‘క్యాష్ ఆన్ డెలివరీ’ వీరి ఆలోచనే..
నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుంది. అందుకు సరైన ఉదాహరణ ఫ్లిప్కార్ట్.
ఇంటర్నెట్ డెస్క్: నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుంది. అందుకు సరైన ఉదాహరణ ఫ్లిప్కార్ట్. భారత్లోని కోటానుకోట్ల మంది ప్రజల సమయాన్ని ఆదా చేసి.. నాణ్యమైన ఉత్పత్తుల్ని ప్రజల వద్దకు చేర్చాలనుకున్నారు ఆ సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్. స్వయంగా వారే డెలివరీ బాయ్లుగా మారి తమ కలని నిజం చేసుకున్నారు. భారత్లో పుట్టుకొస్తున్న అంకుర సంస్థలకు ఆదర్శంగా నిలిచారు. ఆలోచన మంచిదైతే భారతీయులు ఆదరిస్తారన్న భరోసా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కల్పించారు.
ఇద్దరూ ఐఐటీయన్లే...
బిన్నీ, సచిన్ ఇరువురు చంఢీగఢ్కు చెందినవారే. ఐఐటీ దిల్లీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో పట్టా పొందారు. సచిన్ 2006లో అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరారు. అప్పటికే అక్కడ బిన్నీ సీనియర్ ఇంజినీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా జరిపే చర్చలతో ఇరువురి మధ్య బంధం పెరిగింది. ఒకరి లక్ష్యాలు ఒకరు పంచుకున్నారు. ఆ క్రమంలో చిగురించిందే హోమ్ డెలివరీ ఆలోచన. అమెజాన్ విజయసూత్రాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన వారు దాన్నే భారత్లో అమలుపరచాలనుకున్నారు.
వారే డెలివరీ బాయ్స్గా...
కేవలం రూ.4లక్షల పెట్టుబడితో ఫ్లిప్కార్ట్ని ప్రారంభించారు. బెంగళూరులోని ఓ అపార్టుమెంటు వారి తొలి కార్యస్థలం. పుస్తకాల హోం డెలివరీతో వారి బిజినెస్ ప్రారంభమైంది. విజయం ఊరికే వరించదు అనడానికి వీరి ప్రయాణమే నిదర్శనం. తొలినాళ్లలో స్వయంగా వారే స్కూటర్లపై బుక్స్ డెలివరీ చేసేవారు. అయితే ఫ్లిప్కార్ట్ని స్థాపించడానికి ముందు వారు ‘కంపారిజన్ సెర్చ్ ఇంజిన్’ని స్థాపించాలన్న ఆలోచన కూడా ఉండేదట. అప్పటికి భారత విపణిలో ఈ-కామర్స్కి ఉన్న ఆదరణ చాలా తక్కువ. అందుకే వారు ప్రత్యామ్నాయ ఆలోచనలను కూడా మదిలో ఉంచుకున్నారు.
ఈ-కామర్స్ని మలుపుతిప్పిన ఆలోచన...
ఒకసారి ఫ్లిప్కార్ట్ ప్రారంభించిన తర్వాత ఈ-కామర్స్ వృద్ధికి భారత్లో ఉన్న అడ్డంకులేంటో వారికి స్పష్టంగా అర్థమైంది. అప్పటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డు పేమెంట్లపై భారత్లో అవగాహన చాలా తక్కువ. మెట్రో నగరాలు మినహా మిగతా ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల్ని చాలా తక్కువగా వినియోగించేవారు. ఈ క్రమంలో వారికి వచ్చిన ఓ ఆలోచన ఈ-కామర్స్ బిజినెస్ రూపురేఖల్నే మార్చేసింది. అదే ‘క్యాష్ ఆన్ డెలివరీ(సీవోడీ)’. ఈ కొత్త వ్యవస్థతో ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది. దీంతో ఫ్లిప్కార్ట్ బిజినెస్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. అమెజాన్ భారత విపణిలోకి వచ్చినా.. దాని పోటీని తట్టుకొని నిలిచింది. ఈ క్రమంలో సంస్థ మనుగడ.. దీనిపై ఆధారపడ్డ వేలాది మంది ఉద్యోగుల ఉపాధిని కాపాడడం కోసం ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించిన ఇతర చిన్న సంస్థల్ని కొనుగోలు చేసింది. మొత్తానికి భారత్లో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా పేరుగాంచింది.
