Budget 2023: రైల్వేకు రూ.2.42 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్లో రైల్వేకు మూలధన కేటాయింపులు ఈసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. మునుపెన్నడూ లేనిరీతిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు కింద రూ.2.42 లక్షల కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఇదో కొత్త రికార్డు
100 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.90,000 కోట్లు
35 హైడ్రోజన్ రైళ్లు, 5 వేల ఎల్హెచ్బీ పెట్టెల తయారీ
అధునాతనంగా మారనున్న వెయ్యి కోచ్లు
కొత్తగా మరో 100 విస్టాడోమ్లు
వందేభారత్లకు వీలుగా పట్టాల పునరుద్ధరణ
దిల్లీ: కేంద్ర బడ్జెట్లో రైల్వేకు మూలధన కేటాయింపులు ఈసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. మునుపెన్నడూ లేనిరీతిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు కింద రూ.2.42 లక్షల కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2013-14తో పోలిస్తే ఇది 9 రెట్లు అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.లక్ష కోట్లు ఎక్కువ. 2022-23లో రూ.1.40 లక్షల కోట్లు కేటాయించారు. దీనిలో రూ.1.37 లక్షల కోట్లు మూలధన వ్యయం. మిగిలినది రెవెన్యూ వ్యయం. నూతన ఆర్థిక సంవత్సరంలో రవాణా రంగంలో 100 కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టనున్నారు. బొగ్గు, ఎరువులు, ఆహారధాన్యాలు వంటివి ఎక్కడివరకు కావాలంటే అక్కడి వరకు చేరవేయడానికి ఇవి దోహదపడతాయి. రూ.15,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సహా రూ.75,000 కోట్లు దీనికి ఖర్చవుతుందని అంచనా. మెట్రో స్టేషన్లను రైల్వేస్టేషన్ ప్రాజెక్టులతో సమీకృతపరచడం సహా వినియోగదారుల సదుపాయాలపై రూ.500 కోట్లు వెచ్చించనున్నారు. రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్సఫర్, తేజస్ వంటి ప్రీమియం రైళ్లలో వాడేందుకు వెయ్యి రైలు పెట్టెలను సమూలంగా మార్చి, అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే 35 రైళ్లను, ఆటోమొబైల్ పరిశ్రమకు ఉపయోగపడేలా 4,500 నూతన పెట్టెల్ని, 5,000 ఎల్హెచ్బీ పెట్టెల్ని, 58 వేల వ్యాగన్లను తయారు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పారదర్శక అద్దాలు ఉండే ఆకర్షణీయ విస్టాడోమ్ కోచ్లు మరో 100 తయారు చేయించనున్నారు. వందేభారత్ రైళ్ల సంఖ్యను, వాటి వేగాన్ని పెంచడానికి వీలుగా పట్టాల పునరుద్ధరణకు నిధుల కేటాయింపును గత బడ్జెట్ కంటే దాదాపు రూ.1900 కోట్లు పెంచారు.
మెట్రో ప్రాజెక్టులకు రూ.19,518 కోట్లు
నగరాల్లో మంచి ఆదరణ పొందుతున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.19,518 కోట్లు కేటాయించారు. 22-23 ఆర్థిక సంవత్సరంలో రూ.19,130 కోట్లు దీనికి కేటాయించినా, సవరించిన అంచనాల్లో రూ.15,628 కోట్లకు తగ్గించారు. వచ్చే ఏడాదికి కేటాయింపుల్లో ఈక్విటీ పెట్టుబడుల రూపంలో రూ.4,471 కోట్లు, రుణాల ద్వారా రూ.1,324 కోట్లు సమీకరిస్తారు. దేశంలో తొలిసారిగా ‘ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ’ (ఆర్ఆర్టీఎస్) చేపట్టడానికి ‘జాతీయ రాజధాని ప్రాంత రవాణా సంస్థ’ (ఎన్సీఆర్టీసీ)కు రూ.3,596 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. గత బడ్జెట్ కంటే ఇది 23% తక్కువ. దిల్లీ- గాజియాబాద్- మేరఠ్ నడవాలో ఈ పనులు చేపడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్