వొడాఫోన్ ఐడియా 5జీ డేటా వేగం 4జీబీపీఎస్
తాము నిర్వహించిన ప్రయోగాత్మక 5జీ పరీక్షల్లో సెకనుకు 4 గిగాబిట్ (జీబీపీఎస్) డేటా వేగాన్ని అందుకున్నట్లు వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) తెలిపింది. ఇప్పటిదాకా దేశంలో ఒక టెలికాం
పుణె: తాము నిర్వహించిన ప్రయోగాత్మక 5జీ పరీక్షల్లో సెకనుకు 4 గిగాబిట్ (జీబీపీఎస్) డేటా వేగాన్ని అందుకున్నట్లు వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) తెలిపింది. ఇప్పటిదాకా దేశంలో ఒక టెలికాం సంస్థ సాధించిన అత్యధిక వేగం ఇదే. భవిష్యత్లో వేలానికి వచ్చే 26 గిగాహెర్ట్జ్/మిల్లీమీటర్ బ్యాండ్లో ఈ వేగాన్ని సాధించింది. పరీక్షల్లో 4.2 జీబీపీఎస్ వరకు వేగాన్ని సాధించగలిగామని వీఐఎల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ పేర్కొన్నారు. 30-35 మొబైల్ టవర్లను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేశామని.. 5జీకి మద్దతు ఇచ్చేలా ఇతర నెట్వర్క్ వసతులనూ పెంచుతున్నట్లు వివరించారు. పరీక్షల సమయంలో డౌన్లోడ్ వేగం 3.8-4.1 జీబీపీఎస్ మధ్య ఊగిసలాడిందన్నారు. బ్యాక్ ఎండ్ డేటా ట్రాన్సిమిషన్లో వీఐఎల్ నెట్వర్క్పై గరిష్ఠంగా 9.85 జీబీపీఎస్ వేగాన్ని నమోదు చేసినట్లు టెలికాం గేర్ తయారీ కంపెనీ నోకియా ఇండియా గతంలో పేర్కొంది. ప్రస్తుతం నోకియాతో కలిసి గాంధీనగర్లో, ఎరిక్సన్తో కలిసి పుణెలో వీఐఎల్ 5జీ పరీక్షలను నిర్వహిస్తోంది. మే 2022 వరకు లేదా స్పెక్ట్రమ్ వేలం ఫలితాలు వచ్చేంతవరకు ఏది ముందైతే అంత వరకు 5జీ పరీక్షలు కొనసాగుతాయని సింగ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు