Home loan: వడ్డీరేట్లు పెరుగుతున్నాయ్... గృహ రుణ భారం తగ్గించుకోవాలంటే..?
వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో గృహరుణాన్నితొందరగా తీర్చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు. కొత్తగా రుణం తీసుకున్న వారు దీర్ఘకాలంపాటు ఈ అప్పు భారాన్ని మోయాల్సి ఉంటుంది. కాబట్టి, వీరు కొన్ని అంశాలపై దృష్టి పెడితే..
Home Loan: వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో గృహరుణాన్ని (Homeloan) తొందరగా తీర్చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు. కొత్తగా రుణం తీసుకున్న వారు దీర్ఘకాలంపాటు ఈ అప్పు భారాన్ని మోయాల్సి ఉంటుంది. కాబట్టి, వీరు కొన్ని అంశాలపై దృష్టి పెడితే.. తొందరగా రుణ విముక్తులయ్యే అవకాశం ఉంది.
తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు అందరం సంతోషించాం. కానీ, పెరుగుతున్నప్పుడు ఆందోళన చెందుతున్నాం. వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కదులుతూ ఉంటాయి. గృహరుణం 15, 20 ఏళ్ల దీర్ఘకాలిక అప్పు. ఈ వ్యవధిలో ఎన్నోసార్లు వడ్డీ రేట్లు తగ్గడం పెరగడం చూస్తుంటాం. కాబట్టి, ఈ విషయాన్ని ప్రతికూల దృష్టితో చూడొద్దు. వడ్డీ రేటు పెరిగినా.. ఈఎంఐపై దాని ప్రభావం ఉండదు. కాబట్టి, మీ నెలవారీ బడ్జెట్పై ప్రభావం ఉండదు. కేవలం వ్యవధి మాత్రమే పెరుగుతుంది. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు.. వ్యవధీ సర్దుబాటవుతుంది.
సమయానికి చెల్లించండి: రుణానికి చెల్లించే ఈఎంఐలు ఎప్పుడూ సకాలంలో చెల్లించేయండి. లేకపోతే ఆలస్యపు రుసుములు వసూలు చేస్తాయి బ్యాంకులు. దీనివల్ల అనవసర భారం పడుతుంది. క్రెడిట్ స్కోరు దెబ్బతినడం వల్ల కొత్త అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు వడ్డీ రేటు మనకు అనుకూలంగా ఉండదు. మూడు నెలలకు సరిపడా ఈఎంఐ ఎప్పుడూ సేవింగ్ బ్యాంకు ఖాతాలో ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
తక్కువ వడ్డీకి: అధిక వడ్డీ వసూలు చేసే బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే సంస్థకు మారేందుకు ప్రయత్నించవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కనీసం రేటులో 50 బేసిస్ పాయింట్లయినా తక్కువగా ఉండాలి. అప్పుడే దీర్ఘకాలంలో భారం తక్కువ పడుతుంది. అప్పు తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకూ ఆదాయం పెరగడం, క్రెడిట్ స్కోరు అధికం కావడం తదితర కారణాలతో మీకు మంచి వడ్డీకే రుణం వచ్చే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకుతో ఈ విషయాన్ని చర్చించండి. ఇతర బ్యాంకుకు మారుతున్నట్లు చెప్పండి. అప్పుడు బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది.
ముందుగా చెల్లించండి: వ్యవధి పెరగకుండా చూసుకునేందుకు ఉన్న మార్గం.. వీలైనప్పుడల్లా అసలును చెల్లిస్తూ వెళ్లడం. ఏడాదికోసారి అదనంగా ఒక ఈఎంఐని చెల్లించే ప్రయత్నం చేయొచ్చు. బోనస్లు, లేదా అనుకోకుండా వచ్చిన డబ్బును రుణం చెల్లించేందుకు వినియోగించుకోవచ్చు. ఏడాదికి అసలులో కనీసం 5 శాతం చెల్లించినా ఎంతో వడ్డీని ఆదా చేసుకున్నట్లు అవుతుంది. తొందరగా అప్పు నుంచి బయటపడొచ్చు.
ఈఎంఐ పెంచుకుంటే: మీ ఆదాయంలో 30-40 శాతానికి మించి ఈఎంఐ ఉండకూడదు. మీ ఆదాయం పెరిగితే.. దాన్ని బట్టి, ఈఎంఐని పెంచుకునే వీలుందా చూసుకోండి. మీ నెలవారీ బడ్జెట్పై ప్రభావం పడకుండా చూసుకోవడం ఇక్కడ ప్రథమ సూత్రం. ఈఎంఐ పెంచుకోవడం వల్ల వడ్డీ రేటు పెరిగినప్పుడు తొందరగా అప్పు తీరేందుకు అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం