అశోక్ లేలాండ్ ఎండీ, సీఈఓ విపిన్ రాజీనామా
హిందుజా గ్రూప్ సంస్థ అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) పదవులకు విపిన్ సోంధి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు కంపెనీ వెల్లడించింది
ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ధీరజ్ హిందుజా
దిల్లీ: హిందుజా గ్రూప్ సంస్థ అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) పదవులకు విపిన్ సోంధి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు కంపెనీ వెల్లడించింది. వ్యాపార కొనసాగింపులో భాగంగా ధీరజ్ హిందుజా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారని తెలిపింది. త్వరలోనే బోర్డు సమావేశమై, తదుపరి సీఈఓ, ఎండీని ఎంపిక చేస్తుందని అశోక్ లేలాండ్ తెలిపింది. ప్రస్తుతం నాన్-ఎగ్జిక్యూటివ్, స్వతంత్రేతర డైరెక్టర్-ఛైర్పర్సన్గా సేవలు అందిస్తున్న హిందుజా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా మారారని పేర్కొంది. 2021 డిసెంబరు 31న బాధ్యతల నుంచి తప్పుకోనున్న సోంధి, యాజమాన్య బదిలీ ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?