మేలో రికార్డు అమ్మకాలు
దేశీయంగా మే నెలలోనూ వాహన టోకు విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ వినియోగ వాహనా (ఎస్యూవీ)లకు అధిక గిరాకీ లభించింది. మొత్తం ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) సరఫరాల్లో ఎస్యూవీల వాటాయే 47 శాతం అంటే, వీటికి ఎంతగా ఆదరణ పెరిగిందో అర్థమవుతుంది.
ప్రయాణికుల వాహనాల్లో 47% వాటా ఎస్యూవీలదే
చిన్నకార్ల అమ్మకాల్లో భారీ కోత
దిల్లీ: దేశీయంగా మే నెలలోనూ వాహన టోకు విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ వినియోగ వాహనా (ఎస్యూవీ)లకు అధిక గిరాకీ లభించింది. మొత్తం ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) సరఫరాల్లో ఎస్యూవీల వాటాయే 47 శాతం అంటే, వీటికి ఎంతగా ఆదరణ పెరిగిందో అర్థమవుతుంది. వాహన టోకు విక్రయాల్లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ), హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఖీఎం), టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థలు ఘనంగా రాణించాయి. టాటా మోటార్స్, కియా ఇండియా, ఎంజీ మోటార్ ఇండియా అమ్మకాలూ పెరిగాయి. ద్విచక్ర వాహన విక్రయాలూ మెరుగ్గా ఉన్నాయి.
మారుతీ సుజుకీ: దేశీయంగా ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్ల) విక్రయాలు 15% పెరిగాయి. 2022 మేలో 1,24,474 వాహనాలను డీలర్లకు అందించగా, గత నెలలో ఈ సంఖ్య 1,43,708కి పెరిగింది. ఆల్టో, ఎస్ ప్రెసో వంటి మోడళ్లతో కూడిన చిన్నకార్ల అమ్మకాలు మాత్రం 17,408 నుంచి 30% తగ్గి 12,236కు పరిమితం అయ్యాయి.
హ్యుందాయ్ మోటార్: క్రెటా, వెన్యూ వంటి ఎస్యూవీల సాయంతో విక్రయాలు 42,293 నుంచి 14.91% పెరిగి 48,601కి చేరాయి.
టాటా మోటార్స్: దేశీయ విక్రయాలు 6%పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో కలిపి విద్యుత్తు వాహనాల సరఫరాలు 3505 నుంచి 66% అధికమై 5805కు చేరాయి.
* ప్లాంటు నిర్వహణ పనులు చేపట్టిన కియా ఇండియా సరఫరాల్లోనూ 3% వృద్ధి లభించింది. మహీంద్రా వినియోగ వాహనాల సరఫరాలు 23% అధికమయ్యాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ సరఫరాలు రెట్టింపయ్యాయి. అర్బన్ క్రూజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్, హైలక్స్ మోడళ్లకు ఖాతాదార్ల నుంచి గిరాకీ బాగుందని సంస్థ పేర్కొంది.
మే నెలలో ఇన్ని కార్లు ఇప్పుడే: మే నెలలో అన్ని సంస్థలవి కలిపి ప్రయాణికుల వాహన సరఫరాలు 3.34 లక్షలుగా ఉన్నట్లు ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 2022 మే సరఫరాల కంటే ఇవి 13.5% ఎక్కువన్నారు. మే నెలలో ఇన్ని వాహనాలను డీలర్లకు కంపెనీలు సరఫరా చేయడం ఇప్పుడే అన్నారు. ఇంతకుముందు గరిష్ఠ స్థాయి 2018 మేలో నమోదైన 3.10 లక్షల వాహనాలే. మారుతీ అమ్మకాల్లో ఎస్యూవీల వాటా 12% నుంచి 21 శాతానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
Automobile Sales: ఫిబ్రవరి వాహన విక్రయాల్లో 13% వృద్ధి
Automobile Sales: ఫిబ్రవరిలో వాహన విక్రయ గణాంకాలను ఫాడా గురువారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన గత నెలలో 13 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM