నగదు రహిత చికిత్సకు.. ఆసుపత్రులను బీమా కంపెనీలే ఎంచుకుంటాయ్
ఆరోగ్య బీమా పాలసీదార్లకు నగదు రహిత (క్యాష్లెస్) చికిత్స అందించే ఆసుపత్రుల ఎంపికను భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సులభతరం చేసింది. క్యాష్లెస్ చికిత్సలు అందించే నెట్వర్క్ ఆసుపత్రులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని బీమా కంపెనీలకే
నిబంధనలను సవరించిన ఐఆర్డీఏఐ
పాలసీదార్లకు మేలు
ఈనాడు, హైదరాబాద్: ఆరోగ్య బీమా పాలసీదార్లకు నగదు రహిత (క్యాష్లెస్) చికిత్స అందించే ఆసుపత్రుల ఎంపికను భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సులభతరం చేసింది. క్యాష్లెస్ చికిత్సలు అందించే నెట్వర్క్ ఆసుపత్రులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని బీమా కంపెనీలకే కల్పించింది. తాము ఎంపిక చేసే నెట్వర్క్ ఆసుపత్రుల్లో సదుపాయాలు, వైద్య చికిత్సల ప్రమాణాలు ఎలా ఉండాలనే విషయంలో బీమా కంపెనీల బోర్డులు తగిన విధివిధానాలు సిద్ధం చేసుకోవాలని, వాటికి లోబడి ఆసుపత్రుల ఎంపిక ఉండాలని నిర్దేశించింది. మానవ వనరుల లభ్యత, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని, అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రులను ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తాజా నిబంధనలు జారీ చేసింది.
ప్రస్తుతం ఆసుపత్రి ఎంపిక ఇలా
ఇప్పటివరకు ఏదైనా ఒక ఆసుపత్రిని బీమా కంపెనీలు క్యాష్లెస్ సదుపాయం కోసం ఎంపిక చేయాలంటే, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ) వద్ద ఆ ఆసుపత్రి నమోదు కావాలి. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) నుంచి సర్టిఫికెట్ను సంబంధిత ఆసుపత్రి పొందాల్సి ఉంటుంది. లేదా నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ స్టాండర్డ్స్ కింద నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్సెస్ సెంటర్ జారీ చేసే ‘స్టేట్ లెవల్ సర్టిఫికెట్’ అయినా ఉండాలి. అప్పుడే ఒక ఆసుపత్రిని క్యాష్లెస్ సదుపాయం కోసం బీమా సంస్థలు ఎంపిక చేయగలుగుతున్నాయి.
తాజా మార్పుల వల్ల
ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలతో ఆసుపత్రుల ఎంపిక సులువవుతుంది. పెద్ద సంఖ్యలో ఆసుపత్రులను ఎంపిక చేసే అవకాశం బీమా కంపెనీలకు లభిస్తుందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ (అండర్ రైటింగ్) సంజయ్ దత్తా అన్నారు. గ్రామీణ, చిన్న పట్టణాల్లోని ఆసుత్రులను సైతం ఎంపిక చేసి ప్రజలకు క్యాష్లెస్ చికిత్స సదుపాయాన్ని అందుబాటులోకి తేవచ్చని లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ ప్రెసిడెంట్ (క్లెయిమ్స్) రాహుల్ శర్మ వివరించారు. దీనివల్ల ఆరోగ్య బీమా సదుపాయం విస్తరిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రుల ఎంపికలో అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత బీమా కంపెనీలపై ఉంటుందని అన్నారు.
నెట్వర్క్ ఆసుపత్రి కాకుంటే..
ఆరోగ్య బీమా పాలసీదార్లు చికిత్స కోసం ఏదైనా ఆసుపత్రిలో చేరాలనుకున్నప్పుడు, అక్కడ క్యాష్లెస్ సదుపాయం లభిస్తుందో-లేదోనని ఆందోళన చెందడం సహజం. ఆ సదుపాయం లేనిపక్షంలో ముందుగా సొమ్ము చెల్లించి, ఆ తర్వాత బీమా క్లెయిమ్కు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ‘చికిత్సకు అవసరమైన సొమ్మును ముందుగా సమకూర్చుకోవడంతో పాటు, ఆ తర్వాత క్లెయిము వస్తుందా, రాదా? వస్తే ఎంత సొమ్ము వస్తుంది..’ అనే ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. అదే నెట్వర్క్ ఆసుపత్రి అయితే పాలసీదార్లకు ఈ ఇబ్బందులు ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