్పై మీ ఫిర్యాదును పన్ను విభాగానికి తెలియజేసేందుకు వీలుంది. పొరపాట్లను సరిచేసుకోకుండా, దానికి సంబంధించి ఫిర్యాదు చేయకుండా రిటర్నులు వేస్తే.. తర్వాత చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.
దాపరికం వద్దు..
అరుదుగా మీ ఆదాయ వివరాలు ఏఐఎస్లో నమోదు కాకపోవచ్చు. అంతమాత్రాన వాటి గురించి పన్ను విభాగానికి తెలియదని కాదు. మీ ఆదాయాలను నమోదు చేసే విషయంలో పూర్తి పారదర్శకత పాటించండి. ముఖ్యంగా ఆస్తుల క్రయవిక్రయాలు, విదేశాల నుంచి వచ్చిన ఆదాయం, ఏదైనా కంపెనీలో డైరెక్టర్గా ఉండటం, స్టాక్ మార్కెట్లో నమోదు కాని అన్లిస్టింగ్ షేర్ల లావాదేవీల్లాంటివి తెలియజేయాల్సి ఉంటుంది.
మినహాయింపు ఆదాయం..
కొన్ని ఆదాయాలకు పన్ను వర్తించదు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన తదితరాలపై వచ్చిన వడ్డీ, బంధువుల నుంచి నిబంధనల మేరకు వచ్చిన బహుమతులు పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తాయి. అయితే, వీటిని రిటర్నుల సమయంలో నమోదు చేయడం మర్చిపోవద్దు.
రూ.లక్ష దాటితే..
ఆదాయపు పన్ను రిటర్నుల విషయంలో ప్రభుత్వం ఇటీవల పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రూ.2లక్షలకు మించి విదేశీ ప్రయాణాల కోసం ఖర్చు చేసిన వారు, ఇంటి విద్యుత్ బిల్లు ఏడాదిలో రూ.లక్ష దాటిన వారు, విదేశాల్లో ఆస్తులు ఉన్నప్పుడు, బ్యాంకు డిపాజిట్లలో రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడు, టీడీఎస్ లేదా టీసీఎస్ రూ.25,000 మించితే.. తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. ఆదాయం పన్ను పరిమితి లోపున్నప్పటికీ వీరందరూ రిటర్నులు సమర్పించాలి.
చివరగా.. రిటర్నులు సమర్పించగానే సరిపోదు. వాటిని కచ్చితంగా ఇ-వెరిఫై చేసినప్పుడే ఆ ప్రక్రియ పూర్తయినట్లు. ఆధార్ ఓటీపీతో దీన్ని సులభంగానే చేయొచ్చు. లేదా సీపీసీ బెంగళూరుకు ఐటీఆర్-5ను పంపించొచ్చు. దీనికన్నా ఇ-వెరిఫై చేయడమే మేలు.
ఖాతా వివరాల్లో తప్పులు..
రిఫండును కోరే పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంకు వివరాలను సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డులో ఉన్న పేరు, బ్యాంకు ఖాతాలో ఉన్న పేరులో తేడాలుంటే.. రిఫండును జమ చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. బ్యాంకు ఖాతాను ముందుగానే వెరిఫై చేయడం మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల
ఒక టెక్ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఆవిష్కరణతో యాపిల్ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు. -
సాగు సాయం అంతంతే!
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. -
‘లఖ్పతి’తో లక్షార్జన!
స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లకు సంబంధించిన ‘లఖ్పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. -
ఆదాయపు పన్ను ఏం మారలే!
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. -
కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు
దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
రక్షణకు ఓ మోస్తరు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు