Digital rupee: డిజిటల్ రూపాయితో యూపీఐకి మించి ప్రయోజనాలు
డిజిటల్ రూపాయిని వ్యక్తిగత అవసరాలకూ వినియోగించే ప్రయోగాత్మక ప్రాజెక్టును ఆర్బీఐ 4 నగరాల్లో ప్రారంభించింది.
ఈనాడు వాణిజ్య విభాగం
డిజిటల్ రూపాయిని వ్యక్తిగత అవసరాలకూ వినియోగించే ప్రయోగాత్మక ప్రాజెక్టును ఆర్బీఐ 4 నగరాల్లో ప్రారంభించింది. ఇప్పటికే మన బ్యాంక్ ఖాతాలో నగదు ఉంటే, ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆన్లైన్లో అత్యంత సులువుగా చేసేందుకు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వీలు కల్పిస్తోంది. డిజిటల్ రూపాయితో అంతకన్నా అదనపు ప్రయోజనాలున్నాయా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది.
‘భారతీయులు యూపీఐ పద్ధతిలో టీ బడ్డీ నుంచి వాహన షోరూంల వరకు చెల్లింపులు తక్షణం, సులభంగా, సురక్షితంగా చేయగలుగుతున్నారు. క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. అందువల్ల రిటైల్ డిజిటల్ రూపాయి (ఇRs-ఆర్)/ కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై అంతగా ఆసక్తి కనబడకపోవచ్చ’ని ఐఎమ్ఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) తాజా నివేదికలో పేర్కొంది. అయితే విదేశీ వాణిజ్యాన్ని సాధ్యమైన మేర రూపాయల్లో నిర్వహించుకుంటే, విదేశీ మారక ద్రవ్య రూపేణ వ్యయాలు ఆదా అవుతాయనే భావన ఉంది. ఈ ప్రక్రియను డిజిటల్ రూపాయి మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు.
* దేశీయంగా యువతలో 84% మంది; మొత్తం ప్రజల్లో 76% మంది యూపీఐని వినియోగిస్తున్నారు. లావాదేవీకి అదనపు వ్యయం లేకపోవడం ఇందులో ప్రధాన ఆకర్షణ. అదే కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే, చార్జీలు పడుతున్నాయి.
అదనపు ప్రయోజనాలు ఇలా
1) నోట్లు, నాణేలకు ప్రత్యామ్నాయంగా, అదే విలువ కలిగిన డిజిటల్ రూపాయలు లభిస్తాయి. బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకున్నట్లే వీటిని బ్యాంక్ ఖాతా నుంచి ఉపసంహరించి, డిజిటల్ (ఇ) వాలెట్ రూపంలో మొబైల్ఫోన్లో నిల్వ చేసేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. అందువల్ల ఖాతాతో పని లేకుండా, లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
* ప్రస్తుతం రెండు బ్యాంకుల్లో ఖాతాలుంటే, ఆ ఖాతాల్లోని నగదు ఆధారంగా వేర్వేరు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. డిజిటల్ రూపాయలైతే, రెండు బ్యాంకు ఖాతాల నుంచి ఒకే ఇ-వాలెట్కు బదిలీ చేసుకోవచ్చు.
2) వేరేవారి కార్డు ద్వారా ఏటీఎం నుంచి నగదును మోసపూరితంగా అపహరిస్తే, ఆ నగదు ఎక్కడకు చేరిందో గుర్తించడం కష్టం. డిజిటల్ వాలెట్ ద్వారా ప్రతి రూపాయిని పర్యవేక్షించుకోవచ్చు. ఏ లావాదేవీకి ఎంత వాడారో తెలిసిపోతుంది.
3) పేటీఎం, గూగుల్ పే, ఫోన్పేతో పోలిస్తే..
ప్రస్తుతం ఒక బ్యాంక్ ఖాతా నుంచి వేరొక బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీకి ప్రయత్నించారనుకుందాం. ఈ నగదు బదిలీ కాకపోతే, ఎవరి వైఫల్యమో సంబంధిత బ్యాంక్ కాంటాక్ట్ నెంబరును కనుక్కుంటే తెలిసిపోతుంది. సంబంధితులను సంప్రదిస్తే, సత్వరం మన ఖాతాకు నగదు చేరుతుంది. ఖాతాలకు సంబంధించిన వివరాలన్నీ నమోదై ఉండటం వల్ల, ఈ లావాదేవీల్లో వైఫల్యం తక్కువ. డిజిటల్ రూపాయలు కూడా సార్వభౌమ నిధి కనుక, లావాదేవీలకు బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. వాలెట్ నుంచి వాలెట్కు లావాదేవీ జరుగుతుంది కనుక నగదు చేతికి అందించినంత సులభంగా ఇది ఉంటుంది. లావాదేవీల వ్యయాలు సైతం తగ్గుతాయని అంచనా.
* అదే పేటీఎం, ఫోన్పే వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసినప్పుడు.. ముందుగా మన బ్యాంక్ ఖాతాకు చెల్లింపు అభ్యర్థన వెళ్తుంది. అక్కడ నుంచి ఎవరికి చెల్లింపు జరగాలో, ఆ బ్యాంక్ ఖాతాకు సమాచారం, నగదు బదిలీ అవ్వాలి. ఇందుకు మధ్యవర్తిత్వ సంస్థలుంటాయి. లావాదేవీ విఫలమైతే, సంబంధిత యాప్లను సంప్రదించమని బ్యాంకులు చెబుతున్నాయి.
4) డిజిటల్ రూపాయలతో పన్నుల వంటివీ చెల్లించవచ్చు. లావాదేవీలకు ఎటువంటి రుసుములు ఉండవు.
5) అంతర్జాతీయ లావాదేవీలకు..: ప్రస్తుతం విదేశాల్లో కుటుంబీకులు ఉండటం సాధారణమైంది. విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తున్నారు. వారికి అంతర్జాతీయ నగదు బదిలీలను సైతం డిజిటల్ కరెన్సీ రూపంలో సులువుగా జరపొచ్చు. రూపాయల్లో ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరిపేందుకూ డిజిటల్ రూపాయి ఉపయోగ పడుతుంది.
6) రూ.5000 కోట్ల ఆదా?: ఏటా నగదు ప్రింటింగ్కు రూ.5,000 కోట్ల ఖర్చు అవుతోంది. పైగా కాగితం తయారీ కోసం వేలకొద్దీ చెట్లు నరకాల్సి వస్తోంది. భారీ స్థాయిలో ఇంకు వినియోగం జరుగుతోంది. ఈ ఇంకును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. డిజిటల్ కరెన్సీకి మారితే వీటిలో అధికభాగం ఆదా అవుతుంది.
ఎలా ఉపయోగించొచ్చు..
డిజిటల్ రూపాయల కోసం సీబీడీసీ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మన బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరుతోనే దీనిలో వివరాలు నమోదు చేసుకోగలం. తదుపరి డిజిటల్ వాలెట్, యునీక్ ఐడీ మనకు క్రియేట్ అవుతుంది. దీనిలోకి మన ఖాతా నుంచి నగదును కోరుకున్న డినామినేషన్లో జమ చేసుకోవచ్చు. రూ.500 విలువకు సమానవైనవి ఎన్ని, రూ.100, రూ.50, రూ.10 ఇలా మన అవసరం మేర జమ చేసుకోవచ్చు. వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి చెల్లింపులు చేయొచ్చు. క్యూఆర్ కోడ్లనూ ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ రూపాయిని వాణిజ్య బ్యాంకుల ద్వారా నగదు రూపంలోకీ మార్చుకోవచ్చు.
క్రిప్టోకు దీనికి తేడా ఏమిటి?
క్రిప్టోకరెన్సీలపై ఎటువంటి నియంత్రణ ఉండదు. మనీ లాండరింగ్కు, ఉగ్రవాదులకు నిధులు అందించేందుకు వీలుంటుంది. ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థనే ఇవి సృష్టిస్తాయి. సీబీడీసీ అధీకృత కరెన్సీ కనుక ఆర్థిక వ్యవస్థ పరిధిలోనే ఉంటుంది. ప్రజలకు ఎటువంటి నష్టభయం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు