చిన్న కమతాలకూ మర యంత్రాలు
వ్యవసాయంలో కీలకం సస్యరక్షణ. అధిక మొత్తంలో ఖర్చయ్యేది ఇక్కడే. కలుపు తీయడం దగ్గర్నుంచి, పురుగు మందులు పిచికారీ చేయడం వరకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.
ఈనాడు - హైదరాబాద్
వ్యవసాయంలో కీలకం సస్యరక్షణ. అధిక మొత్తంలో ఖర్చయ్యేది ఇక్కడే. కలుపు తీయడం దగ్గర్నుంచి, పురుగు మందులు పిచికారీ చేయడం వరకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇందుకు కూలీలను పెట్టుకోవాలంటే, అధికంగా చెల్లించాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న యంత్రాలనేమో చిన్న రైతులు వాడలేరు. చిన్న కమతాలకూ పనికివచ్చే యంత్రాలను రూపొందించాలన్న ఆలోచన నుంచి పుట్టిన అంకురమే ఎక్స్మెషీన్స్ అని సంస్థ వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ కుమార్ ‘ఈనాడు’కు తెలిపారు. తమ సంస్థ గురించి ఆయన మాటల్లోనే..
‘నేను హాంకాంగ్లో మెకట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. చదువుకుంటున్న సమయంలో, మన దేశంలో రైతుల ఆత్మహత్య వార్తలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులు ఇందుకు కారణం. విత్తడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగు మందు పిచికారీ చేసేందుకు కూలీల అవసరం ఉంటుంది. కొన్నిచోట్ల వీరి లభ్యతా కష్టంగా మారింది. ఈ కష్టాలకు పరిష్కారంగా రోబోలను రూపొందించాలని నిర్ణయించుకున్నాను. రోబోటిక్స్ తయారీలో అనుభవం సాధించేందుకు హాంకాంగ్లో ఒక కంపెనీలో రెండేళ్లు పనిచేసి, తర్వాత ఇక్కడికి వచ్చేశాను’ అని తెలిపారు.
చిన్న రైతుల కోసం..
‘వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా, అవన్నీ పెద్ద రైతులకు ఉపయోగపడేవే. ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు కలుపు తీయడం కోసం ట్రాక్టర్లను వినియోగించలేరు. ఇందుకోసమే చిన్న ట్రాక్టర్ రోబోను రూపొందించడం ప్రారంభించా. ఈ దశలోనే నాకు ధర్మతేజ, వినీల్ రెడ్డి తోడయ్యారు. మేం ముగ్గురం కలిసి 2017లో ఎక్స్మెషీన్స్ ప్రారంభించాం. పూర్తిగా దేశీయంగా దొరికే విడిభాగాలతోనే ఆ యంత్రాన్ని రూపొందించాం’ అన్నారు.
ఏం చేస్తుందంటే...
‘బ్యాటరీతో నడిచే ఈ విద్యుత్ యంత్రం పంటకు ఏమాత్రం నష్టం కలుగకుండా కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగు మందు పిచికారీ చేయడం, గడ్డిని కోయడంలాంటి పనులన్నీ చేస్తుంది. ప్రధాన మైక్రో ట్రాక్టర్కు అనుబంధంగా ఆయా పరికరాలను బిగించుకుంటే సరిపోతుంది. పంట మధ్యలో రెండు అడుగుల ఖాళీ ప్రదేశం ఉంటే చాలు. కృత్రిమ మేధతో ఈ యంత్రాన్ని యాప్తో నియంత్రించొచ్చు. మిరప, పత్తి, పొగాకు తదితర పంటల్లో దీన్ని సులభంగా వినియోగించుకోవచ్చు. సౌర విద్యుత్ కేంద్రాల్లోనూ ఈ పరికరాన్ని వాడుకునేలా రూపొందించాం. పార్కులు, క్రీడా మైదానాల్లోనూ వాడుకోవచ్చు’ అని వివరించారు.
అద్దెకు ఇచ్చేలా..
‘ఈ యంత్రం ఖరీదు రూ.1.75 లక్షల (పన్నులు అదనం) వరకు ఉంటుంది. చిన్న రైతులు ఇంత పెట్టి కొనలేరు కనుక, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఎంపిక చేసుకుని, వారికి బ్యాంకు రుణాలతో దీన్ని అందిస్తున్నాం. వారు దీన్ని అద్దెకు తిప్పడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలవుతుంద’న్నారు.
ఐఎస్బీ నుంచి నిధులు..
‘తొలుత సొంత నిధులతోనే సంస్థను ప్రారంభించాను. తర్వాత బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాం. మా ఆలోచన నచ్చిన ఐఐఐటీ హైదరాబాద్ నుంచి రూ.14 లక్షలు, ఐఎస్బీ హైదరాబాద్ నుంచి రూ.25 లక్షల పెట్టుబడి సంపాదించాం. మా యంత్రాన్ని ఒక విదేశీ యూనివర్సిటీ రోబోటిక్స్పై పరిశోధన కోసం తీసుకుంది. భారీ యంత్రాలను ఉత్పత్తి చేసే ఒక సంస్థ, మా యంత్రాన్ని పరిశీలించేందుకు కొనుగోలు చేసింది. రానున్న ఏడాది కాలంలో మొత్తం 100కు పైగా యంత్రాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నాం. కొత్తగా ఉద్యోగులనూ నియమించుకుంటాం. ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేయబోతున్నాం. చిన్న యంత్రాలతో వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించాలన్నదే మా లక్ష్యం’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.