వాల్మార్ట్ చేతికి...
అమెరికా రిటైల్ దిగ్గజం ‘వాల్మార్ట్’ 2018లో ఫ్లిప్కార్ట్లో 77 శాతం వాటాని కొనుగోలు చేసింది. దీంతో బన్సల్ ద్వయానికి దాదాపు రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.4 లక్షల పెట్టుబడితో వచ్చిన వీరు రూ.100 కోట్ల సంపదను సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో భారత విపణిలో అంకుర సంస్థలకు దిక్సూచిగా మారారు. మంచి ఆలోచనలతో వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. సంస్థ సేవల్ని ప్రజలకు మరింత చేరువచేసేందుకు వాల్మార్ట్ కృషి చేస్తోంది. ప్రస్తుతం బన్సల్ ద్వయం వివిధ కారణాలతో ఫ్లిప్కార్ట్ నుంచి నిష్క్రమించారు. ఇతర బిజినెస్లను స్థాపించడంలో నిమగ్నమయ్యారు.
ఏదేమైనా భారత అంకుర సంస్థలకు బలాన్నిచ్చింది ఫ్లిప్కార్ట్ విజయమే అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ప్రజల సమస్యలకు నిజమైన పరిష్కారం చూపి.. వారికందించే సేవలకు విలువ జోడిస్తే ఎప్పటికీ ఆదరణ ఉంటుందని నిరూపించారు. అలాగే కలిసి పనిచేయడంలో ఉన్న స్ఫూర్తిని చాటిచెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి కోసం సిద్ధం ఇలా
సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? మీ దగ్గర ఎంత డబ్బుంది? గృహరుణం ఎంత తీసుకోవాలి? ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్నారా? ఈ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలతోనే లక్షల రూపాయలు ఆదా చేసుకునేందుకు మార్గం దొరుకుతుంది -
ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీపై పన్ను పడకుండా...
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను పరిధిలో లేనప్పుడు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) పడకుండా చూసుకుంటున్నారా? ఇందుకోసం ఏం చేయాలో తెలుసా? బ్యాంకు లేదా సంస్థల దగ్గర ఫారం 15జీ లేదా 15హెచ్ను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మూలం వద్ద పన్ను కోత విధించరు. -
జీవిత బీమా.. మీ బాధ్యతలను తీర్చేలా
మీ నెలవారీ ఆదాయం కిరాణా సామగ్రి, బిల్లులు చెల్లించడం, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులను తీర్చడంలో మీకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటుంది. మీ బడ్జెట్ ఖర్చులను పక్కన పెడితే.. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అత్యవసర ఖర్చులు, పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యలాంటి వాటి కోసం పొదుపు, మదుపు చేయాల్సిన అవసరమూ ఉంటుంది. -
బేరమాడితే తగ్గేను ప్రీమియం
కారు బీమా ఒక బాధ్యత. ఏడాదికోసారి దీన్ని పునరుద్ధరిస్తూనే ఉండాలి. అప్పుడే దీన్ని మీరు రోడ్డు మీద ఎలాంటి భయాలూ లేకుండా నడపగలరు. బీమా రక్షణ లేకుంటే.. అటు చట్టపరంగానూ, ఇటు ఆర్థికంగానూ చిక్కులు తప్పవు. -
నిఫ్టీ 50 షేర్లలో పెట్టుబడికి...
నవి మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక నిఫ్టీ 50 ఈటీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది. నవీ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ నేటితో ముగియనుంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.250. ఓపెన్ ఎండెడ్ పథకం. -
Elon Musk: బాల్యంలో కష్టాలు పడ్డా.. వదంతులకు చెక్ పెడుతూ మస్క్ పోస్ట్
Elon Musk: ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా అనేక విషయాలను పంచుకుంటుంటారు. అనేక మంది ట్వీట్లకు తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఇటీవల గనులపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సుదీర్ఘ ట్వీట్ చేశారు. -
Mukesh Ambani: ముకేశ్ అంబానీ.. 20 ఏళ్ల ఇండస్ట్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ విస్తరణలో ముకేశ్ అంబానీ కీలక పాత్ర పోషించారు. తండ్రి మరణం తర్వాత కంపెనీ బాధ్యతలు చేపట్టిన ఆయన సంస్థను అనేక రంగాలకు విస్తరించారు. -
Retirement: 50 ఏళ్లకే రిటైర్.. తర్వాత ఎలా? నితిన్ కామత్ సూచనలు
ఒకప్పటిలాగా 60 ఏళ్లు పనిచేసి, పదవీ విరమణ చేసే రోజులు కావివి. ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్యపరమైన పురోగతి కారణంగా ఆయుర్దాయం 80కి చేరింది. -
Nellore: చదువు మానేసి.. చాయ్తో రూ.5 కోట్లు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు.. ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) చదివి.. మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. -
లక్ష కోట్లకు చేర్చిన ఉక్కు మహిళ!
తక్కువమంది ఎంచుకునే రంగంలో అడుగుపెట్టడానికి సంకోచించేవారే ఎక్కువ. అమ్మాయిలను చదివించడమే గొప్పనుకునే రోజుల్లో ఆ సాహసం చేశారు సోమ మోండల్. ఓ మహిళ.. నాయకురాలన్న ఊహే కష్టమైన వేళ ఆ స్థానాన్ని అధిరోహించారు. -
Zepto: చిటికేసి... వేల కోట్లు సృష్టించిన చిన్నోళ్లు!
ఇంకా వయసు 20 దాటలేదు... చదువు పూర్తి కాలేదు....అలాంటి వారు... అప్పటికే మార్కెట్లో 20 ఏళ్ల అనుభవమున్నవారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చిన వారికి అనుమానం! ఈ కుర్రాళ్లా మా సామర్థ్యాన్ని నిర్ణయించేదని? వీళ్లా మాకు కొలువిచ్చేదని? ఆ -
Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. భారత్లో ఈక్విటీ మదుపర్లకు బెంచ్మార్క్గా చెప్పుకునే రాకేశ్ ఝున్ఝున్వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. -
Savitri Jindal: ఆసియా సంపన్న మహిళ.. సావిత్రి జిందాల్
ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్కు చెందిన సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ ఛైర్పర్సన్ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్ -
తక్కువ నష్టానికీ వ్యూహాలు!
‘ప్రపంచమంతా అధిక ధరలతో.. ఆ ప్రభావం వల్ల ఏర్పడుతున్న మందగమనంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, మదుపర్లు.. ముఖ్యంగా తొలిసారి డబ్బులు పెడుతున్నవారు తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాల’ని స్విస్ పెట్టుబడిదారు,‘ది గ్లూమ్ బూమ్ డూమ్’ ఎడిటర్ మార్క్ ఫాబర్ సూచిస్తున్నారు. ‘అమెరికాలో వడ్డీరేట్లు అధికంగా పెంచబోరని, 6 నెలల్లో తగ్గించడం ప్రారంభం కావచ్చ’ని వార్తా సంస్థ ‘ఇన్ఫామిస్ట్’కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ.. -
Gita Gopinath: ‘గీత’లు చెరిపేస్తూ.. మరో ఘనత సాధించిన గీతా గోపీనాథ్..!
ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులై రికార్డు సృష్టించారు భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్. -
దాన లక్ష్ములు!
‘నా సంపదలో సగం దానం చేస్తా’ రెండేళ్ల క్రితం మెకంజీ స్కాట్ మాట ఇది! అన్నట్టుగానే ఏటా ఆమె దానాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు. -
Microsoft India COO: జీవితం పిజ్జా లాంటిది.. ఆ ఐదూ ఉండాల్సిందే!
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది. -
‘యూనికార్న్’ అంటే నమ్మలేకపోయా!
మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్టెక్ రంగంలో మాత్రం చాలా అరుదు. -
జోడీ నెంబర్ 1
కంబైన్డ్ స్టడీతో మార్కులు కొల్లగొట్టిన విద్యార్థుల్ని చూశాం. సివిల్స్ సాధించిన భార్యాభర్తల గాథలు విన్నాం. -
ఆఫీసు బాయ్ నుంచి కోట్ల వ్యాపారం దాకా!
‘ఇది కాదు... ఇది కానే కాదు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు... నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు... అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా నా -
ఆ రోజు... చనిపోతాననుకున్నా!
గౌతమ్ అదానీ.. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీపడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు అధినేత.
తాజా వార్తలు (Latest News)
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం