Gold Rates: బంగారం ధరల్లో ఏమిటీ గందరగోళం?
ఈనెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో, వివాహాది శుభకార్యాల హడావుడి నెలకొంది.
నగరాల మధ్య 10 గ్రాములకు రూ.2,000 తేడానా!
పన్ను కలపకుండా చూపడమే ఇందుకు కారణం
అంతర్జాతీయ ధర- డాలర్ మారకపు ధరే కీలకం
ఈనాడు వాణిజ్య విభాగం
ఈనెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో, వివాహాది శుభకార్యాల హడావుడి నెలకొంది. ఇందుకోసం తప్పనిసరిగా మహిళలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాల్సిందే. బంగారం ధర ఎలా ఉంది.. కాస్త తగ్గితే వెంటనే దుకాణానికి వెళ్లి, కొనుగోలు చేద్దామనుకున్న విజయవాడ వాసి వెంకట్రావు రోజూ ప్రసార మాధ్యమాలను పరిశీలిస్తున్నాడు. ‘విజయవాడ కంటే హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.2000కు పైగా తక్కువగా ఉంద’ని చూడటంతో వెంటనే బయలుదేరి హైదరాబాద్లోని ప్రముఖ ఆభరణాల విక్రయశాలలకు వెళ్లాడు. ఎక్కడకు వెళ్లినా, ఆభరణం బిల్లు కొటేషన్ చూస్తే, ధర పరంగా తమ ప్రాంతం స్థాయిలోనే ఉంది. మరి ప్రకటనలకు, వాస్తవ ధరలకు తేడా ఎక్కడొచ్చిందంటే.. కొన్ని ప్రాంతాల్లోని ఆభరణాల విక్రయదారులు జీఎస్టీ కలపకుండా బంగారం ధరను ప్రకటిస్తున్నందునే, తక్కువ ఉన్నట్లు కనపడుతోంది.
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే
బంగారం, వెండి.. వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే, ఇక్కడా పెరుగుతుంది.. తగ్గినా అంతే.. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున, డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. జీఎస్టీ రేటు దేశం మొత్తం ఒకటే ఉంటుంది కనుక ధరలో పెద్దగా తేడా రాదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, స్థానిక టోకు వ్యాపారులకు మేలిమి బంగారం బిస్కెట్లు, వెండి దిమ్మలు అందించే బ్యాంకుల వంటి సంస్థలు విధించే ఛార్జీలు, రవాణా ఛార్జీలు, ఇతర వ్యయాల రూపేణ స్వల్పతేడాలు మాత్రమే ఉంటాయి.
ఎంఆర్పీ ఉండదు కనుక
ఒక వస్తువు గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్పీ)లో అన్ని పన్నులు కలుపుకుని ఉంటాయి. అంతకుమించి విక్రయించకూడదు. బంగారం ధర మార్కెట్ ప్రకారమే నడుస్తుంది. పన్నులు-సుంకాలు కలిపి చూపిన ప్రాంతాల్లో బంగారం ధర అధికంగా ఉంటోంది.. కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ఆయా దుకాణాలు, విక్రయ సంస్థల సంఘాలు ప్రకటించినప్పుడు తక్కువగానే కనపడుతోంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది.
ఇలా చూసుకోవాలి
అంతర్జాతీయ విపణిలో మేలిమి (999 స్వచ్ఛత -24 క్యారెట్లు) బంగారం ధరను ఔన్సు (31.10 గ్రాముల)ల్లో లెక్కిస్తారు. ఇది శనివారం 1798.40 డాలర్లుగా ఉంది. డాలర్ విలువ రూ.81.43 కనుక, రూపాయల్లో ఔన్సు బంగారం ధర రూ.1,46,444 అవుతుంది. అంటే గ్రాము సుమారు రూ.4708గా తేలుతుంది. దీనికి కస్టమ్స్, ఇతర సుంకాలు 15 శాతం, 3 శాతం జీఎస్టీ అంటే మొత్తం 18 శాతం పన్నులను కలిపి గ్రాము రూ.5530 అవుతుంది. అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55300 గా చెప్పాలి. కొన్ని సంఘాలు మాత్రం 3 శాతం జీఎస్టీని కలపకుండా రూ.53,700గా ప్రకటిస్తున్నారు. అందువల్ల బిల్లుతో కొంటే, ధరలో తేడానే రాదు.
ఆభరణాల లెక్క ఇలా
బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,300 అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,654 అవుతుంది. అంటే గ్రాము ఆభరణం ధర రూ.5065 అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సెవరు (8 గ్రాముల) లెక్క ఎక్కువగా చూస్తుంటారు. అంటే రూ.40,520 అవుతుంది. మనకు దుకాణాల్లో ఆభరణాల బంగారం గ్రాము ధర ఇంతకన్నా తక్కువ అని చెప్పినా, బిల్లింగ్లో 3 శాతం జీఎస్టీ చెల్లించక తప్పదు. అందువల్ల ధర తక్కువగా ఉందని వెళ్లి, ఉసూరు మనకూడదంటే, ముందుగా ధరలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం మేలు.
తరుగు/వ్యాల్యూ యాడెడ్ భారమే అధికం
చెవి రింగుల నుంచి వడ్డాణం వరకు ఆభరణం ఏది తీసుకున్నా, తరుగు, మజూరీ (మేకింగ్ ఛార్జీ) లేదా వ్యాల్యూయాడెడ్ కింద 8-36 శాతం వరకు కూడా ఆభరణాల విక్రయ సంస్థలు వసూలు చేస్తుంటాయి. అంటే మనం 10 గ్రాముల బంగారు ఆభరణం కొనేందుకు మరో (0.8-3.6 గ్రాముల) బంగారానికి వాళ్లకు డబ్బులు చెల్లిస్తున్నాం అన్న మాట. ఇవి కలిపాకే జీఎస్టీ కూడా వసూలు చేస్తే, మనకు మరింత నష్టం తప్పదు. తరుగు అంటే మనకు రాని బంగారం, దీనిపైనా జీఎస్టీ వసూలు చేయడం తగదనే వినియోగదారుల సంఘాలు పేర్కొంటున్నాయి.
జీఎస్టీ కట్టాల్సిన బాధ తప్పుతుందని బిల్లు లేకుండా కొంటే..
కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే, ఒకవేళ బంగారం నాణ్యత సరిగా లేకుంటే, భారీగా నష్టపోక తప్పదు. ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరు. పైగా బంగారం విలువలో అప్పటికే జీఎస్టీ కలిపి ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి.
* బంగారం ధర తెలుసుకునేందుకు క్యాప్స్గోల్డ్, ఎస్వీబీసీ, డీపీగోల్డ్ వంటి బులియన్ ట్రేడింగ్ వెబ్సైట్లను పరిశీలించొచ్చు. వీటిల్లో పన్నులన్నీ కలిపిన ధరలు కనపడుతుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM