మదుపు బాటలో.. తొలి అడుగులు..
తొలి సంపాదన ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఇలాంటి సంతోషకరమైన సమయంలోనే పెట్టుబడులూ ప్రారంభిస్తే.. దీర్ఘకాలంలో అది గొప్ప నేస్తంగా మిగిలిపోతుంది. ఇప్పుడు చాలామంది యువత
తొలి సంపాదన ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఇలాంటి సంతోషకరమైన సమయంలోనే పెట్టుబడులూ ప్రారంభిస్తే.. దీర్ఘకాలంలో అది గొప్ప నేస్తంగా మిగిలిపోతుంది. ఇప్పుడు చాలామంది యువత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా మదుపు చేసే క్రమంలో కొన్ని విషయాల్లో అప్రమత్తత అవసరం.
కొంతమంది డబ్బును దాచుకోవడం అంటే.. నగదు రూపంలో లేదా పొదుపు ఖాతాలో అలాగే అట్టిపెట్టడం అనుకుంటారు. ఖర్చులను తగ్గించుకొని, వీలైనంత మొత్తాన్ని పక్కన పెట్టడం మంచి అలవాటే. కానీ, ఆ మొత్తం పెరిగేందుకు అవకాశాన్ని ఇవ్వాలి. అందుకే, ప్రతి రూపాయీ మరో రూపాయిని సంపాదించేలా కష్టపెట్టాలి.
కొత్తగా మార్కెట్లో పెట్టుబడుల మార్కెట్లోకి అడుగు పెట్టిన వారు.. తమ పెట్టుబడుల జాబితాలో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఇందులో కొన్ని సురక్షితమైన పెట్టుబడులు ఉంటే.. మరికొన్ని వృద్ధి ఆధారిత పథకాలు ఉండాలి. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, డిపాజిట్లు, బంగారంలాంటివన్నీ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఒకే పథకంపై ఎక్కువగా ఆధారపడటం ఎప్పుడూ క్షేమం కాదు.
ఒక పథకం గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అప్పుడే మన లక్ష్యాలకు అది సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. షేర్లలో నేరుగా మదుపు చేయాలంటే.. మీకు తగిన సమయం ఉండాలి. మార్కెట్ పోకడలను అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీ షేరు ఎందుకు పెరుగుతోంది.. ఎందుకు పడిపోతోంది. ఆర్థిక వ్యవస్థ పనితీరు.. ఇలా అనేక అంశాలు తెలిసి ఉండాలి. ఎవరో చెప్పారని.. షేర్లను ఎంచుకుంటే.. చాలాసార్లు నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.
మీ పెట్టుబడి వ్యూహాన్ని నిర్ణయించుకునే ముందు.. నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి. అప్పుడే షేర్లలో మదుపు చేయాలా.. లేకపోతే.. ఇండెక్స్ ఈటీఎఫ్లలాంటి ఎంచుకోవాలా అన్నదీ తెలుస్తుంది.
సంపదను సృష్టించాలంటే.. పెట్టుబడులు తప్పనిసరి. అయితే, ఎప్పుడు మదుపును ప్రారంభిస్తున్నామన్నదీ కీలకమే. చిన్న వయసు నుంచే మదుపు చేస్తే.. దీర్ఘకాలంలో మంచి నిధి సొంతం అవుతుంది. భావోద్వేగాలకు తావీయకూడదు. చిన్న మొత్తంతోనైనా.. విభిన్న పెట్టుబడులను ఎంచుకొని, వీలైనంత కాలం కొనసాగించండి. అప్పుడే విజయవంతమైన మదుపరిగా మారతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్