స్కార్పియో- ఎన్‌ ధరల శ్రేణి రూ.15.45 లక్షలు- 21.45 లక్షలు

మహీంద్రా అండ్‌ మహీంద్రా తన కొత్త స్కార్పియో- ఎన్‌ ఎస్‌యూవీ (ఆటోమేటిక్‌, 4 వీల్‌డ్రైవ్‌)కి పరిచయ ధరలను బుధవారం ప్రకటించింది. తొలి 20,000 బుకింగ్‌లకు ధరల శ్రేణి రూ.15.45 లక్షల నుంచి రూ.21.45 లక్షల వరకు ఉంటుందని తెలిపింది. స్కార్పియో- ఎన్‌ను ఈ ఏడాది

Published : 22 Jul 2022 03:11 IST

తొలి 20,000 బుకింగ్‌లకే

ముంబయి: మహీంద్రా అండ్‌ మహీంద్రా తన కొత్త స్కార్పియో- ఎన్‌ ఎస్‌యూవీ (ఆటోమేటిక్‌, 4 వీల్‌డ్రైవ్‌)కి పరిచయ ధరలను బుధవారం ప్రకటించింది. తొలి 20,000 బుకింగ్‌లకు ధరల శ్రేణి రూ.15.45 లక్షల నుంచి రూ.21.45 లక్షల వరకు ఉంటుందని తెలిపింది. స్కార్పియో- ఎన్‌ను ఈ ఏడాది జూన్‌ 27న ఐదు వేరియంట్లలో (జెడ్‌2, జెడ్‌4, జెడ్‌6, జెడ్‌8, జెడ్‌8ఎల్‌) కంపెనీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వీటికి బుకింగ్‌లు జులై 30 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త స్కార్పియో- ఎన్‌ పెట్రోలు, డీజిల్‌ ఇంజిన్‌ రకాల్లో లభ్యం కానుంది. మ్యాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ల్లో దేనినైనా ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని