ఆదాయపు పన్నురిటర్నులు ఎందుకంటే
ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చారా? మీ సంస్థ మీ వేతనం నుంచి మూలం వద్ద పన్ను (టీడీఎస్) మినహాయించిందా? మీరు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిందే
ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చారా? మీ సంస్థ మీ వేతనం నుంచి మూలం వద్ద పన్ను (టీడీఎస్) మినహాయించిందా? మీరు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిందే. చాలామంది రిటర్నులు దాఖలు చేయకపోతే ఏమవుతుంది? అని అడుగుతుంటారు.. దీనికి సమాధానాలు తెలుసుకుందామా...
గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2022-23కు సంబంధించిన రిటర్నులు దాఖలు చేసేందుకు సమయం ఆసన్నమయ్యింది. సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ జులై 31 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెబుతుంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గడువు పొడిగించే అవకాశం ఉండొచ్చు. కానీ, తప్పనిసరేమీ కాదు. ఈ నేపథ్యంలో గడువు తేదీ జులై 31 లోపే రిటర్నులు పూర్తి చేసేయడం మేలు.
* రిఫండు కోసం..: మీకు మూలం వద్ద పన్ను కోత అధికంగా ఉందనుకోండి.. నిబంధనల మేరకు ఆ మొత్తాన్ని రిఫండు రూపంలో పొందేందుకు అవకాశం ఉంటుంది. రిటర్నులను గడువులోపే దాఖలు చేస్తే, వడ్డీ సహా ఆదాయపు పన్ను శాఖ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఒకవేళ మీరు పన్ను చెల్లించాల్సి ఉండి, గడువు తేదీని మీరితే.. వడ్డీతోపాటు, అపరాధ రుసుమూ వర్తిస్తుంది.
* రుణాలు తీసుకునేందుకు: బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను ఇచ్చేందుకు కనీసం మూడేళ్ల ఫారం-16, పన్ను రిటర్నులను ఆదాయానికి ఆధారాలుగా అడుగుతాయి. కాబట్టి, ఏటా తప్పనిసరిగా రిటర్నులు సమర్పించాల్సిందే. రిటర్నులు లేకపోతే గృహరుణం లాంటివి తీసుకోవడం కష్టం అవుతుంది.
* వీసా కావాలన్నా: అమెరికా తదితర దేశాలకు వీసా కావాలనుకుంటే.. ఆదాయపు పన్ను రిటర్నులను అడిగే అవకాశం ఉంది. మీ ఆదాయానికి ధ్రువీకరణగా ఇది పనికొస్తుంది. వీసా దరఖాస్తుతోపాటు రిటర్నులు తప్పనిసరేం కాదు. కాకపోతే.. సులభంగా వీసా వచ్చేందుకు వీలుంటుంది.
* నష్టాల సర్దుబాటు: ఆస్తులు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు విక్రయించడం ద్వారా వచ్చిన దీర్ఘకాలిక మూలధన నష్టాలను భవిష్యత్తులో వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. దీనికోసం కచ్చితంగా గడువు తేదీ లోపు రిటర్నులు దాఖలు చేయాల్సిందే. ఒకవేళ పన్ను వర్తించే ఆదాయం లేకపోయినా, పైన పేర్కొన్న నష్టాలు ఉన్నప్పుడు రిటర్నులు సమర్పించాలి.
* గడువు తేదీ దాటితే: గడువు తేదీ దాటిన తర్వాతా రిటర్నులు దాఖలు చేయొచ్చు. కానీ, దీనికోసం అపరాధ రుసుము ఉంటుంది. రూ.5లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.1,000, అంతకు మించి ఉన్నప్పుడు రూ.5,000 వరకూ జరిమానా విధిస్తారు. డిసెంబరు 31 తర్వాత ఈ మొత్తం రూ.10వేలు ఉంటుంది.
వీలైనంత వరకూ గడువు తేదీ సమీపించక ముందే వర్తించే ఐటీ ఫారంలో రిటర్నులు దాఖలు చేయడం ఎప్పుడూ మేలు. తొందరగా రిఫండ్ రావడంతోపాటు, ఏదైనా పొరపాటు చేసినా, మళ్లీ రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Visakhapatnam: విశాఖలో తెదేపా మెరుపు నిరసన
-
Rahul Gandhi: బిలాస్పూర్ To రాయ్పూర్.. ట్రైన్లో ప్రయాణించిన రాహుల్
-
Singer Damini: బయటకు వెళ్తే నా పరిస్థితేంటో అర్థం కావటం లేదు: దామిని
-
Chandrababu Arrest: తెదేపా ఓ కుటుంబం.. కార్యర్తలు మా బిడ్డలు: భువనేశ్వరి
-
King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!
-
Demat accounts: ఊరిస్తున్న మార్కెట్లు.. పెరిగిన డీమ్యాట్ ఖాతాలు