లాభాలనిచ్చే సరికొత్త వ్యూహం...
స్టాక్ మార్కెట్లో విజయం సాధించేందుకు ఎన్నో మార్గాలు, వ్యూహాలు ఉంటాయి. సూచీలు పెరుగుతున్న వేళ.. నిష్క్రియాత్మక పెట్టుబడిని (ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్) ఎంచుకోవడం ద్వారా రాబడిని ఆర్జించడం ఇప్పుడు చాలామంది పాటిస్తున్న వ్యూహం. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు,
స్టాక్ మార్కెట్లో విజయం సాధించేందుకు ఎన్నో మార్గాలు, వ్యూహాలు ఉంటాయి. సూచీలు పెరుగుతున్న వేళ.. నిష్క్రియాత్మక పెట్టుబడిని (ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్) ఎంచుకోవడం ద్వారా రాబడిని ఆర్జించడం ఇప్పుడు చాలామంది పాటిస్తున్న వ్యూహం. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్లను ఇందుకోసం ఎక్కువగా పరిశీలిస్తున్నారు. దీనికి మరింత శక్తిని ఇచ్చే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ ఇప్పుడు సరికొత్త వ్యూహం. ప్రపంచంలో పలు మార్కెట్లలో ఇప్పటికే దీన్ని పాటించడం ప్రారంభించారు. మన దేశంలో ఈ వ్యూహం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.
పెట్టుబడి ప్రధాన లక్ష్యం.. మంచి రాబడిని సాధించడమే. ఇదే వ్యూహంతో ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పనిచేస్తుంది. మెరుగైన రాబడిని అందుకునేందుకు తోడ్పడే పెట్టుబడులను ఎంపిక చేసుకోవడమే దీని లక్ష్యం. ఫండమెంటల్ ఆధారంగా షేర్లను ఎంపిక చేసుకోవడం ఒక విధానమైతే.. షేర్ల ధరలను ఆధారంగా వాటి గమనాన్ని అర్థం చేసుకోవడం రెండోది. తక్కువ హెచ్చుతగ్గులు, ధరల కదలిక, విలువ, డివిడెండు చెల్లింపు, పేరు వంటి ఇతర అంశాలూ షేర్ల ఎంపికలో కీలకమే.
ఫ్యాక్టర్ ఆధారిత పోర్ట్ఫోలియోలో.. కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని, షేర్ల ఎంపిక జరుగుతుంది. ఉదాహరణకు.. విలువ ఆధారంగా కంపెనీలను ఎంచుకొని, వాటిలో మదుపు చేయడం. నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 500 ఇండెక్స్ షేర్ల నుంచి వీటిని ఎంచుకుంటారు. నిఫ్టీ 50లో మంచి రాబడినిచ్చే 20 కంపెనీలతో పెట్టుబడుల జాబితా తయారవుతుంది. ఇందులోనూ పెట్టుబడిపై వస్తున్న రాబడి, షేరు ఆర్జిస్తున్న ఆదాయం, పుస్తక విలువ, డివిడెండ్ రాబడి ఇలా కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలిస్తారు.
ఒకే విధానం కాకుండా..
ఏదో ఒక వ్యూహం ఆధారంగా షేర్లను ఎంపిక చేసుకొని, పెట్టుబడులు కొనసాగించడం వల్ల దీర్ఘకాలంలో లాభాలను ఆర్జించండం అంత తేలిక కాకపోవచ్చు. ఉదాహరణకు మార్కెట్ పరిస్థితులు బాగున్నప్పుడు.. ఆ దశలో కొన్ని షేర్లు మంచి పనితీరును చూపిస్తాయి. కానీ, మరో దశలో అది నిలదొక్కుకోకపోవచ్చు. మార్కెట్ చక్ర గమనంలో ఒకే వ్యూహం ఎప్పుడూ సరిపోకపోవచ్చు. ఇక్కడే బహుళ వ్యూహాలు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు నిఫ్టీ అల్ఫా లో వోలటాలిటీ 30 ఇండెక్స్. పేరులోనే ఉన్నట్లు.. ఇందులో తక్కువ హెచ్చుతగ్గులు ఉంటాయి. అస్థిరత తక్కువగా ఉంటూ.. రాబడి కాస్త అధికంగా లభించేలా ఇవి పనిచేస్తాయి. ఇక్కడ షేర్లను నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్క్యాప్ 50 నుంచి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా ఒకే ఇండెక్స్ లేదా ఈటీఎఫ్ ద్వారా పెట్టుబడిదారుడు.. బహుళ వ్యూహాలను పరిశీలించే ఫండ్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించవచ్చు.
