విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై రాయితీ తగ్గింపు

విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్‌ 1 నుంచి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. కిలోవాట్‌అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌)కు సబ్సిడీని రూ.5,000 మేర తగ్గించనున్నట్లు భారీ పరిశ్రమల శాఖ  నోటిఫికేషన్‌ పేర్కొంది.

Updated : 23 May 2023 12:39 IST

కిలోవాట్‌అవర్‌కు రూ.5000 మేర కోత
జూన్‌ 1 నుంచి అమల్లోకి: నోటిఫికేషన్‌

దిల్లీ: విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్‌ 1 నుంచి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. కిలోవాట్‌అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌)కు సబ్సిడీని రూ.5,000 మేర తగ్గించనున్నట్లు భారీ పరిశ్రమల శాఖ  నోటిఫికేషన్‌ పేర్కొంది. విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రెండో దశ(ఫేమ్‌-2) కింద వాహన తయారీదార్లకు కేడబ్ల్యూహెచ్‌కు రూ.15,000 వరకు ప్రభుత్వం సబ్సిడీనందిస్తోంది. దీన్ని రూ.10,000కు తగ్గించనున్నారు. ఈ వాహనాల కొనుగోలుకు ఇచ్చే ప్రోత్సాహకాలకు, ప్రస్తుతం వాహన వ్యయంలో 40% వరకు పరిమితి ఉండగా.. ఇకపై ఆ పరిమితిని వాహనాల ఎక్స్‌-ఫ్యాక్టరీ ధరలో 15 శాతానికి తగ్గించనున్నారు. సవరించిన సబ్సిడీ 2023 జూన్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకునే అన్ని విద్యుత్‌ ద్విచక్రవాహనాలకు వర్తిస్తుందని నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీ, విక్రయాలకు ఊతమివ్వడం కోసం ఈ పథకాన్ని 2019 జూన్‌లో ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని