పింఛను హామీతో..

పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా పింఛను రావాలని కోరుకునే వారికి యాన్యుటీ పథకాలు అనువుగా ఉంటాయి. ఒకేసారి ప్రీమియం చెల్లించి, జీవితాంతం వరకూ పింఛను

Updated : 13 Aug 2021 03:25 IST

దవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా పింఛను రావాలని కోరుకునే వారికి యాన్యుటీ పథకాలు అనువుగా ఉంటాయి. ఒకేసారి ప్రీమియం చెల్లించి, జీవితాంతం వరకూ పింఛను వచ్చే ఏర్పాటు ఇందులో ఉంటుంది. ఇలాంటి పాలసీలు ఇప్పటికే అనేకం అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీఎస్‌ఎల్‌ఐ) ఈ కోవలోనే కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఏబీఎస్‌ఎల్‌ఐ గ్యారంటీడ్‌ యాన్యుటీ ప్లస్‌ పేరుతో ఈ పాలసీని ఆవిష్కరించింది. పదవీ విరమణ చేసిన తర్వాత అవసరాలకు ఈ యాన్యుటీ పథకం తోడ్పడుతుందని పేర్కొంది. ఒకేసారి ప్రీమియం చెల్లించే ఈ పాలసీలో పాలసీదారుడికి పింఛను ఎంచుకునేందుకు 10 రకాల ఐచ్ఛికాలున్నాయి.

జీవితాంతం పింఛను వచ్చేలా..  పాలసీదారుడి తదనంతరం జీవిత భాగస్వామికీ పింఛను లభించేలా ఏర్పాటు చేయొచ్చు. డిఫర్డ్‌ యాన్యుటీని ఎంచుకుంటే... ఇప్పుడు పెట్టుబడి పెట్టి, పదవీ విరమణ తర్వాత పింఛను తీసుకోవచ్చు. 80 ఏళ్ల వయసు వచ్చాక యాన్యుటీని పూర్తిగా రద్దు చేసుకొని, పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. టాపప్‌ ద్వారా యాన్యుటీని పెంచుకోవడం తదితర ఆప్షన్లు ఉన్నాయి. ‘మహమ్మారి తర్వాత ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం అవుతోంది. పదవీ విరమణ చేసిన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని,క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జించాలనుకునే వారికి ఈ యాన్యుటీ ప్లాను సహాయంగా ఉంటుంది’ అని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ-సీఈఓ కమలేశ్‌ రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని