హీరో ప్లెజర్‌ + ఎక్స్‌టెక్‌ స్కూటర్‌

హీరో మోటోకార్ప్‌ ప్లెజర్‌ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసింది. 110 సీసీ ఇంజిన్‌ కలిగిన ప్లెజర్‌+ ఎక్స్‌టెక్‌ స్కూటర్‌ రెండు వెర్షన్‌ల్లో లభించనుంది. వీటి ధరలు వరుసగా రూ.61,900, రూ.69,50....

Updated : 12 Oct 2021 08:51 IST

ప్రారంభ ధర రూ.61,900

దిల్లీ: హీరో మోటోకార్ప్‌ ప్లెజర్‌ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసింది. 110 సీసీ ఇంజిన్‌ కలిగిన ప్లెజర్‌+ ఎక్స్‌టెక్‌ స్కూటర్‌ రెండు వెర్షన్‌ల్లో లభించనుంది. వీటి ధరలు వరుసగా రూ.61,900, రూ.69,500 (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. దేశంలో ప్రజాదరణ పొందిన మోడళ్లలో ప్లెజర్‌+ 110 స్కూటర్‌ ఒకటని, కొత్త వెర్షన్‌లో పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్లు హీరో మోటోకార్ప్‌ హెడ్‌ (స్ట్రాటజీ, గ్లోబల్‌ ప్రోడక్ట్‌ ప్లానింగ్‌) మలో లీ మాసన్‌ తెలిపారు. ప్రొజెక్టర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, బ్లూటూత్‌ అనుసంధానత, హీరో ఐ3ఎస్‌ టెక్నాలజీతో మెరుగైన ఇంధన సామర్థ్యం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని