అద్దెకు విద్యుత్ వాహనాలు
విద్యుత్తు వాహన మోడళ్లు సరికొత్తగా విపణిలోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్ బైక్ను వదిలేసి, విద్యుత్తు మోడల్ కొందామన్నా, ఒకేసారి డబ్బు పెట్టి కొనలేని స్థితి ఎందరిదో.
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు వాహన మోడళ్లు సరికొత్తగా విపణిలోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్ బైక్ను వదిలేసి, విద్యుత్తు మోడల్ కొందామన్నా, ఒకేసారి డబ్బు పెట్టి కొనలేని స్థితి ఎందరిదో. పనుల నిమిత్తం వారం, పది రోజుల పాటు ద్విచక్ర వాహనం కావాలనుకునేవారు మరికొందరు.. ఇలాంటి వారికి పరిష్కారం చూపాలనే ఆలోచనతో వచ్చిన అంకురమే హాలా మొబిలిటీ. విద్యుత్ వాహనాలను కొనక్కర్లేకుండా.. కావాల్సినన్ని రోజులకు అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పించడమే తమ లక్ష్యం అని చెబుతున్నారు ఈ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్ రెడ్డి కలకొండ. తమ సంస్థ గురించి ఇలా వివరిస్తున్నారు.
‘బీటెక్ పూర్తయ్యాక విదేశాలకు వెళ్లాను. మాస్టర్స్ పూర్తయ్యాక షేర్డ్ మొబిలిటీ అంశంపై పీహెచ్డీ చేశాను. అప్పుడే పలు సంస్థలతో కలిసి పని చేశాను. ఈ సమయంలో వాహనాల అవసరం ఎలా ఉంటోంది? అద్దెకు తీసుకుంటున్న వారి పరిస్థితులేమిటి.. అనే అంశాలు పరిశీలించా. మంచి మార్కెట్ ఉన్న మన దేశంలోని అవకాశాలనూ అధ్యయనం చేశా. ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకున్నాకే, మా అంకురాన్ని మొదలుపెట్టాం. నాతోపాటు ఆనంద్ పరీక్, స్నేహిత్ రెడ్డి మేడ సహ వ్యవస్థాపకులుగా 2019లో హాలా మొబిలిటీని ప్రారంభించాం. హాలా అంటే స్పానిష్లో అద్భుతం అని అర్థం. 2020 నవంబరులో మా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో సొంత డబ్బులతోనే సంస్థను ప్రారంభించాం. మొదట మెట్రో స్టేషన్ల వద్ద ఇ-స్కూటర్లను అందుబాటులో పెట్టి, అద్దెకు ఇవ్వాలని అనుకున్నాం. కొన్ని ఇబ్బందులు ఎదురైనందున, మా వ్యాపారాన్ని మార్చుకున్నాం. 150 మందికి పైగా డెలివరీ బాయ్స్ను తీసుకుని, వారికి ఇ-స్కూటర్లను ఇచ్చి, కొన్ని ఇ-కామర్స్ సంస్థలతో కలిసి పనిచేశాం. కానీ, ఇది మా లక్ష్యానికి దూరంగా వెళ్తున్నట్లు గమనించాం. సొంతంగా సిబ్బందిని తీసుకోకుండా ఇ-కామర్స్ సంస్థల దగ్గర ఉన్న డెలివరీ సిబ్బందికి వాహనాలు అందించాలని అనుకున్నాం. ఇలా మా పంథాను మరోసారి మార్చుకున్నాం.
వినియోగదారులు ఇలా చేయాలి
మా మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, కేవైసీ పూర్తి చేయాలి. డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారికి, లేని వారికి వేర్వేరు వాహనాలు కనిపిస్తాయి. సమీపంలో ఉన్న మా స్టేషన్ నుంచి వాహనాన్ని తీసుకుని, వాడుకోవచ్చు. కనీసం వారం రోజుల నుంచి 11 నెలల కాలానికి వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు. సొంతంగా కొనాలని అనుకుంటే, రుణం అందిస్తున్నాం. విద్యుత్ వాహనాల్లో వారానికో కొత్త సాంకేతికత వస్తున్న రోజులివి. కాబట్టి, చాలామంది అద్దెకు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
పెట్టుబడులూ వచ్చాయి..
వాహనాలను అద్దెకు ఇవ్వడం ప్రారంభించాక, టి-హబ్కు చెందిన టి-ఏంజెల్స్ నుంచి రూ.8 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇటీవలే మరో రూ.8 కోట్లను సమీకరించాం. సెప్టెంబరు నాటికి రూ.65 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. సరకు రవాణా విభాగంలో విద్యుత్ ఆటోలను ప్రవేశ పెట్టాలి. అద్దె కార్లను అందుబాటులోకి తీసుకురావాలి. ఇవీ మేము నిర్ణయించుకున్న భవిష్యత్ లక్ష్యాలు.
20 వాహనాలతో మొదలు
టి-హబ్ కేంద్రంగా మా సంస్థను ప్రారంభించినప్పుడు తొలుత 20 వాహనాలు కొనుగోలు చేశాం. క్రమంగా ఈ సంఖ్య పెంచుకుంటూ వచ్చాం. ప్రస్తుతం మా దగ్గర 2000కు పైగా వాహనాలున్నాయి. మరో ఏడాదిలో ఈ సంఖ్యను 5000కు చేర్చాలనేది లక్ష్యం. మా దగ్గర ప్రస్తుతం 78 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో వీరి సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు విశాఖపట్నం, చెన్నై, ముంబయి, పుణెల్లో సేవలందిస్తున్నాం. త్వరలోనే ఇతర నగరాలకు విస్తరిస్తాం. కార్పొరేట్ సంస్థలతోనూ కలిసి పనిచేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల
ఒక టెక్ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఆవిష్కరణతో యాపిల్ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు. -
సాగు సాయం అంతంతే!
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. -
‘లఖ్పతి’తో లక్షార్జన!
స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లకు సంబంధించిన ‘లఖ్పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. -
ఆదాయపు పన్ను ఏం మారలే!
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. -
కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు
దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
రక్షణకు ఓ మోస్తరు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్