లాభాలేమిటి?
ఫ్యాక్టర్ ఆధారిత వ్యూహం.. యాక్టివ్, ప్యాసివ్ ఫండ్ నిర్వహణ వ్యూహాలను మిళితం చేస్తుంది. దీనివల్ల మదుపరులు యాక్టివ్గా నిర్వహించే ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడులను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత నిష్క్రియా విధానంలో నిర్వహించే ఈటీఎఫ్ సూచీ ఫండ్లలోనూ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం ప్రక్రియ నిబంధనల మేరకు జరుగుతుంది. కాబట్టి, పెట్టుబడి నిర్ణయాల్లో మానవ ప్రమేయం అంతగా ఉండదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పెట్టుబడుల సమీక్ష జరుగుతుంది. కాబట్టి, పెట్టుబడిదారుడు రీబ్యాలెన్సింగ్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అనిశ్చితి సమయంలోనూ పెట్టుబడులను ఆరోగ్యకరంగా నిర్వహించేందుకు, వైవిధ్యమైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది తోడ్పడుతుంది. ఒకే వ్యూహం, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న షేర్లలో పెట్టుబడులు ఉండవు. కాబట్టి, నష్టభయం తగ్గుతుంది.
పెట్టుబడుల్లో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఫ్యాక్టర్ ఆధారిత ఈటీఎఫ్లను పరిశీలించవచ్చు. దీనివల్ల అటు యాక్టివ్, ఇటు ప్యాసివ్ పెట్టుబడుల ద్వారా వచ్చే ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మదుపరులు తమ ఆర్థిక లక్ష్యాలు, సాధించాల్సిన రాబడికి అనుగుణంగా పెట్టుబడి వ్యూహాలను పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడులే మంచి లాభాలను అందిస్తాయని అంచనా వేయొచ్చు.
- చింతన్ హారియా, హెడ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఆర్డీలపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేట్లు ఇవే..
దేశంలో దాదాపు అన్ని బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ అందిస్తున్నాయి. ఈ ఆర్డీలపై వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూడండి. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
గృహ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే..
మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి, ఇంటి రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు. -
క్రెడిట్ కార్డు బాధ్యతగా వాడండి
మీ జేబులో ఉన్న క్రెడిట్ కార్డు.. ఒక అద్భుతమైన ఆర్థిక సాధనం. చేతిలో డబ్బు లేకపోయినా కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు సరైన మార్గంలో ఉపయోగిస్తే.. అది మీ కోసం ఎన్నో పనులు చేస్తుంది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన బజాజ్ ఫైనాన్స్.. వారికి 8.85% వరకు వడ్డీ
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85 శాతం, సాధారణ పౌరులకు 8.6 శాతం వడ్డీ అందిస్తోంది. -
‘అమృత్ కలశ్’ గడువు మరోసారి పెంపు.. ఎప్పటి వరకంటే?
SBI news: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ‘అమృత్ కలశ్’ డిపాజిట్ పథకం గడువును మరోమారు పొడిగించింది. -
విదేశీ విద్యా రుణాలు, వివిధ అంశాల గురించి తెలుసుకోండి?
విద్యార్థులు విదేశీ చదువుకు..రుణ సంస్థల నుంచి పొందే ఆర్థిక సహాయంతో పాటు కొన్ని ముఖ్యమైన ఇతర అంశాల గురించి తెలుసుకోవాలి, అవేంటో ఇక్కడ చూడండి. -
రుణాలు.. తొందరగా తీర్చేద్దాం
అవసరానికి అప్పు చేయడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు.. ఇలా సులభంగా రుణం దొరికే మార్గాలున్న రోజుల్లో మన వద్ద లేని డబ్బును ఖర్చు చేసేప్పుడు ఆలోచించాల్సిందే. -
రూపే కార్డు వాడుతున్నారా? యూపీఐ యాప్ ద్వారా ఇక EMIగా మార్చుకోవచ్చు!
రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. యూపీఐ యాప్లో త్వరలో కొన్ని కొత్త ఫీచర్లు పలకరించబోతున్నాయి. -
బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
Flash Pay: కీ చైన్తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా