Business news: 20 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యం
సెమీ కండక్టర్ చిప్సెట్ల లభ్యత మెరుగవుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 20 లక్షల కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ఛైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. 2021-22 కంపెనీ వార్షిక నివేదికలో వాటాదార్లకు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
2022-23పై మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్సీ భార్గవ
దిల్లీ: సెమీ కండక్టర్ చిప్సెట్ల లభ్యత మెరుగవుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 20 లక్షల కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ఛైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. 2021-22 కంపెనీ వార్షిక నివేదికలో వాటాదార్లకు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సవాలుతో కూడిన ఈ లక్ష్యాన్ని చేరడంలో, మధ్యస్థాయి ఎస్యూవీ గ్రాండ్ విటారా ముఖ్య భూమిక పోషిస్తుందని భార్గవ పేర్కొన్నారు. వార్షిక నివేదిక ప్రకారం..
* 2021-22లో మారుతీ సుజుకీ 13.4 శాతం వృద్ధితో 16.52 లక్షల కార్లను విక్రయించింది. తొలి త్రైమాసికంలో కొవిడ్ మహమ్మారి ప్రభావం, సెమీ కండక్టర్ల కొరత వల్ల దేశీయ విక్రయాలు బాగా తగ్గాయి.
* ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంపెనీ వద్ద 2.7 లక్షల కార్ల బుకింగ్లు పెండింగ్లో ఉన్నాయి. గిరాకీ ఉన్న కార్లు తయారు చేయలేకపోవడంతో, మార్కెట్ వాటా దాదాపు 50 శాతం నుంచి 43.4 శాతానికి తగ్గింది.
హ్యాచ్బ్యాక్లకు గిరాకీ తగ్గుతున్నందునే
మారుతీ సుజుకీకి హ్యాచ్బ్యాక్ మోడళ్ల అమ్మకాలే ఇటీవలి వరకు అధికంగా ఉండేవి. అయితే 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో విక్రయాలు 5 శాతం, 2018-19తో పోలిస్తే 29 శాతం మేర తగ్గాయి. ఇదే సమయంలో ఎస్యూవీలకు గిరాకీ పెరుగుతుంది. అందువల్ల మారుతీ సుజుకీ కూడా తమ ఎస్యూవీ మోడళ్లను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బ్రెజాను రీమోడలింగ్ చేసి గ్రాండ్ విటారాగా అంతర్జాతీయంగా విడుదల చేస్తుండటం మారుతీకి కలిసొస్తుందని భార్గవ తెలిపారు. మరిన్ని మోడళ్లను కూడా తీసుకురావడం ద్వారా ఎస్యూవీ విభాగంలో మార్కెట్ వాటా పెంచుకుంటామని తెలిపారు.
* గ్రాండ్ విటారాను టయోటా హైబ్రిడ్ సాంకేతికతతో కర్ణాటక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. దేశీయంగా ఈ తరహా సరికొత్త సాంకేతికతతో రూపొందుతున్న తొలి కారు ఇదే.
2024-25లో విద్యుత్తు కారు
సుజుకీ మోటార్ కార్పొరేషన్ గుజరాత్ ప్లాంట్లో 2024-25 నుంచి విద్యుత్ మోడళ్ల ఉత్పత్తి ప్రారంభిస్తుంది. మారుతీ సుజుకీ ఇండియా ఆ వాహనాలను విక్రయిస్తుంది. విద్యుత్తు వాహనాలకు గిరాకీ బాగా పెరిగే వరకు, కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు సీఎన్జీ, ఇథనాల్, బయోగ్యాస్, హైబ్రిడ్ మోడళ్లను ప్రోత్సహించాలని భార్గవ సూచించారు.
కొత్తప్లాంటు తొలిదశపై రూ.11000 కోట్ల పెట్టుబడి
‘హరియాణాలో కొత్త తయారీ ప్లాంట్ తొలి దశ నిర్మాణం కోసం రూ.11,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నామ’ని భార్గవ తెలిపారు. ‘2025లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. తదుపరి ఏడాది రెండో ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల తయారీ ప్లాంట్గా దీన్ని తీర్చిదిద్దుతాం. హరియాణాతో పాటు దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని మారుతీ సుజుకీ ఛైర్మన్ వివరించారు.
* దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు 2021-22లో 30,69,499గా నమోదయ్యాయి. 2020-21లో ఇవి 27,11,457 మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..