పైకి ఆంక్షల కొరడా.. లోన కొనుగోళ్ల వరద
పుతిన్కు గట్టిగా బుద్ధి చెప్పాలి...రష్యాను ఏకాకిని చేయాలి...వారి ఆర్థిక వ్యవస్థను అల్లాడించాలి...యుద్ధానికి డబ్బులేకుండా చేయాలి...అంటూ అమెరికా, ఐరోపా మిత్రదేశాలు రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి.
కోపగిస్తూనే రష్యాతో వ్యాపారం చేస్తున్న పాశ్చాత్య దేశాలు
అందులో ఐరోపాదే అగ్రభాగం
పుతిన్కు గట్టిగా బుద్ధి చెప్పాలి...
రష్యాను ఏకాకిని చేయాలి...
వారి ఆర్థిక వ్యవస్థను అల్లాడించాలి...
యుద్ధానికి డబ్బులేకుండా చేయాలి...
అంటూ అమెరికా, ఐరోపా మిత్రదేశాలు రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. వీటి దెబ్బకు రష్యా ఆర్థికంగా కుప్పకూలి కాళ్లబేరానికి వస్తుందనుకున్నాయి. రోజుకో ఆంక్షల పేరుతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమై 10 నెలలు కావస్తున్న వేళ... మరి ఆంక్షలు ప్రభావం చూపించాయా? రష్యా వాణిజ్యం దెబ్బతిందా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తోంది. కారణం- ఆంక్షలు విధించిన ఐరోపా, అమెరికాలే మాస్కో వాణిజ్యాన్ని నిలబెడుతున్నాయి. ఒకవంక ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తూ... మరోవైపు రష్యా నుంచి సింహభాగం గ్యాస్, చమురు ఇతర కొనుగోళ్లు చేస్తూ ఆ దేశ ఖజానాను కళకళలాడిస్తున్నాయి.
సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ, క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) అనే ఐరోపా స్వచ్ఛంద పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం... రష్యా ఆర్థిక వ్యవస్థ యుద్ధ సమయంలో, ఆంక్షల కాలంలోనూ సజావుగానే సాగుతోంది. దీనికంతటికీ మూలకారణం- ఐరోపా దేశాల చమురు, గ్యాస్ అవసరాలే! వాటికోసం ఆ దేశాలు రష్యాపై ఆధారపడి ఉండటమే! ఆంక్షల కారణంగా విదేశాలకు రష్యా నుంచి వివిధ వస్తువుల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. అయినా వారి ఖజానా మాత్రం గలగలమంటోంది. ఎందుకంటే... శిలాజ ఇంధనాల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగటమే. రష్యా ఆదాయం శిలాజ ఇంధనాల (ముడిచమురు, పైప్లైన్ గ్యాస్, చమురు ఉత్పత్తులు, ఎల్ఎన్జీ గ్యాస్, బొగ్గు) అమ్మకాల ద్వారా వస్తుంది. నిరుటితో పోలిస్తే... గత 8 నెలల్లో రష్యా సగటు ఎగుమతుల ధరలు 60 శాతం ఎక్కువగా ఉన్నాయనేది సీఆర్ఈఏ అంచనా! ఈ నివేదిక ప్రకారం...
* ఆంక్షలు విధించిన తొలి నాళ్లలోనే రష్యా విక్రయించిన శిలాజ ఇంధనాల్లో ఐరోపా సమాఖ్య వాటా 61 శాతం. వీటి విలువ 60 బిలియన్ డాలర్లు!
* మార్చిలో ఆంక్షలు విధించగా... ఇప్పటిదాకా ఐరోపా సమాఖ్యకు ఇంధన ఎగుమతులు రష్యా నుంచి సాగుతూనే ఉన్నాయి.
* రష్యా నుంచి వస్తున్న వందలాది ఎల్ఎన్జీ (గ్యాస్) ఓడలు ఐరోపాలోని అనేక రేవుల్లో దర్శనమిస్తున్నాయి. వస్తోంది రష్యా నుంచని తెలిసి కూడా ఆ గ్యాస్ కోసం ఐరోపా దేశాలన్నీ ఆవురావురుమంటున్నాయి. శీతాకాలపు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రష్యా నుంచి భారీగా కొనుగోళ్లు చేశాయి.
* చలికాలంలో తమ అవసరాలకు తగినంత ఇంధనాన్ని సమకూర్చుకొని, నిల్వలు నిండిపోయాక, ఇక దాచి పెట్టుకోవటానికి వీలులేదనే స్థితికి వచ్చాక ఇప్పుడు సోమవారం (డిసెంబరు 5) చివరి నుంచి రష్యా ముడి చమురు దిగుమతిని ఆపేస్తున్నట్లు ప్రకటించాయీ దేశాలు. రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులను ఫిబ్రవరి తర్వాత నిలిపేస్తామని చెబుతున్నాయి.
* 2022 ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు దాకా ఇంధన ఎగుమతుల ద్వారా రష్యా 158 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. ఇందులో ఐరోపా దేశాల ఇంధన దిగుమతుల విలువ 100 బిలియన్ యూరోలు దాటింది.
* సగటున రోజూ 260 మిలియన్ యూరోల మేర ఐరోపా దేశాలు రష్యా నుంచి కొనుగోళ్లు చేస్తున్నాయి.
* తాజాగా గత నెలలో రష్యా చమురు ఎగుమతుల్లో భారీ పెరుగుదల నమోదైంది. కారణం... ఐరోపా! 2021 నవంబరులో కంటే ఎక్కువ మొత్తంలో రష్యా నుంచి చమురును ఐరోపా దేశాలు ఈ నవంబరులో కొనుగోలు చేశాయి. ముఖ్యంగా జర్మనీ, ఇటలీలు భారీస్థాయిలో కొన్నాయి.
* వీటితో పాటు చైనా, భారత్, యుఏఈ, తుర్కియే, మలేసియా, సింగపూర్లు కూడా పెద్దమొత్తంలో చమురును రష్యా నుంచి కొనుగోలు చేశాయి. ధరలు తగ్గినా... రష్యా ఒక్క నవంబరులోనే 18 బిలియన్ డాలర్ల మేర చమురును ఐరోపా బయట అమ్మగలిగింది.
* రష్యా ముడి చమురు కొనుగోలును తాజాగా డిసెంబరు 5 నుంచి ఐరోపా, అమెరికాలు నిషేధించాయి. కానీ అదే రష్యా ముడి చమురు తుర్కియేకి చేరి, అక్కడి కర్మాగారాల్లో శుద్ధి అయి వివిధ రూపాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటోంది. దాన్ని ఐరోపా, అమెరికాలు కొనుగోలు చేస్తుండటం విశేషం.
డిస్కౌంట్ ఇచ్చి మరీ...
* అమెరికా, ఐరోపాలు ఆంక్షలు విధించటంతో రష్యా కొత్త దారులు వెదుక్కుంది. తన మిత్రదేశాలైన చైనా, భారత్, తుర్కియేలకు భారీ డిస్కౌంట్లు ఇచ్చింది. దీంతో ఈ దేశాలు కూడా భవిష్యత్ అవసరాలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని గతంకంటే ఎక్కువ మొత్తంలో రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నాయి.
* 2021లో ఏడాదంతా కలపి 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేసిన భారత్... ఈసారి ఆరునెలల్లోనే 60 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకుంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
-
జగన్.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు
-
క్రూడాయిల్ దిగుమతుల బిల్లు తగ్గింది, కానీ..!
-
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
-
ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన కారు.. 10 మంది దుర్మరణం